స్టక్స్ నెట్, ఫ్లేమ్: ‘ఇంటర్నెట్ హై వే’ పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -1

‘నూనం-మానం, సిగ్గు-లజ్జ, చీము-నెత్తురు, నీతి-నియమం’ ఇలాంటివేవీ తాము ఎరగమని అమెరికా పాలక వ్యవస్ధ మరోసారి చాటుకుంది. ‘అమెరికా ఎంతకైనా తెగిస్తుంది’ అని చాటుకోవడంలో అమెరికా అధ్యక్షులు మినహాయింపు కాదని అమెరికా పత్రికలే నిర్ద్వంద్వంగా ఇంకోసారి తేల్చి చెప్పాయి. ఇరాన్ దేశ కంప్యూటర్లపై దాడి కోసం ‘కంప్యూటర్ వైరస్’ లను సృష్టించి, దుర్మార్గమైన ‘సైబర్ వార్’ కి తెర తీయడం వెనుక అమెరికా అధ్యక్షుడు ‘బారక్ ఒబామా’ ప్రత్యక్ష అనుమతి ఉందని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక వెల్లడి చేసింది.…

‘అన్నా బృందం’ పయనం ఎటు? -కార్టూన్

భారత దేశ ‘రాజకీయ వ్యవస్ధ’, ‘బ్యూరోక్రసీ’ ల అవినీతి పై ‘ఉద్యమాస్త్రం’ ఎక్కు పెట్టిన అన్నా బృందాన్ని విడదీసి తేలిక చేయడంలో ఇరు వ్యవస్ధలూ సఫలం అయినట్లే కనిపిస్తోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు కుంభకోణంలో నిందితుడిగా అన్నా బృందం తాజాగా ఆరోపణలు చేయగా, సదరు ఆరోపణలను అన్నాయే ఆమోదించడం లేదని ఆయన ప్రకటనలు చెబుతున్నాయి. కర్ణాటక మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే మన్మోహన్ పై ఆరోపణలను నమ్మలేకున్నాడు. స్వామి అగ్నివేశ్ తో సహా అనేకమంది బృందం సభ్యులు…

గాలికి బెయిలు కేసు: సి.బి.ఐ రాష్ట్ర వ్యాపిత దాడులు

రు. 10 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని ‘గాలి జనార్ధన రెడ్డి’ కి సి.బి.ఐ కోర్టు జడ్జి బెయిల్ మంజూరు చేసిన కేసులో సి.బి.ఐ రాష్ట్ర వ్యాపితంగా దాడులు నిర్వహించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. లంచం తీసుకుని బెయిల్ ఇచ్చినందుకు సి.బి.ఐ కేసుల కోసం నియమించబడిన ఫస్ట్ అడిషనల్ స్పెషల్ జడ్జి టి.పట్టాభి రామారావు గురువారం సస్పెన్షన్ కు గురయ్యాడు. హైద్రాబాద్, నాచారంలోని ఒక రౌడీ షీటర్, మరొక రిటైర్డ్ జడ్జిలు గాలి, జడ్జి ల మధ్య ఒప్పందం…