అమెరికా ఆశల మేరకు చైనాతో మిలట్రీ పోటీకి ఇండియా అనాసక్తి?

అమెరికా ప్రకటించిన ‘ఆసియా-పసిఫిక్’ విధానంలో చైనాతో మిలట్రీ పోటీకి ఇండియాను నిలపడం పట్ల భారత రక్షణ మంత్రి అనాసక్తి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఆసియా పై అమెరికా కేంద్రీకరణ పెరగడం వల్ల పొరుగున ఉన్న సముద్రాల్లో ముఖ్యంగా బంగాళాఖాతంలో ఆయుధ పోటీ పెరుగుతుందని ఇండియా భావిస్తున్నట్లు భారత అధికార వర్గాలను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. అమెరికా తన విధానాన్ని పునరాలోచించాలనీ, పునర్మూల్యాంకనం చేసుకోవాలని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టాకు భారత్ సూచించిందని అధికారులు తెలిపారు. ‘ఆసియా-పసిఫిక్ కేంద్రంగా…

కూలోడి కడుపుకి రు.28, ప్లానింగ్ ఆఫీసర్ టాయిలెట్ కి రు.35 లక్షలు

భారత దేశ పల్లెల్లో బతికే కూలోడికి రోజుకి రు. 28 చాలని చెప్పిన ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తన కార్యాలయంలో ఆఫీసర్లు వాడే రెండు టాయిలెట్ల ఆధునీకరణ కోసం రు. 35 లక్షలు ఖర్చు పెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ టాయిలేట్ లో దొంగలు పడతారేమోనని సి.సి.టి.వి కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నాడు. ఇది కేవలం పైలట్ ప్రాజెక్టేనట. ఇది సక్సెస్ అయితే ప్లానింగ్ కమిషన్ కార్యాలయం ‘యోజన భవన్’ లో టాయిలెట్లన్నీ అలాగే…