మహిళని అరవై వేలకి అమ్మేసి, రక్షించబోయిన పోలీసుల్నీ కొట్టి…

రెండు ఉత్తర భారత రాష్ట్రాలలో జరిగిన ఘాతుకం ఇది. భర్త చనిపోయిన మహిళను అరవై వేల రూపాయలకి అమ్మడమే కాక ఆమెని కాపాడడానికి వెళ్ళిన సోదరుడినీ తన్ని తరిమేశారు. అనంతరం ఆమెని కాపాడడానికి వెళ్ళిన పోలీసు బృందాన్ని కూడా కొట్టి తరిమారు. ఇపుడు మరో పోలీసు బృందాన్ని పంపుతున్నామని మధ్య ప్రదేశ్ లోని జిల్లా ఎస్.పి చెప్పాడు. మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళను ముగ్గురు వ్యక్తులు రాజస్ధాన్ లోని ఓ గ్రామస్ధునికి అమ్మేశారు. అమ్మిన ముఠాలో…

అమెరికా మిసైల్ రక్షణ వ్యవస్ధపై ముందే దాడులు చేస్తాం–రష్యా

యూరోప్ లో అమెరికా నెలకొల్పుతున్న మిసైల్ రక్షణ వ్యవస్ధపై ముందుగానే (pre-emptive) దాడులు చేయడానికి వెనకాడబోమని రష్యా మిలట్రీ అధికారులు హెచ్చరించారు. అమెరికా అభివృద్ధి చేస్తున్న వివాదాస్పద ‘మిసైల్ షీల్డ్’ విషయంలో పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యం కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో తమ ఖండాతర క్షిపణులు కాపాడుకోవడానికి, రష్యా ప్రయోజనాలు భంగం కలగకుండా ఉండడానికి ‘ప్రీ-ఎంప్ టివ్’ దాడులు తప్ప తమకు మరో మార్గం లేదని వారు అన్నారు. అయితే అమెరికా మిసైల్ షీల్డ్ కి రష్యా…

UP' congress debacle

రాహుల్ ప్రసక్తి లేని యు.పి కాంగ్రెస్ ఓటమి సమీక్ష -కార్టూన్

యు.పి లో కాంగ్రెస్ ఓటమిని సమీక్షించడానికి ఎ.కె.ఆంటోని, షీలా దీక్షిత్, సుశీల్ కుమార్ షిండే లతో కాంగ్రెస్ నియమించిన కమిటీ, నివేదికను పూర్తి చేసినట్లు పత్రికలు తెలిపాయి. యు.పి ఎన్నికలకు చాలా ముందు నుండె ప్రచారంలోకి దూకిన రాహుల్ గాంధీ ప్రసక్తి లేకుండానే కమిటీ తన నివేదికను పూర్తి చేసినట్లు అవి తెలిపాయి. సరైన అభ్యర్ధులకి టిక్కెట్లు ఇవ్వకపోవడం, అవినీతిపై ప్రజల దృక్పధం, అధిక ధరలు, వివాదాస్పద ప్రచారం కాంగ్రెస్ ఓటమికి కారణాలని కమిటీ నివేదించిందని తెలుస్తోంది.…