అమెరికాపై పాకిస్ధాన్ ప్రతీకారం, అమెరికా సైనికులకు ఆహార, ఆయుధ సరఫరాలు బంద్
ఆఫ్ఘనిస్ధాన్ తో గల సరిహద్దుకు సమీపాన చెక్ పాయింట్ వద్ద కాపలాగా ఉన్న పాకిస్ధాన్ సైనికులు 28 మందిని అమెరికా హెలికాప్టర్ దాడి చేసి చంపడానికి వ్యతిరేకంగా పాకిస్ధాన్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న అమెరికా సైనికులకు ఆయుధాలు, ఆహారం తన భూభాగం ద్వారా సరఫరా కాకుండా అడ్డుకుంది. అంతమంది సైనికులు తమ దాడిలో చనిపోయినప్పటికీ అమెరికా సైన్యం నుండి ఇంతవరకు సరైన ప్రకటన రాలేదు. “ఎవరైనా చనిపోతే వారికి మా సానుభూతి” అని…