మరో బాంబు వదిలిన ఆర్మీ చీఫ్, భావి ఆర్మీ చీఫ్ పై సి.బి.ఐ విచారణకి ఆదేశం

గత కొద్ది రోజులుగా ప్రభుత్వంతో తలపడుతున్నట్లు కనిపిస్తున్న ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ సంచల రీతిలో మరో బాంబు వదిలాడు. రానున్న మే నెలలో తాను రిటైరయ్యాక తన స్ధానాన్ని నింపేవారిలో రెండవ స్ధానంలో ఉన్న ఆర్మీ అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారించవలసిందిగా సి.బి.ఐ కి లేఖ రాశాడు. ప్రధానికి రాసిన తాను రాసిన లేఖను లీక్ చేసింది తాను కాదని ఆయన సూచించిన కొద్ది గంటలకే సి.బి.ఐ కి రాసిన లేఖ సంగతి బైటికి…

వివాదాస్పద టాట్రా (మిలట్రీ) ట్రక్కులు ఖజానాకు బహు భారం

ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ సంచల రీతిలో చేసిన అవినీతి ఆరోపణలతో టాట్రా ట్రక్కులు వార్తలకెక్కాయి. ఈ ట్రక్కులను గత ముప్ఫై యేళ్ళుగా భారత ఆర్మీ కొనుగోలు చేసున్నదని ఆర్మీ చీఫ్ ‘ది హిందూ’ కి కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇప్పటి వరకు 7,000 కు పైగా టాట్రా ట్రక్కులను ఆర్మీ కోనుగోలు చేసిందని ఆయన తెలిపాడు. వీటిని ఎక్కడ ఉపయోగించాలో తెలియని పరిస్ధితి ఆర్మీకి ఏర్పడిందని చెప్పాడు. అంతకంటే సామర్ధ్యం కలిగిన ట్రక్కులు…

నా లేఖ లీక్ చేయడం మహా ద్రోహం -ఆర్మీ చీఫ్

ప్రధానికి రాసిన లేఖను తానే లీక్ చేశాడని ఆరోపిస్తూ, ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ ని పదవి నుండి తప్పించాలని ప్రతి పక్ష పార్టీలు ఓ వైపు డిమాండ్ చేస్తుండగానే ‘తన లేఖను లీక్’ చేసినవారిని జాలి, దయ లేకుండా శిక్షించాలని వి.కె.సింగ్ ప్రకటించి మరో సంచలనానికి తెరలేపాడు. ప్రధాన మంత్రికి అత్యంత రహస్యంగా తాను రాసిన లేఖను లీక్ చేయడం ‘మహా ద్రోహం’ (high treason) గా వి.కె.సింగ్ అభివర్ణించాడు. “లేఖను లీక్ చేయడాన్ని మహా ద్రోహంగా…

బక్కచిక్కుతున్న అమెరికా మధ్య తరగతి -కార్టూన్లు

అమెరికా మధ్య తరగతి జనం దాదాపు మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఒక మూల స్తంభంగా పని చేసిందని చెప్పుకోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో మధ్య తరగతి వర్గం విస్తృతంగా అభివృద్ధి చెందింది. దానికి కారణం ‘సోషలిస్టు వ్యవస్ధ’. అమెరికాలో ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్ధే అయినా రష్యా, చైనాలలో సోషలిస్టు విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవాలు విజయవంతం అయ్యాక ఏర్పడిన సోషలిస్టు వ్యవస్ధలు అమెరికా, యూరప్ లలో సో కాల్డ్…