క్లుప్తంగా… 24.04.2012

జాతీయం జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు జగన్ అవినీతి ఆస్తుల కేసులో సి.బి.ఐ ఉచ్చు బిగిస్తున్నదని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. సెక్షన్ 164 కింద సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం ద్వారా పకడ్బందీగా కేసు విచారణ సాగిస్తునట్లు వెల్లడించింది. మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాలను సాక్ష్యాలుగా కోర్టు పరిగణిస్తుందనీ, వాటిని ఆ తర్వాత సాక్షులు వెనక్కి తీసుకోవడానికి లేదనీ ఆ పత్రిక తెలిపింది. అలాంటి సాక్ష్యాలను రహస్యంగా ఉంచుతూ కింది కోర్టులో అప్పుడే వాటిని…

మధ్య ప్రాచ్యం లో కీలక పరిణామం, ఇజ్రాయెల్ కి ఈజిప్టు గ్యాస్ సరఫరా రద్దు

మధ్య ప్రాచ్యం లో కొద్ది రోజుల క్రితం కీలక పరిణామం సంభవించింది. ఇజ్రాయెల్ కి గ్యాస్ సరఫరాను ఈజిప్టు సైనిక ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ప్రభుత్వాల మధ్య వ్యవహారం కాదు, కేవలం కంపెనీల మధ్య వ్యాపార లావాదేవీల వ్యవహారమేనని ఇరు ప్రహుత్వాలలోని కొన్ని వర్గాలు అంటున్నప్పటికీ, విశ్లేషకుల అభిప్రాయం భిన్నంగా ఉంది. ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ కి వ్యతిరేకంగా ‘ప్రజాస్వామిక సంస్కరణల’ కోసం జరిగిన తిరుగుబాటులో ఇజ్రాయెల్ కి సంవత్సరాల తరబడి అత్యంత చౌకగా…

పై చదువులకోసం అమెరికా వెళ్ళే డాక్టర్లు ఇక ‘రిటర్న్ బాండ్’ ఇవ్వాలి

పై చదువుల కోసం అమెరికా వెళ్ళే డాక్టర్లు ఇక నుండి దేశానికి తిరిగొస్తామని బాండ్ పేపర్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది. అమెరికాలో చదువులు పూర్తయ్యాక అక్కడే స్ధిరపడడానికి భారతీయ డాక్టర్లు మొగ్గు చూపుతున్నారనీ, ఉన్నత చదువుల పేరుతో వెళ్ళి అక్కడే ఉండిపోతున్నారనీ ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి వారిని అడ్డుకోవడానికి కొత్త నిబంధన విధిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపాడు. “ఏ విధ్యార్ధి అయినా వైద్య చదువుల కోసం అమెరికా వెళ్తే…

విదేశీ గూఢచర్యానికి ‘వాణిజ్య ముసుగు’ కోసం అనుమతి కోరిన అమెరికా మిలట్రీ

విదేశాల్లో తాము సాగించే గూఢచార కార్యకలాపాలకు ‘వాణిజ్య ముసుగు’ కావాలంటూ అమెరికా రక్షణ విభాగం కాంగ్రెస్ అనుమతి కోరింది. విదేశాలలో వాణిజ్యవేత్తల ముసుగులో మిలట్రీ గూఢచర్యానికి పాల్పడడానికి అమెరికాకి చెందిన ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్’ (డి.ఒ.డి) అమెరికా కాంగ్రెస్ ముందు ప్రతిపాదనలు ఉంచిందని ‘ఇన్ సైడ్ డిఫెన్స్’ వెబ్ సైట్ తెలిపింది. అమెరికా సైనికులను నేరుగా రంగంలోకి దించడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందనీ, వాణిజ్య ముసుగులో రహస్య మిలట్రీ కార్యకలాపాల కోసం అనుమతి…

‘స్పామ్ ఈ మెయిల్స్’ లో ఇండియాదే అగ్ర స్ధానం

పనికిరాని ‘స్పామ్ ఈ మెయిల్స్’ పంపడంలో భారత దేశం అగ్ర స్ధానం ఆక్రమించిందని కంప్యూటర్ సెక్యూరిటీ సంస్ధ ‘సోఫోస్’ తెలిపింది. అమెరికాని రెండో స్ధానంలోకి నెట్టి భారత దేశం అగ్ర స్ధానానికి చేరిందని ఆ సంస్ధ తెలిపింది. అయితే ఇందులో భారతీయుల తప్పేమీ లేదు. మొదటిసారి ఇంటర్నెట్ వినియోగిస్తున్న భారతీయులకు ఈ మెయిల్ వినియోగంలో అనుభవం లేకపోవడమే దీనికి కారణమని ‘సోఫోస్’ తెలిపింది. సోఫోస్ సంస్ధ స్పామ్ మెయిళ్ళు అధికంగా వచ్చే కంప్యూటర్ల సంఖ్య ఆధారంగా వివిధ…