2012 లో కుదేలు కానున్న బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ

వచ్చే సంవత్సరం బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర స్ధాయిలో కుచించుకుపోతుందని స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు అంచనా వేస్తోంది. బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి చాలా తక్కువగా ఉంటుందని ఈ బ్యాంకు గతంలోనే జోస్యం చెప్పింది. గతంలో అంచనా వేసినట్లుగా వృద్ధి చెందడానికి బదులు బ్రిటన్ ఎకానమీ కుచించుకుపోతుందని బ్యాంకు ఇప్పుడు అంచనా వేస్తోంది. బ్రిటన్ ఎకానమీ 0.6 శాతం వృద్ధి చెందుతుందని స్టాండర్డ్ ఛార్టర్డ్ అంచనా వేసింది. దానికి బదులు 1.3 శాతం మేరకు కుచించుకుపోతుందని (లేదా…

కొత్త స్ధాయికి పతనమైన రూపాయి విలువ

భారత దేశ కరెన్సీ పతనం చెందడంలో కొంత పుంతలు తొక్కుతోంది. రోజుకొక రికార్డు  నమోదు చేస్తూ పాతాళానికి దూసుకు పోతోంది. సోమవారం అది సరికొత్త రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో డాలరు కు ఇప్పుడు రు. 52.77 పై చొప్పున రూపాయి విలువ పలుకుతోంది. అంటే రూపాయికి 1/52.77 డాలర్ల చొప్పున రూపాయి విలువ పలుకుతోంది. సోమవారం వెలువడిన అక్టోబరు నెల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు భారత ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదించిన విషయాన్ని…

హిందూ మహాసముద్రంలో మొదటి చైనా మిలట్రీ స్ధావరం త్వరలోనే

హిందూ మహా సముద్రంలో మొట్టమొదటి మిలట్రీ స్ధావరం ఏర్పాటు చేయడానికి చైనా సిద్ధమవుతోంది. విదేశాలలో తన మొదటి మిలట్రీ స్ధావరాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా చైనా సోమవారం ప్రకటించింది. హిందూ మహా సముద్రంలో ఉన్న ‘సీ షెల్స్’ దేశంలో తన నౌకా దళాలకు మధ్యంతర సరఫరాల కోసం మిలట్రీ స్ధావరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా చైనా ప్రకటించింది. ‘సీ షెల్స్’ లో ఉన్న హార్మర్లలో తగిన దాన్ని ఎంచుకుని అక్కడ మిలట్రీ స్ధావరం ఏర్పాటు చేస్తానని చైనా అధికారులు తెలిపారు.…

పాక్ వైమానిక స్ధావరాన్ని ఖాళీ చేసిన అమెరికా

పాకిస్ధాన్ హెచ్చరికతో అక్కడ ఉన్న వైమానిక స్ధావరాన్ని అమెరికా బలగాలు ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. కొద్ది రోజుల తర్వాత పాక్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటుందని భావించినవారి ఊహలు, ఊహలుగానే మిగిలాయి. ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహానికి పాకిస్ధాన్ సైన్యం, పౌర ప్రభుత్వం ఔదలదాల్చాయి. ఆదివారం షంషి వైమానిక స్ధావరాన్ని పాకిస్ధానీ ఆర్మీ అమెరికా బలగాలనుండి స్వాధీనం చేసుకుంది. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దులో రెండు చెక్ పోస్టుల వద్ద ఉన్న పాక్ సైనికులను ఇరవై నాలుగు మందిని అమెరికా హెలికాప్టర్లు, జెట్…

పడిపోయిన భారత పారిశ్రామిక ఉత్పత్తి

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత భారత పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయింది. సాధారణంగా ఎంతో కొంత (ఎంత తక్కువైనా) పెరుగుదలను నమోదు చేయవలసి ఉండగా, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుదలను నమోదు చేయడం పరిశీలకులను నిశ్చేష్టుల్ని చేసింది. ఈ సంవత్సరం అక్టోబరు నెలలో గత సంవత్సరం ఇదే నెలతో పోల్చితే పారిశ్రామిక ఉత్పత్తి  5.1 శాతం తగ్గిపోయిందని ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఫ్యాక్టరీలు, ఖనిజ తవ్వకాలు, వివిధ యుటిలిటీ కంపెనీలు మొ.న రంగాల ఉత్పత్తి పారిశ్రామిక ఉత్పత్తిగా పరిగణిస్తారు.…