మూడు రోజుల్లో 24 మంది ఆఫ్ఘన్ పౌరుల్ని చంపేసిన నాటో బలగాలు

గత మూడు రోజుల్లోనే దేశవ్యాపితంగా జరిపిన దాడుల్లో 24 మంది అమాయక ఆఫ్ఘన్ పౌరులను నాటో దురాక్రమణ బలగాలు చంపేశాయి. మరింతమందిని గాయపరిచాయి. పాతిక మందిని చంపినందుకు రెండు రోజుల్లో సారీ చెబుతామని నాటో అధికారి చెప్పాడు. చనిపోయినవారిలో మహిళలు పిల్లలు ఉన్నారు. వాయవ్య ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న బాద్ఘిస్ రాష్ట్రంలో సోమవారం నాటో విమానాలు జరిపిన బాంబు దాడుల్లో ఐదుగురు మరణించారనీ, మరో 15 మంది గాయపడ్డారనీ ప్రెస్ టి.వి తెలిపింది. అయితే వాషింగ్టన్ పోస్ట్…

ఫ్రాన్సు ఎన్నికల్లో సర్కోజీ ఓటమి, స్వల్ప మెజారిటీతో హాలండే గెలుపు

ఫ్రాన్సు అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మితవాద పార్టీ ‘యు.ఎం.పి’ అభ్యర్ధి, అధ్యక్షుడు అయిన నికోలస్ సర్కోజీ ఓటమి చెందాడు. ఆయనపై ‘సోషలిస్టు’ పార్టీ అభ్యర్ధి ఫ్రాంకోయిస్ హాలండే స్వల్ప మెజారిటీతో గెలుపొందాడు. 95 శాతం ఓట్ల లెక్కింపు పూర్తికాగా వాటిలో హాలండేకి 51.6 శాతం ఓట్లు, సర్కోజీ కి 48.4 శాతం ఓట్లూ పోలయ్యాయి. కేవలం 3.2 శాతం ఓట్ల తేడాతో హాలండే గెలుపొందాడు. నికోలస్ సర్కోజీ విచక్షణా రహితంగా అమలు చేసిన ‘పొదుపు ఆర్ధిక…

ఇరాన్ ఆయిల్ దిగుమతులు ఇండియా తగ్గించాల్సిందే -హిల్లరీ హుకుం

ఇండియా, ఇరాన్ నుండి చేసుకుంటున్న ఆయిల్, గ్యాస్ దిగుమతులను తగ్గించుకోవాల్సిందేనని అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ హుకుం జారీ చేసింది. ఇరాన్ దిగుమతులను ఇప్పటికే గణనీయంగా తగ్గించుకున్నందుకు హర్షం వ్యక్తం చేసిన హిల్లరీ, అది చాలదనీ, ఇంకా తగ్గించుకోవాలని కోరింది. ‘ఇరాన్ ఆయిల్, గ్యాస్ దిగుమతులను తగ్గించుకునేది లేదని’ జనవరిలో పెట్రోలియం మంత్రి జైపాల్ రెడ్డి చేసిన ప్రకటన ఒట్టిదేనని హిల్లరీ హర్షం స్పష్టం చేసింది. ఆ రకంగా బహిరంగంగానే ఇండియాకి ఆదేశాలిస్తున్న హిల్లరీని ‘అదేమని’…

ఆఫ్-పాక్ యుద్ధ కల్లోలం -ఫొటోలు

యుద్ధాలు జన జీవనంలో మిగిల్చే భీభత్సం అంతా ఇంతా కాదు. లక్షల మందిని విగత జీవుల్ని చేసే యుద్ధాలు మరిన్ని లక్షల మందిని అవయవాలు లేని జీవచ్చవాలుగా మారుస్తాయి. ఇంకా అనేక రెట్ల మంది జీవితాల్లో తీరని విషాధాలు మిగిల్చి తరాల తరబడి ప్రభావాన్ని కలుగు జేస్తాయి. యుద్ధాల వల్ల బాగు పడేది పెట్టుబడిదారీ కంపెనీలు, ఆ కంపెనీల దగ్గర కమీషన్లు మెక్కే రాజకీయ నాయకులు, అధికారులే. ప్రజలు మాత్రం ధన, మాన, ప్రాణాలను కోల్పోయి చెట్టుకొకరు,…

క్లుప్తంగా… 05.05.2012

జాతీయం వేచి చూస్తాం -రాష్ట్రపతి ఎన్నికపై లెఫ్ట్ పార్టీలు రాష్ట్ర పతి ఎన్నికకు సంబంధించి వేచి చూడడానికి నిర్ణయించుకున్నామని లెఫ్ట్ పార్టీలు తెలిపాయి. సి.పి.ఐ, సి.పి.ఎం, ఆర్.ఎస్.పి ఫార్వర్డ్ బ్లాక్ న్యూఢిల్లీలో సమావేశమై మాట్లాడుకున్న అనంతరం తమ నిర్ణయం ప్రకటించాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్.సి.పి పార్టీ మాత్రం ఉప రాష్ట్రపతి ‘హమీద్ అన్సారీ’ కంటే ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ యే తమకు ఆమోదయోగ్యమని ప్రకటించింది. అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ‘సెక్యులర్’ పార్టీల అభిప్రాయం…