ఎంగిలాకులపై దొర్లే ‘మాదె స్నాన’ దళితులకే పరిమితమైన ఆచారం -ఫొటోలు

దక్షిణ కర్ణాటకలో బ్రాహ్మణులు తిని వదిలేసిన ఎంగిలాకులపై దొర్లే ఆచారంలో బ్రాహ్మణులు కూడా పాటిస్తారని ‘ది హిందూ’ పత్రిక రాసిన దానిలో నిజం లేదని తెలుస్తోంది. నిజానికి ఈ ఆచారం “మోలె కుడియా” అన్న గిరిజన తెగకు చెందినవారే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారని బిబిసి వార్తా సంస్ధ తెలిపింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కుక్కె సుబ్రమణ్య గుడిలో కొనసాగుతున్న ఈ దురాచారాన్ని ప్రభుత్వం అనుమతించింది. దీన్ని రద్దు చేయాలని కొన్ని సంవత్సరాలుగా దళిత, బి.సి సంఘాలు ఆందోళన…

అగ్రకుల పిల్లల పేరే పెట్టుకున్నాడని దళిత బాలుడిని చంపేశారు

భారత దేశంలో కుల దురహంకారం ఇంకా ఏ స్ధాయిలో కొనసాగుతున్నదో ఈ ఘటన పచ్చిగా చెబుతోంది. కుల పిచ్చికి ఉన్న రూపాలు ఇంకా పూర్తిగా ప్రచారం లోకి రాలేదేమోనని ఇటువంటి సంఘటనలు జరిగినపుడే తెలుస్తోంది. అగ్రకులస్ధుడికి ఉన్న ఇద్దరు పిల్లలకు ఏ పేర్లయితే ఉన్నాయో దళిత కులస్ధుడు కూడా పెట్టుకున్నాడు. పేర్లు మార్చుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా మార్చకపొవడంతో దళిత కులస్ధుడి పిల్లల్లో ఒకరిని చంపేశారు. (బి.బి.సి వార్త కోసం ఇక్కడ చూడండి). ఉత్తర ప్రదేశ్ లో ఈ…

డాలరుతో 26 పైసలు పెరిగిన రూపాయి విలువ

స్టాక్ మార్కెట్లు గత రెండు రోజులుగా లాభాల బాట పట్టడంతో ఆ మేరకు రూపాయి విలువ కూడా కోలుకుంటోంది. శుక్రవారం రూపాయి విలువ డాలరు విలువతో పోలిస్తే 26 పైసలు పెరిగి రు.52.20/21 కు చేరుకుంది. ఇది గత రెండు వారాలలో అత్యధిక స్ధాయి కావడం గమనార్హం. ఎగుమతిదారులు, కొంతమంది కార్పొరేట్ కంపెనీలు డాలర్ల అమ్మకం చేపట్టడంతో రూపాయి విలువ పెరుగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు లాభాలు సంపాదిస్తుండడం కూడా రూపాయి విలువ కోలుకోవడానికి దారి…

హెచ్చరిక లేకుండా దాడి చేస్తే అనుమతి కోసం చూడకుండా బదులివ్వండి -పాక్ ఆర్మీ ఛీఫ్

హెచ్చరికలు లేకుండా పై దాడి జరిగితే పాకిస్ధాన్ సైనికులు తిరిగి దాడి చేయడానికి ఇక తమ పై అధికారుల అనుమతి తీసుకోనవసరం లేదని పాకిస్ధాన్ మిలట్రీ ఛీఫ్ జనరల్ అష్ఫక్ కయానీ పాకిస్ధాన్ కమేండర్లకు చెప్పాడు. పాకిస్ధాన్ చెక్ పోస్టులపై దాడి చేసి అమెరికా కమెండోలు పాక్ సైనికులను చంపడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. “ఏ ఒక్క పాకిస్ధాన్ కమాండర్ మదిలో కూడా ఈ విషయంలో, ఏ స్ధాయిలోనైనా సరే, ఎటువంటి అనుమానం ఉంచుకోరాదు. తిరిగి…

ఎన్.డి.ఎ వంద శాతం ఎఫ్.డి.ఐ రిటైల్ రంగంలో రావాలని ప్రతిపాదించింది కదా -మంత్రి

ఎన్.డి.ఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు రిటైల్ రంగంలోకి వంద శాతం పెట్టుబడుల రావాలని ప్రతిపాదించిందని కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గుర్తు చేశాడు. యు.పి.ఎ ప్రభుత్వం అప్పటినుండి అనేక చర్చోప చర్చలు సాగించి కేవలం 51 శాతం మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు రిటైల్ రంగంలోకి అనుమతించాలని ఖుర్షీద్ తెలిపాడు. “రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించే నిర్ణయం తీసుకునే ముందు మేము అనేక రకాలుగా ఆలోచించాం. ఎన్.డి.ఎ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటినుండీ అనేక విధాలుగా ఈ విషయమై…

పాకిస్ధాన్ ప్రతినిధులు ఓ.కె అన్నాకే అమెరికా దాడి చేసింది -వాల్‌స్ట్రీట్ జర్నల్

ఇరవై నాలుగు మంది పాకిస్ధానీ సైనికులు చనిపోవడానికి కారణమైన అమెరికా హెలికాప్టర్లు, జెట్ ఫైటర్ల దాడిని ‘ఉమ్మడి కమాండ్ సెంటర్’ లోని పాకిస్ధాన్ ప్రతినిధులు ఆమోదించిన తర్వాతే చేశామని అమెరికా కమేండర్లు చెప్పినట్లుగా ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక తెలిపింది. కమాండ్ సెంటర్ లో ఉన్న పాకిస్ధాని ప్రతినిధులకు దాడి జరిగే చోట పాకిస్ధాన్ తాత్కాలిక పోస్టు నెలకొల్పిందని తెలియకపోవడంతో వారు దాడికి పచ్చ జెండా ఊపారని అమెరికా కమేండోలు తెలిపారు. అయితే కాల్పులు ప్రారంభం అయ్యాక…