ఇండియాలో టి.బి చావులు రోజుకి 1,000

భారత దేశ పాలకవర్గాలు సిగ్గుతో తల దించుకోవలసిన చేదు నిజం ఇది. ట్యూబర్కులోసీస్ (టి.బి) వ్యాధి బారిన పడిన భారతీయ రోగులు సరైన వైద్యం అందక రోజుకు 1,000 మంది చనిపోతున్నారు. మరే దేశంలోనూ ఇంతమంది టి.బి రోగులు మృత్యువాత పడడం లేదు. చనిపోతున్న టి.బి రోగుల్లో ప్రతి ఐదు నిమిషాలకు చనిపోతున్న ఒక పిల్లవాడు కూడా ఉన్నాడని టి.బి వ్యాధి నివారణ కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్ధ టి.బి.ఎ.ఐ (ట్యూబర్కులోసీస్ అలర్ట్ ఇండియా) తెలియజేసింది.…

ఆరు నెలల్లో మరిన్ని సంస్కరణలు -ప్రధాని ఆర్ధిక సలహాదారు

వచ్చే ఆరునెలల్లో భారత దేశంలో ముఖ్యమైన ఆర్ధిక సంస్కరణలు  మరిన్ని అమలు  చేయనున్నామని ప్రధాని ప్రధాన ఆర్ధిక సలహాదారు కౌశిక్ బసు ప్రకటించాడు. 2014 వరకూ ‘బిగ్ టికెట్’ సంస్కరణలేవీ సాధ్యం కాదని ప్రకటించి రాజకీయ, ఆర్ధిక వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన కౌశిక్ బసు బి.జె.పి తో పాటు ప్రవేటు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేయడంతో తన గొంతు సవరించుకున్నాడు. సబ్సిడీలను తగ్గించే చర్యలను ప్రభుత్వం చేపడుతుందని ఆయన సూచించాడు. డీజెల్ ధర్లపై నియంత్రణ, రిటైల్ రంగంలో…