ప్రపంచ స్ధాయి రేపిస్టులు వీళ్ళు -ఫొటోలు

లైంగిక అత్యాచారాలకు పాల్పడి ప్రపంచ స్ధాయిలో పేరు పొందిన రాజకీయవేత్తలు వీళ్లు. ఈ ఫొటోలను ఫస్ట్ పోస్ట్ అందించింది. ఆయా దేశాలలో ఉన్నత పదవులను అధిష్టించినవారు తమ తమ దేశాల్లోని ఉన్నత సాంస్కృతిక విలువలకు అద్దం పట్టేలా జీవించాలి. ఆయా దేశాల జీవన విధానాలకు అద్దం పట్టడమే కాక మొత్తం ప్రపంచ స్ధాయి విలువలను కూడా వీరి ప్రతిబింబించాల్సి ఉంటుంది. మానవ నాగరికతలో కుటుంబ జీవనానికి అత్యున్నత రూపం అయిన మోనోగమీ (ఒక భర్తకు ఒకే భార్య)…

‘ప్రాస్టిట్యూషన్ రింగ్’ లో పెట్టుబడిదారీ సిద్ధాంత ప్రభోధకుడు స్ట్రాస్ కాన్

ప్రపంచ దేశాలను పెట్టుబడిదారీ “స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ” (Free Market Economy) వైపు నడిపించడానికి శ్రమించే ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్ధ’ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) మాజీ అధినేత, ఫ్రాన్సు సోషలిస్టు పార్టీ నాయకుడు ‘డొమినిక్ స్ట్రాస్ కాన్’, ప్రాస్టిట్యూషన్ రింగ్ నడుపుతున్నాడని ఆరోపిస్తూ ఫ్రాన్సు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి లక్ష యూరోల బెయిల్ పై ఉన్న స్ట్రాస్ కాన్, విచారణలో పాల్గొంటున్నవారితోనూ, మీడియాతోనూ మాట్లాడరాదన్న షరతులను ఎదుర్కొంటున్నాడు. ఫ్రాన్సు న్యాయ వ్యవస్ధ…

1989; Sachin Tendulkar

సచిన్ హెయిర్ స్టైల్స్ ఇలా మారుతూ వచ్చాయి -ఫొటోలు

రింగుల జుట్టుతో భారత క్రికెట్ లోకి అడుగు పెట్టిన సచిన్ టెండూల్కర్ ఇప్పుడు దాదాపు టార్జాన్ హెయిర్ స్టయిల్ లాంటి పొడుగు జుట్టు తో కనిపిస్తున్నాడు. వివిధ దశల్లో అతని హెయిర్ ఎలా రూపం మారుతూ వచ్చిందో చూపుతున్న ఈ ఫొటోల్ని ‘ఫస్ట్ పోస్ట్’ పత్రిక ప్రచురించింది. –

అవినీతిపై విచారణ కోరినందుకు అధికారిని పిచ్చాసుపత్రిలో చేర్చబోయిన యు.పి ప్రభుత్వం

మాయావతి పాలన అవినీతి మయం అయిందంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ స్కీముల్లో జరుగుతున్న అవినీతి పై విచారణ కోరుతూ ధర్నా చేస్తున్న రాష్ట్ర అధికారిని పిచ్చాసుపత్రిలో చేర్చడానికి ప్రయత్నించింది. అధికారిని చేర్చుకోవడానికి డాక్టర్లు నిరాకరించడంతో పోలీసులు వెనుదిరగవలసి వచ్చింది. రెండేళ్ల క్రితం మాఫియా కాల్పుల్లో కన్ను కోల్పోయినప్పటికీ అవినీతి వ్యతిరేక పోరాటం కొనసాగిస్తున్నందుకు ‘రింకు సింగ్ రాహి’ని పిచ్చివాడుగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గూండా పాలనను…

లంచం ఆరోపణలపై చర్య తీసుకోడానికి ఆర్మీ చీఫ్ ఇష్టపడలేదు -రక్షణ మంత్రి

మాజీ రిటైర్డ్ ఆర్మీ అధికారి తనకు రు. 14 కోట్లు లంచం ఇవ్వజూపాడని ఆర్మీ చీఫ్ చేసిన ఆరోపణల వ్యవహారం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. లంచం విషయం తనకు చెప్పినపుడే చర్యలు తీసుకోవాలని ఆర్మీ చీఫ్ కి సూచించాననీ, అయినా చర్యలు తీసుకోవడానికి ఆయన ఆసక్తి చూపలేదనీ, “ఆ విషయంలో మరింత ముందుకెళ్ళాలనుకోవడం లేద”ని ఆర్మీ చీఫ్ తనతో అన్నాడనీ రక్షణ మంత్రి ఏ.కె.ఆంటోని రాజ్య సభలో ప్రకటించాడు. ఆ సమయంలో లంచం విషయంలో మరింత…