పురుషాధిక్య సమాజంలో పురుషులపై జరిగే అన్యాయాలపై అవగాహన

మిత్రులొకరు పురుషులకు జరుగుతున్న అన్యాయం గురించి ఏమి చెబుతారు? అని అన్నా గారి గొడ్రాలి వ్యాఖ్యపైన నేను రాసిన పోస్టు కింద అడిగారు. దానికి సమాధానం రాశాను. అది పోస్టుగా చేయగల విషయం అని భావించి ఇక్కడ ఇస్తున్నా. *                              *                         *                              * స్త్రీలకు జరుగుతున్న అన్యాయం నేరుగా పురుషులనుండి జరుగుతుందని భావిస్తే ఈ అనుమానం రావడం సహజం. కాని వాస్తవం ఏమిటంటే, పురుషులకు, స్త్రీలపైన ఆధిపత్యం సమాజం ఇచ్చింది. అంటే సమాజం స్వభావాన్ని బట్టే…

‘మమత’ సవరణలతో లోక్ పాల్ బిల్లు బడ్జెట్ సమావేశాలకి వాయిదా పడే ప్రమాదం

రాజ్యసభలో లోక్ పాల్ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. యు.పి.ఎ భాగస్వామి త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ప్రతిపాదించిన సవరణలకు ప్రతిపక్ష పార్టీలలో కూడా మద్దతు దొరకడంతో ప్రస్తుత సమావేశాలలో లోక్ పాల్ బిల్లు ఆమోదం కష్టంగా కనిపిస్తోంది. బిల్లుకు తలపెట్టిన సవరణలతో సహా, లోక్ పాల్ బిల్లు, మరొకసారి స్ధాయీ సంఘం పరిశీలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎన్.డి.టి.వి విశ్లేషించింది. చూడగా, ఎన్.డి.టి.వి విశ్లేషణ అంతిమంగా నిజమయ్యేలా పరిస్ధితి కనిపిస్తోంది. రాష్ట్రాలు…

ఉ.కొరియా కొత్త నాయకుడ్ని చూస్తే ప్రపంచ దేశాలకు భయం(ట) -కార్టూన్

ఉత్తర కొరియా కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఇరవై యేడేళ్ల కిమ్ జోంగ్-యూన్ ని నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మిలట్రీ అత్యున్నత సంస్ధ ఛైర్మన్ గానూ, ప్రభుత్వాధిపతి గానూ ఆయన నియమితుడు కావడం లాంఛనమే నని కొన్ని పత్రికలు చెబుతున్నా, అది అంత త్వరగా జరగకపోవచ్చు. కొత్త నాయకుడు ఇంకా పిల్లవాడేననీ, ఉత్తర కొరియా నిర్మించుకున్న అణ్వాయుధాలు ఆయన చేతిలోనే ఉన్నాయనీ, ఆయన సరదాగా పిల్లచేష్టలతో అణ్వాయుధాల…

అన్నా హజారే దృష్టిలో ‘గొడ్రాలు’ చులకన!

రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారే, పిల్లలు కలగని స్త్రీలపైన తన అవగాహనా రాహిత్యాన్నీ, చిన్నచూపును చాటుకున్నాడు. తన జీవితంలో అత్యధిక భాగం గ్రామంలో నివసించే అన్నా, గ్రామీణ భారతంలో ఉన్న వెనకబాటు భావనలకు తాను అతీతుడిని కానని మంగళవారం దీక్షలో ప్రసంగిస్తున్న సందర్భంగా వెల్లడించుకున్నాడు. ప్రసంగం సందర్భంగా అన్నా హజారే “బంఝ్ క్యా జానె ప్రసూతి వేదనా (గొడ్రాలికేం తెలుసు ప్రసవ వేదన)?” అని వ్యాఖ్యానించినట్లుగా హిందూస్ధాన్ టైమ్స్ వెల్లడించింది.…

నీళ్ళకీ ధర పెట్టాలి -అహ్లూవాలియా ప్రేలాపన

“ఆంధ్ర జ్యోతి” దిన పత్రికలో ఈ వార్త ప్రచురితమయింది. విదేశీ కంపెనీల ప్రయోజనాలు తప్ప మరొకటి కనపడని మాంటెక్ అహ్లూవాలియా మెదడుకి పెట్టుబడిదారీ పురుగు ఆశించి పూర్తిగా కుళ్ళిపోయిందనడానికి ఈ వార్త ప్రబల ఉదాహరణ. స్వేచ్ఛా మార్కెట్ పెట్టుబడిదారీ ఆర్ధిక సూత్రాలను పూర్తిగా తలకెక్కించుకోవడమే కాక, కేవలం పశ్చిమ దేశాల ప్రవేటు బహుళజాతి కంపెనీల పనులు చేసి పెట్టడానికే కట్టుబడి ఉన్న ఈ అద్దె మేధావి ప్రజలకు నీరు మరింత అందుబాటులోకి తేవడానికి బదులు వారికి ఇంకా…