IPL score

ఇండియన్ ప్రెసిడెన్షియల్ లీగ్ -కార్టూన్

ఓ వైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు జరుగుతుండగానే భారత దేశ రాష్ట్ర పతికి ఎవరు సరైన అభ్యర్ధులో తేల్చుకోవడానికి రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు పడుతున్నాయి. రెండు చోట్ల, రెండు రంగాల్లో చోటు చేసుకున్న ద్వైదీ భావ ‘టు బి ఆర్ నాట్ టు బి’ పరిస్ధితి ‘ది హిందూ’ పత్రిక కార్టూనిస్టు సురేంద్రను ఈ కార్టూన్ గీయడానికి పురి గొల్పింది. రాష్ట్రపతి పదవికి ఇద్దరు అభ్యర్ధులను కాంగ్రెస్ ప్రతిపాదించింది. వారు ఉప రాష్ట్రపతి హమీద్…

స్పెయిన్ ఆయిల్ కంపెనీని జాతీయ చేసిన అర్జెంటీనా

– “ఇప్పటి నుండి మన ఆయిల్ రెస్పోల్ కంపెనీ అమ్ముకునే కమోడిటీ గా ఉనికిని ముగించుకుని దేశ అభివృద్ధి కోసం మౌలిక సరుకుగా ఉపయోగపడుతుంది”      -అర్జెంటీనా పాలక పార్టీ పార్లమెంటు సభ్యుడు ఆగస్టిన్ రొస్సీ అర్జెంటీనాలో అతి పెద్ద ఆయిల్ కంపెనీ వై.పి.ఎఫ్ ను ప్రభుత్వం జాతీయ చేసింది. వాణిజ్య ఆంక్షలు విధిస్తామన్న యూరోపియన్ యూనియన్ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ, అర్జెంటీనా పార్లమెంటు అత్యధిక మెజారిటీతో వై.పి.ఎఫ్ జాతీయ కరణను ఆమోదించింది. వై.పి.ఎఫ్ లో స్పెయిన్ బహుళజాతి…

అవును, నేను వేశ్య కూతుర్నే -నసీమా (వీడియో)

తల్లిదండ్రుల నిరాదరణకి గురై ఓ వేశ్య చేతికి చిక్కిన నసీమా కధ ఇది. వేశ్యా జీవితం బారిన పడకుండా తనను కాపాడిన అమ్మమ్మ కాని అమ్మమ్మ లాంటి వారి జీవితాలలో కొత్త మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న నసీమా అద్భుత మహిళ అనడంలో సందేహం లేదు. విదేశీ నిధుల కోసం ‘ప్రగతి శీల ఫోజులు’ కొట్టే ఎన్.జి.ఒ సంస్ధలపై నమ్మకం లేక తానే ‘పార్స్చం’ అనే సంస్ధను స్ధాపించి ఆశావహ దృక్పధంతో ముందుకు సాగుతోంది నసీమా. తల్లిదండ్రులు విడాకులు…

ఇరాన్ కి వ్యతిరేకంగా టెర్రరిస్టులను మోహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్

ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మద్దతు పొందిన ఇరానియన్ టెర్రరిస్టు సంస్ధ ‘ముజాహిదీన్-ఎ ఖల్క్ ఆర్గనైజేషన్’ (ఎం.కె.ఒ) (లేదా ఎం.ఇ.కె) ను ఇరాన్ కి వ్యతిరేకంగా అజర్ బైజాన్ లో మోహరించడానికి ఇజ్రాయెల్, అమెరికాలు నిర్ణయించాయని ప్రెస్ టి.వి తెలిపింది. అజర్ బైజాన్ లో వాడుకలో లేని వైమానిక స్ధావరాలలో ఎం.కె.ఒ టెర్రరిస్టులకు నివాసం కల్పించడానికి ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ లు ఒత్తిడి తెస్తున్నాయని ఒక నివేదికను ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. నివేదిక…

టెర్రరిజం సాకుతో ఆఫ్ఘన్ పౌరుల్ని చంపేస్తున్నారు -ఆఫ్ఘన్ అధ్యక్షుడు

‘టెర్రరిజం పై యుద్ధం చేస్తున్నామని’ చెబుతూ అమెరికా సైనికులు ఆఫ్ఘన్ ప్రజానీకాన్ని చంపేస్తున్నారని ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తీవ్రంగా విమర్శించాడు. అధ్యక్ష భవనం వద్ద గురువారం ప్రసంగిస్తూ హమీద్ కర్జాయ్, అమెరికా సైనికులు ఆఫ్ఘన్ పౌరులను చంపుతున్నారనీ, పౌరుల ఇళ్లపై దాడులు చేస్తున్నారనీ, ఆఫ్ఘన్ జాతీయులను తమ జైళ్ళలో అక్రమంగా నిర్భంధిస్తున్నారనీ అమెరికా తో పాటు దాని మిత్ర దేశాలు కూడా యధేచ్ఛగా దుర్మార్గాలు సాగిస్తున్నారని తీవ్ర స్వరంతో విమర్శించాడు. 2014 తర్వాత కూడా మరో…