యాపిల్ బిలియన్ల కొద్దీ పన్నులు ఎగ్గొట్టింది -న్యూయార్క్స్ టైమ్స్

ఎలక్ట్రానిక్ గాడ్గెట్ల దిగ్గజం ‘యాపిల్’ ప్రపంచ వ్యాపితంగా చిన్న చిన్న ఆఫీసులు నెలకొల్పి బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులను ఎగవేసిందని ది న్యూయార్క్స్ టైమ్స్ శనివారం వెల్లడించింది. కాలిఫోర్నియా కంపెనీ అయిన ‘యాపిల్’ నెవాడా రాష్ట్రంలోని రెనో నగరంలో ఆఫీసు పెట్టడం పన్ను ఎగవేతకు వేసిన ఎత్తుగడల్లో ఒకటని ఆ పత్రిక తెలిపింది. నెవాడాలో కార్పొరేట్ పన్ను సున్నా శాతం కాగా కాలిఫోర్నియాలో 8.84 శాతం కార్పొరేట్ పన్ను వసూలు చేస్తారని తెలిపింది. రెనో ఆఫీసు లాంటివి…

అమెరికా డ్రోన్ దాడుల్లో 2,800 పాక్ పౌరుల మరణం

గత యేడేళ్ళలో అమెరికా మానవ రహిత విమానాలు మూడువేల మంది అమాయక పాకిస్ధాన్ పౌరులను చంపేశాయని మానవ హక్కుల కార్యకర్త ఒకరు తెలిపాడు. మొత్తం దాదాపు మూడువేల మంది అమెరికా డ్రోన్ దాడుల్లో చనిపోగా వారిలో 2,800 మంది అమాయక పౌరులేనని పాకిస్ధాన్ మానవ హక్కుల కార్యకర్త షాజాద్ అక్బర్ ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. 170 మంది మాత్రమే అమెరికా దురాక్రమణపై పోరాడుతున్న “మిలిటెంట్లు” అని ఆయన తెలిపాడు. “ఫౌండేషన్ ఫర్ ఫండమెంటల్ రైట్స్”…

హైద్రాబాద్ మత కల్లోలానికి హిందువులే కారణం

మూడువారాల క్రితం హైద్రాబాద్ లో చెలరేగిన మత ఘర్షణలకు హిందువులే కారణమని పోలీసుల పరిశోధనలో తేలింది. ఇద్దరు స్ధానిక నాయకుల ప్రోత్సాహంతో హిందూ యువకులు మత కల్లోలం రెచ్చగొట్టడానికి పూనుకున్నారని పోలీసులు శనివారం తెలిపారు. మాదన్నపేట దేవాలయంలో ఆవు కాళ్ళు పడేసి, పచ్చ రంగు జల్లితే అది ముస్లింలు చేసిన పనేనని హిందువులు భావించి ముస్లింలపై దాడులకు పూనుకుంటారని పధకం వేశారని పోలీసులు తెలిపారు. ఆవు కాళ్ళను గుడిలో ఉంచి పచ్చరంగు జల్లిన హిందూ యువకులను పోలీసులు…

క్లుప్తంగా… 28.04.2012

జాతీయం సోనియా సభలో నల్లజెండా కర్ణాటక పర్యటిస్తున్న సోనియా గాంధీకి ఒక మహిళ నల్ల జెండా చూపి కలకలం రేపింది. పోలీసులు ఆమె పైకి లంఘించి నోరు నొక్కి బైటికి వెళ్లగొట్టారు. తమ కమ్యూనిటీకి ఎస్.సి రిజర్వేషన్లు కల్పించాలని మహిళ డిమాండ్ చేసినట్లు ‘ది హిందూ’ తెలిపింది. కేవలం నల్ల జెండా చూపిస్తేనే మహిళ నోరు నోక్కే పోలీసు చట్టాలు ఏ ప్రజాస్వామ్యానికి ప్రతీకలో సోనియా గాంధీ చెప్పవలసి ఉంది. సిద్దగంగ మఠం వ్యవస్ధాపకుడి 105 వ…