కుదంకుళం అణు కర్మాగారం, ప్రధాన మంత్రిపై పరువు నష్టం దావా

రష్యా సహకారంతో మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకున్న కుదంకుళం అణు విద్యుత్ కర్మాగారంపై పోరాటం చేస్తున్న ఎన్.జి.ఓ (నాన్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్) సంస్ధలకు అమెరికా, స్కాండినేవియా దేశాల నుండి డబ్బు ముడుతోందంటూ వ్యాఖ్యానించిన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పై ‘పరువు నష్టం’ దావా వేయడానికి ఉద్యమ నాయకుడు ఉదయ కుమార్ సిద్ధమవుతున్నాడు. తమకు ఏ దేశం నుండీ నిధులు అందడం లేదనీ, ఆమేరకు ప్రధాని చేసిన వ్యాఖ్యలు దురుద్దేశపూరితంగా ఉన్నాయనీ ఉదయకుమార్ ఆరోపిస్తున్నాడు. అణు విద్యుత్…

నక్సల్ జిల్లాల్లో పోలీసులకి రు.800 కోట్లు, ప్రజలకి రు.30 కోట్లు

దేశంలో నక్సల్ పీడిత జిల్లాలలో దుర్భేధ్యమైన కోటల్లాంటి పోలీసు స్టేషన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభ్యుత్వం రు.120 కోట్లు మేరకు విడుదల చేసింది. పోలీసు ఠాణాల నిర్మాణం కోసం విడుదల చేస్తున్న ఈ సొమ్ము కేవలం మొదటి వాయిదా మాత్రమే.  మరింత సొమ్ముని మరిన్ని వాయిదాలలో విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా నక్సల్ పీడిత జిల్లాలలోని ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2010-11 లో కేవలం రు.25 కోట్లు మాత్రమే…