అగ్నిమాపక విభాగం ముందే హెచ్చరించినా ఆసుపత్రి వాళ్ళు విన్లేదు -మమత

ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రి బేస్‌మెంట్ ను ఖాళీ చేయాలని పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక విభాగం వాళ్ళు జులైలోనే హెచ్చరించారనీ, అయినా ఆసుపత్రి వాళ్ళు ఆ పని చేయలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పత్రికలకు తెలిపింది. రెండు నెలల్లో బేస్‌మెంట్ ఖాళీ చేస్తామని అఫిడవిట్ సమర్పించిన ఆసుపత్రి యాజమాన్యం అది చేయలేదని ఆమే తెలిపింది. ఆసుపత్రి యాజమాన్యం లాభాపేక్ష, నిర్లక్ష్యంగా ఫలితంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని నిస్సందేహంగా భావించవచ్చు. ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 88 కి…

కోల్‌కతా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, 73 మంది దుర్మరణం

కోల్‌కతా లో ఒక ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 73 మంది దుర్మరణ పాలయ్యారు. చనిపోయినవారిలో అధికులు రోగులే. ప్రమాదం జరిగినపుడు రోగులు నిద్రలో ఉండడంతో అధికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఏడంతస్ధుల భవనంలో పొగ దట్టంగా అలుముకోవడంతో అనేకమందికి ఊపిరాడలేదు. అగ్నిమాపక సిబ్బంది కిటికీలు బద్దలు కొట్టి నిచ్చెనలు ఉపయోగించి రోగులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి కొందరు రోగులను స్ట్రెచర్లలో ఉంచి బైటికి తెస్తున్నారు. బేస్‌మెంట్ లో మంటలు బయలుదేరి ఎ/సి షాఫ్టుల ద్వారా భవనం అంతా వ్యాపించినట్లు…

ఇప్పుడు తిరుపతికి వెళ్తుంటే……

ఆచారాలు, సంప్రదాయాలు భ్రష్టు పట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండకూడదు. ఇప్పుడు తిరుపతికి వెళ్తుంటే క్లబ్ కి వెళ్తున్నట్లుంది –చిన జీయరు స్వామి * * * * (………. …………. …………… ఎడిట్) చినజీయరు స్వామి గారు తిరుపతిని క్లబ్బుతో పోల్చకుండా ఉండవలసింది. ప్రభుత్వం తెస్తున్న మార్పులు అదనంగా వచ్చి చేరేవే తప్ప తిరుపతికి స్వతహాగా ప్రజల్లో ఉన్న గౌరవానికి భంగం కలిగించేవి కాదు. అందువలన ప్రజల మనసుల్లో గౌరవ స్ధానంలో ఉన్న తిరుపతిని క్లబ్బుతో…