ప్రధాని పై సి.బి.ఐ విచారణ వృధా -అన్నా బృందం

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మంత్రిత్వంలో చోటు చేసుకున్న ‘బొగ్గు గనుల కుంభకోణం’ పై సి.బి.ఐ విచారణకు ఆదేశిస్తే అది వృధా ప్రయాసేనని అన్నా బృందం కొట్టిపారేసింది. విచారణ సి.బి.ఐ కి అప్పగిస్తే ప్రధానికి ‘క్లీన్ చిట్’ ఇవ్వడం ఖాయమని పేర్కొంది. ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ అయిన సి.బి.ఐ ప్రధాని పై విచారణ ఎలా చేస్తుందని ప్రశ్నించింది. కాంగ్రెస్ రాజకీయ మిత్రులయిన ములాయం, మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ లపై సంవత్సరాల తరబడి విచారణ చేస్తున్నా…

దళిత రక్తం రుచిమరిగిన అగ్ర కుల దురహంకారి ‘బ్రహ్మేశ్వర్ ముఖియా’ హత్య

‘బచర్ ఆఫ్ బీహార్’, స్త్రీలు, పిల్లలతో సహా రెండు వందలకు పైగా దళితులను పాశవికంగా చంపేసిన అగ్రకుల దురహంకారి ‘బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా’ శుక్రవారం ఉదయం హత్యకు గురయ్యాడు. ‘మార్నింగ్ వాక్’ కి వెళ్ళిన ముఖియాను గుర్తు వ్యక్తులు సమీపం నుండి తుపాకితో కాల్చి చంపారని ఎన్.డి.టి.వి తెలిపింది. హత్య జరిగిన ‘అర్రా’ పట్టణం ఇప్పుడు కర్ఫ్యూ నీడన బిక్కు బిక్కు మంటోంది. దశాబ్దానికిపైగా బీహార్ అగ్రకుల భూస్వాముల తరపున రాష్ట్రం అంతటా రక్తపుటేరులు పారించిన ముఖియా…

అమెరికా ‘నేషనల్ స్పెల్లింగ్ బీ’ ఛాంపియన్ తెలుగమ్మాయి

అమెరికా లో నిర్వహించే ప్రఖ్యాత ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ ఛాంపియన్ షిప్ ను ఈసారి తెలుగమ్మాయి ‘స్నిగ్ధ నందిపాటి’ గెలుచుకుంది. ప్రవాస భారతీయులు ఈ ట్రోఫీ గెలుచుకోవడం ఇది వరుసగా అయిదవసారి కావడం గమనార్హం. గత 14 సంవత్సరాలలో పది సార్లు ప్రవాస భారతీయులే ఈ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారని ‘ది హిందూ’ తెలిపింది. తొమ్మిది మంది ఫైనలిస్టులలో అగ్రస్ధానం పొందిన స్నిగ్ధ 30,000 డాలర్ల (దాదాపు 16.5 లక్షల రూపాయలు) ప్రైజ్ మనీతో పాటు…

ప్రశ్నించే నోరు మనదే ఐతే… -కార్టూన్

‘వడ్డించే వాడు మనోడే అయితే’ బంతిలో ఎక్కడ కూచున్నా అన్నీ అందుతాయన్నది సామెత. ‘ప్రశ్నించే నోరు మనదే అయితే, నచ్చిన సమాధానం చెప్పుకోవచ్చు’ అన్నది ఇప్పటి సామెత గా చేర్చుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ, ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన తామే నిరసన ప్రదర్శనలు చెయ్యడం ఎమిటి? బందులు హర్తాళ్ లు చేస్తూ ఆవేశకావేశాలు వెళ్లగక్కడం ఏమిటి? ఇక జనానికి సమాధానం చెప్పేదెవ్వరు? యు.పి.ఎ ప్రభుత్వం ఒకేసారి లీటర్ పెట్రో ధర రు. 7.54…