అమెరికా రాయబారి రాకను వద్దన్న పాక్

అమెరికా ప్రత్యేక రాయబారి మార్క్ గ్రాస్‌మన్, తాను పాకిస్ధాన్ సందర్శిస్తానని కోరగా, ‘ఇప్పుడు వద్దు’ అని నిరాకరించి, పాకిస్ధాన్ సంచలనం సృష్టించింది. పాకిస్ధాన్ కి చెందిన సీనియర్ అధికారి ఒకరి ఈ సంగతి వెల్లడించినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అమెరికా, పాకిస్ధాన్ ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ఇది సూచిస్తోంది. రాయబారిని రావొద్దని కోరడానికి గల కారణాలను పాక్ అధికారి వివరించలేదు. “రాయబారి గ్రాస్‌మన్ పాకిస్ధాన్ సందర్శిస్తానని విజ్ఞప్తి చేశాడు. కాని ఈ సమయంలో ఆయన…

ప్రాణాంతక మధురై జల్లికట్టు -ఫొటోలు

తమిళనాడులొ మధురై సమీపాన ఉన్న అనంగనల్లూరు గ్రామంలో జరిగిన జల్లికట్టు దృశ్యాలివి. ‘జల్లి కట్టు’ పేరుతో ఆంబోతులతో తలపడే ఆచారం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కే పరిమితం కాదన్నమాట! ‘ఈ ఎద్దులు మాకు దైవంతో సమానం’ అని జల్లికట్టు జరిగిన ప్రాంగణంలో ప్రదర్శించబడిన ఒక బ్యానర్ చెబుతోంది. దైవం అంటూనె వాటిపై హింసకు పాల్పడడం కేవలం ‘జీవన వైవిధ్యం’ గానో, ‘సంస్కృతి’ గానో చెప్పుకుని సరిపెట్టుకోగలమా? జల్లికట్టు సందర్భంగా క్రీడలో పాల్గొన్న వారు యూనిఫారం ధరించారు. యూనిఫారం…

‘లోకాయుక్త’పై సుప్రీంకి మోడి ప్రభుత్వం

గుజరాత్ రాష్ట్ర లోకాయుక్త నియామకం విషయంలో గుజరాత్ హై కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని త్వరలో సుప్రీం కోర్టు తలుపు తడతామని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గుజరాత్ హై కోర్టు తన మెజారిటీ తీర్పు ద్వారా లోకా యుక్త నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేసింది. గుజరాత్ గవర్నర్ కమ్లా బేనివాల్ గత సంవత్సరం ఆగష్టులో…

గుజరాత్ కోర్టులో ‘మోడి’కి మొట్టికాయ

గుజరాత్ లోకాయుక్త నియామకం విషయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి మరొక ఎదురు దెబ్బ తగిలింది. గవర్నర్ పూనుకుని, స్వతంత్రంగా చేసిన లోకాయిక్త నియామకం చెల్లదనీ, అది రాజ్యంగ వ్యతిరేకం  అని వాదిస్తూ గజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను గుజరాత్ హై కోర్టు, మెజారిటీ తీర్పు ద్వారా కొట్టి వేసింది. గుజరాత్ గవర్నర్ ‘కమ్లా బెనీవాల్’ ఆగష్టు 25, 2011 తేదీన రిటైర్డ్ జస్టిస్ ఆర్.ఎ.మెహతా ను గుజరాత్ ‘లోకాయుక్త’ గా నియమించింది.…

వైట్ హౌస్‌పై పొగ బాంబు విసిరిన నిరసనకారులు

అమెరికా అధ్యక్ష భవనం ఆవరణలోకి మంగళవారం ఆకుపై ఉద్యమకారులు పొగబాంబు విసిరి సంచలనం సృష్టించారు. ఈ సంఘటనతో వైట్ హౌస్ ని తాత్కాలికంగా మూసివేశారు. వైట్ హౌస్  చుట్టూ ఉన్న కంచె పై నుండి ఈ పొగబాంబు విసిరినట్లు తెలుస్తోంది. అమెరికా సీక్రెట్ సర్వీస్ పోలీసులను ఉటంకిస్తూ ‘ది హిందూ’ వార్తా పత్రిక ఈ వార్తను ప్రచురించింది. వెయ్యిమందికి పైగా ఉన్న నిరసనకారులు ప్రదర్శన నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగిందని పత్రికలు, ఛానెళ్ళు తెలిపాయి. వైట్ హౌస్…