‘దళిత హత్యాకాండ’ కేసులో శిక్షలన్నీ రద్దు చేసిన బీహార్ హై కోర్టు

భారత దేశంలో దళితులకి న్యాయం సుదూర స్వప్నమేనని మరోసారి రుజువయింది. 21 మంది దళితులను, ముస్లింలను బలితీసుకున్న ‘బఠానీ టోలా’ హత్యాకాండ కేసులో బీహార్ హై కోర్టు శిక్షలన్నింటినీ రద్దు చేసేసింది. మంగళవారం నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. సాక్ష్యాలు బలంగా లేవని చెప్పింది. ‘అనుమాన రహితం’గా నేరం రుజువు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పింది. కింది కోర్టు ముగ్గురిపై విధించిన ఉరి శిక్షను, మరో 20 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షనూ ఒక్క తీర్పుతో…

పాక్ కోర్టులో లష్కర్-ఎ-తయిబా చీఫ్ హఫీజ్ పిటిషన్

అమెరికా ఒత్తిడికి లొంగి పాకిస్ధాన్ ప్రభుత్వం తనపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నదనీ, ఆ ప్రయత్నాలను నిరోధించాలనీ కోరుతూ లష్కర్-ఎ-తయిబా (ఎల్.ఇ.టి) అధిపతి హఫీజ్ సయీద్ పాకిస్ధాన్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన జీవితానికి భద్రత లేదనీ, రక్షణ కల్పించాలనీ, ఏ క్షణంలోనైనా తనకు ప్రాణహాని జరగవచ్చనీ ఆయన పిటిషన్ లో కోరాడు. హాఫీజ్ పిటిషన్ మేరకు లాహోర్ హై కోర్టు పాక్ కేంద్ర ప్రభుత్వానికీ హోమ్ మంత్రికీ, పణ్జాబ్ హోమ్ మంత్రికి నోటీసులు జారీ…

ద్ర్యవ్యోల్బణం: హోల్ సేల్ 6.89%, రిటైల్ 9.47%

మార్చి నెలలో హోల్ సేల్ ధరలపై ఆధారపడి లెక్కించిన ద్రవ్యోల్బణం 6.89 శాతానికి తగ్గితే, రిటైల్ ధరలపై ఆధారపడి లెక్కించిన ద్రవ్యోల్బణం 9.47 శాతానికి పెరిగింది. రిటైల్ వ్యాపారులకి మాత్రమే అందుబాటులో ఉండే హోల్ సేల్ ధరలకీ, వినియోగదారులకి అందుబాటులో ఉండే రిటైల్ ధరలకీ ఉన్న వ్యత్యాసాన్ని ఈ గణాంకాలు ఎత్తి చూపుతున్నాయి. పాలు, కూరగాయలు, ప్రోటీన్ ఆధారిత ఆహార ఉత్పత్తులు, వంటనూనె ఉత్పత్తులు… వీటి ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ…