కన్న కూతురిపై అత్యాచారం, ఫ్రెంచి రాయబారి పై కేసు నమోదు

పతన విలువలకి పరాకాష్ట ఇది. బెంగుళూరు లో నియమితుడైన ఫ్రాన్సు రాయబారి మూడున్నరేళ్ల కూతురుపై అత్యాచారం జరిపినట్లు బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రాయబారిని ఇంకా అరెస్టు చేయలేదని ఎన్.డి.టి.వి తెలిపింది. రాయబారి దేశం విడిచి వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకోవాలని భారతీయురాలైన అతని భార్య హోమ్ మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖలకు లేఖలు రాసింది. ఫ్రెంచి జాతీయులైన తమ ముగ్గురు పిల్లలను భర్త కస్టడీకి ఇవ్వరాదని ఆమె డిమాండ్ చేస్తోంది. ఫ్రెంచి రాయబారిపై కేసు…

ఉచ్ఛనీచాలు మరిచిన కొడుకుని చంపించిన తల్లిదండ్రులు

ఇదో హృదయ విదారకమైన కధ. తాగి అరాచకం సృష్టించడమే కాక తల్లితోనే అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకుని ఎలా బాగు చేయాలో ఆ వృద్ధ దంపతులకు అర్ధం కాలేదు. కొడుకు తన జీవితం నాశనం కేస్య్కోవడమే కాక, తాగి వచ్చి కోడలిని విపరీతంగా కొడుతున్నా బలహీనులైన వృద్ధులు అడ్డుకోలేకపోయారు. దెబ్బలు తట్టుకోలేక కోడలు పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళిపోతున్నా ధైర్యం చెప్పి అండ నిలవలేకపోయారు. పనికి పోకుండా తాగి తందనాలాడుతూ డబ్బుల కోసం తమనే వేధిస్తుంటే సహిస్తూ బతికారు.…

తిండిలేక చనిపోతున్న యెమెన్ పిల్లలు సం.కి 34,000 -ఫొటోలు

యెమెన్ దేశంలో అత్యధిక శాతం పిల్లలు పోషకాహారం లేక చనిపోతున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 58 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతుండగా, 46 శాతం మంది తక్కువ బరువుతో తీసుకుంటున్నారని యునిసెఫ్ ప్రకటించింది. ఐదేళ్లలోపే చనిపోతున్న పిల్లల్లో 60 శాతం మంది పోషకాహార లోపం వల్లనే చనిపోతున్నారని ఆ సంస్ధ తెలిపింది. ఫలితంగా యెమెన్ లో పోషకార లోపం వల్ల ప్రతి సంవత్సరం 34,000 మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహార లోపం వల్ల…