అగ్నిమాపక విభాగం ముందే హెచ్చరించినా ఆసుపత్రి వాళ్ళు విన్లేదు -మమత
ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రి బేస్మెంట్ ను ఖాళీ చేయాలని పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక విభాగం వాళ్ళు జులైలోనే హెచ్చరించారనీ, అయినా ఆసుపత్రి వాళ్ళు ఆ పని చేయలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పత్రికలకు తెలిపింది. రెండు నెలల్లో బేస్మెంట్ ఖాళీ చేస్తామని అఫిడవిట్ సమర్పించిన ఆసుపత్రి యాజమాన్యం అది చేయలేదని ఆమే తెలిపింది. ఆసుపత్రి యాజమాన్యం లాభాపేక్ష, నిర్లక్ష్యంగా ఫలితంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని నిస్సందేహంగా భావించవచ్చు. ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 88 కి…