పాకిస్ధాన్ లో నిశ్శబ్ద (సైనిక) కుట్ర?

పాకిస్ధాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ గుండె నొప్పి తో దుబాయ్ ఆసుపత్రిలో చేరడంతో పాకిస్ధాన్ లో నిశ్శబ్ద కుట్ర జరుగుతోందన్న వార్తలు వెలువడుతున్నాయి. ‘మెమో గేట్’ కుంభకోణం దరిమిలా పౌర ప్రభుత్వానికీ, సైన్యానికి మధ్య విభేధాలు తీవ్రమైనాయన్న వార్తల నేపధ్యంలో తాజా కుట్ర వార్తలు బలం సంపాదించుకున్నాయి. సైన్యం ఒత్తిడి మేరకు పదవి నుండి రాజీనామా చేయడం కోసమే దుబాయ్ ఆసుపత్రిలో జర్దారీ చేరాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే జర్దారీ ప్రతినిధులు మాత్రం కుట్ర…

కోదండరాం నోట ‘2014’ పాట

టి.ఆర్.ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యిందని కోదండరాం గాని ప్రకటన ద్వారా మరోసారి స్పష్టమయ్యింది. అంతేకాదు. కోదండరాం గారు టి.ఆర్.ఎస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారని కూడా ఆయన ప్రకటన స్పష్టం చేసింది. “2014 సంవత్సరం లోపల తెలంగాణ సాధించే విధంగా త్వరలో కార్యాచరణ రూపొందిస్తాం” అని ప్రొఫెసర్ కోదండరాం గారు మంగళవారం ప్రకటించారు. ఆయన ఇంటెగ్రిటీ పట్ల ఎంతో కొంత ఆశలు పెట్టుకున్నవారికి ఈ ప్రకటన కళ్ళు తెరిపించినట్లయ్యింది. ‘2014 లోపల తెలంగాణ సాధిద్దాం’ అని…

ఐక్యరాజ్య సమితి తప్పుడు సమాచారం ఇస్తోంది -సిరియా అధ్యక్షుడు

సిరియాలో ప్రజల మరణాలపై ఐక్యరాజ్య సమితి ఇస్తున్నవి తప్పుడు లెక్కలని సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సద్ తెలిపాడు. అమెరికా వార్తా సంస్ధ ఎబిసి న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పాడు. సిరియా లో నాలుగు వేల మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. సిరియా వచ్చి ఇక్కడ సర్వే జరిపి నిజా నిజాలు వెల్లడించాలని సిరియా అధ్యక్షుడు కోరాడు. సిరియా భద్రతా దళాలు తన సొంత దళాలు కాదని బషర్ అన్నాడు. దళాలను తాను…

యూరోపియన్ వీధి చిత్ర కళ -ఫొటోలు

యూరప్ లోని వివిధ దేశాల నుండి సేకరించిన వీధి చిత్రాలు ఇవి. ఎంత సృజనాత్మకంగా ఉన్నాయో చూడండి. త్రీ డైమెన్షనల్ చిత్ర కళ అందునా వీధుల్లో ప్రదర్శించడం, ప్రదర్శించి మెప్పించడం ఎంతో సులువుగా చేశారు వీళ్ళు. – –

5 లేదా 6 శాతం కంటె ఎక్కువ ద్రవ్యోల్బణం ఇండియా భరించలేదు -ప్రణబ్

భారత దేశం ఐదు లేదా ఆరు శాతం కంటె ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని భరించలేదని భారత ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం పార్లమెంటులో అన్నాడు. అక్టోబరు నెలలో భారత ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్యోల్బణం 9.73 శాతం గా ఉంది. కనీసం సంవత్సరం నుండి భారత ద్రవ్యోల్బణం తొమ్మిది శాతం కంటే కిందికి దిగి రాలేదు. మరి ద్రవ్యోల్బణం తగ్గించకుండా ప్రణబ్ ముఖర్జీని ఎవరు ఆపారో తెలియడం లేదు. భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను నడిపిస్తున్న ఆర్ధిక పండితులలో…

సిరియా పై అమెరికా ఆశ, అడ్డుపడుతున్న రష్యా -కార్టూన్

– లిబియా ఆయిల్ ను వశం చేసుకున్న ఊపుతో అమెరికా, యూరప్ లు సిరియా లో అల్లర్లు సృష్టిస్తూ దాన్ని కూడా వశం చేసుకోవాలని చూస్తున్నాయి. కాని రష్యా, చైనాలు వాటికి అడ్డుపడుతున్నాయి. సిరియా లో జోక్యం చేసుకోవడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఐక్యరాజ్యసమితి భద్రతా సమితిలో రష్యా, చైనాలు తమ వీటో పవర్ తో ఆ ప్రయత్నాలను వమ్ము చేస్తున్నాయి.

జపాన్ పాలపొడి డబ్బాల్లో రేడియేషన్

జపాన్ లో అతి పెద్ద ‘ఆహార పధార్ధాలు, తిను బండారాలు’ తయారీదారు మేజి కో కంపెనీ తాను సరఫరా చేసిన నాలుగు లక్షల పాల పొడి డబ్బాలను వెనక్కి పిలిపించుకుంటోంది. జపాన్ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం నుండి విడుదలైన రేడియేషన్ ఆనవాళ్ళు పాలపొడి డబ్బాలలో కనిపించడంతో కంపెనీ అర్జెంటుగా డబ్బాలను వెనక్కి పిలిపించుకుంటోంది. ఎన్ని డబ్బాలు వినియోగదారుల వద్దకు చేరుకున్నాయో తమకు తెలియదని కంపెనీ చెప్పింది. అయితే ఆందోళనలో ఉన్న కస్టమర్ల నుండి పెద్ద ఎత్తున…

ఇంటర్నెట్ సామాజిక వెబ్ సైట్లు స్వీయ నియంత్రణ పాటించాలి -కేంద్ర మంత్రి

గూగుల్, ఫేస్ బుక్, యాహూ, మైక్రో సాఫ్ట్ లాంటి ఇంటర్నెట్ సంస్ధలు, సామాజిక వెబ్ సైట్లు తమ సైట్లలో ప్రచురితమయ్యే అంశాల వల్ల ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండడానికి స్వీయ నియంత్రణ పాటించాలని కేంద్ర సమాచార, ఐ.టి శాఖ మంత్రి కబిల్ సిబాల్ మంగళవారం కోరాడు. అనేక సంస్కృతులు, మతాలు ఉన్న భారత దేశంలో ఏ ఒక్కరి మనోభావాలు గాయపడకుండా ఇంటర్నెట్ సంస్ధలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరాడు. మంత్రి ప్రకటనకు ఇంటర్నెట్ సంస్ధలు వివిధ రకాలుగా స్పందించాయి.…