బి.జె.పి ఎమ్మెల్యేల నీలి లీలలు: మొన్న కర్ణాటక, ఇపుడు గుజరాత్

కర్ణాటక అసెంబ్లీ లో బి.జె.పి ఎమ్మెల్యేల నీలి భాగోతం మర్చిపోక ముందే గుజరాత్ బి.జె.పి ఎమ్మేల్యేలు తాజాగా ‘నీలి’ వీధికెక్కారు. ప్రజాస్వామ్య కేంద్రాలు అని పాలక వర్గ పార్టీలు ఎంతో గొప్పగా చెప్పుకునే అసెంబ్లీ లంటే తమకు లెక్కే లేదని తేల్చేశారు. ఓ వైపు అసెంబ్లీలో కార్యకలాపాలు సాగుతుండగానే, తాము వెంట తెచ్చుకున్న ఐ ప్యాడ్ లో నీలి చిత్రాలు వీక్షించి తరించారు. తమ తలలపైనే ఉన్న జర్నలిస్టులు గమనించి స్పీకర్ కి ఫిర్యాదు చేశాక ‘అదేం…

మమత హిపోక్రసీ: పాలు, విద్యుత్ రేట్లు పెంచి, రైలు చార్జీలపై నాటకం

అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమత బెనర్జీ మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ట్రామ్ వేస్ కార్పొరేషన్ కి ఇస్తున్న సబ్సిడీ రద్దు చేయడమే కాక త్వరలో ఛార్జీలు కూడా పెంచబోతోంది. ప్రతి వంట గదిలో అత్యవసరంగా ఉపయోగించే పాల ఛార్జీలు పెంచింది. ఇన్ని చేసిన మమత రైలు ఛార్జీలు పెంచాడంటూ తన పార్టీ నాయకుడిని కేంద్ర మంత్రి పదవి నుండే తొలగించింది. “రైల్వే ఏ.సి ఛార్జీలు పెంచినా ఫర్వాలేదు…