చపల చిత్తమా, సృజన చిత్తమా ఈ కళాకృతులు? -ఫొటోలు

“బ్రెజిల్ కళాకారుడు ‘హెన్రిక్ ఒలివీరా’ కి తన కళను ప్రదర్శించే గ్యాలరీల గోడలంటే ఏ మాత్రం గౌరవం లేనట్టుంది. లేకుంటే తన బుర్రను చీల్చుకు వచ్చిన అవుడియాల కోసం ఈ రకంగా గోడల్ని చీల్చేస్తాడా? తన చిత్తానికి తగ్గట్లు మెలికలు తిరుగుతూ నేలనీ, గోడల్నీ, పై కప్పుల్నీ తొలిచేలా  చెట్లను శాసించడానికి ఈయనకి మానవతీత శక్తులేవో ఉన్నట్లున్నాయి మరి.” ఒలివీరా ‘సావొ పోలో’ లో విద్యార్ధిగా ఉన్నపుడు తన గది బయట ప్లై వుడ్ తో చేసిన…

అమెరికా యుద్ధ నౌకల్ని మేం ఫోటోలు తీశాం -ఇరాన్

ఇరాన్ గూఢచార విమానాలు అమెరికా యుద్ధ నౌకాలను ఫోటోలు తీశాయని ఇరాన్ మిలట్రీ కమాండర్ ప్రకటించాడు. పర్షియా ఆఘాతంలో తిష్ట వేసి ఉన్న అమెరికా యుద్ధ విమాన వాహక నౌకతో పాటు ఇతర యుద్ధ విమానాలను, తమ మానవ రహిత డ్రోన్ లు ఆకాశం నుండి ఫోటోలు తీసాయని బ్రిగేడియర్ జనరల్ ఫర్జాడ్ ఎస్మాయిల్ మంగళవారం ప్రకటించినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. ఇరాన్ గగన తాళంలోకి జొరబడి గూఢచర్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా డ్రోన్ విమానాన్ని గత…

ఆడపిల్లగా పుట్టినందుకు తండ్రి చేతిలో చనిపోయింది

తండ్రి చేతిలో చిత్ర హింసలు అనుభవించిన మూడు నెలల పాప అఫ్రీన్ మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. సిగరెట్ వాతలతో, గాయాలతో, రక్తం స్రవిస్తున్న మెదడుతో, విరిగిపోయిన మెడతో బెంగుళూరు ఆసుపత్రిలో చేరిన అఫ్రీన్ బుధవారం గుండే ఆగి చనిపోయింది. అబ్బాయి కోసం చూస్తే అమ్మాయి పుట్టిందనీ, అందుకే హత్యా ప్రయత్నం చేశాననీ తండ్రి ఉమర్ ఫరూక్ పోలీసుల వద్ద అంగీకరించాడని ‘ది హిందూ’ తెలిపింది. తన పాప ప్రాణాలు నిలుస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న 19 సంవత్సరాల…

ఇండోనేషియాలో 8.7 భూకంపం, సునామీ హెచ్చరిక

ఇండోనేషియా Aceh ప్రాంతానికి సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 8.7 గా నమోదయిన ఈ భాకంపం ప్రపంచంలో ఇప్పటివరకూ సంభవించిన భారీ భూకంపాల్లో ఒకటిగా చానెళ్లు పేర్కొంటున్నాయి. హిందూ మహా సముద్ర వ్యాపితంగా సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్ద తెలిపింది. పూర్తి వివరాలు ఇంకా ఏ వార్తా సంస్ధ ప్రకటించలేదు. ‘ఎర్త్ క్వేక్ రిపోర్ట్’ వెబ్ సైట్ అందించిన శాటిలైట్ పటాన్ని కింది చిత్రంలో చూడవచ్చు. మొదట భూకంప…

Modi not guilty

మోడీకే పాపమూ తెలియదట -కార్టూన్

సుప్రీం కోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) మోడి కి ఏ పాపమూ తెలియదని తేల్చేసింది. హిందూ మూకల చేత పన్నెండొందలకు పైగా ముస్లింలు ఊచకోత కోయబడ్డ గుజరాత్ మారణ కాండకు సంబంధించి మోడిని ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలేవీ కనిపించలేదట. నెలల తరబడి సాగిన మానవ హననంలో పసి పిల్లలు, ముసలివాళ్ళు, స్త్రీలు, గర్భిణీ స్త్రీలు అత్యంత పాశవికంగా హత్యలకు గురయినప్పటికీ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ కూచుంది. అయినా రాష్ట్ర ముఖ్య మంత్రికి…