ఎన్‌కౌంటర్ లో కాదు, ‘కిషన్ జీ’ ని చిత్ర హింసలు పెట్టి చంపారు -వరవర రావు

మావోయిస్టు నాయకుడు ‘కిషన్ జీ’ ఉరఫ్ ‘మల్లోజుల కోటేశ్వర రావు’ ను బెంగాల్ పోలీసులు చిత్ర హింసలు పెట్టి బూటకపు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపారని ‘విప్లవ రచయితల సంఘం’ (విరసం) సభ్యుడు వరవర రావు శుక్రవారం ఆరోపించాడు. “కిషన్ జీ దేహంపై అనేక గాయాలున్నాయి. ఆయన్ని బూటకపు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపే ముందు చిత్ర హింసలు పెట్టారని ఆ గాయలను బట్టి అర్ధమవుతోంది” అని వరవర్రావు కోల్‌కతా లో మాట్లాడుతూ అన్నాడు. ఒక రోజు…

చిల్లర దుకాణాల్లో విదేశీ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం, విపక్షాల నటనాగ్రహం

ప్రపంచ వ్యాపితంగా వ్యాపారాలు చేస్తున్న అతి పెద్ద చిల్లర సరుకుల అమ్మకం దారులు (రిటైల్ అమ్మకాలు సాగించే సూపర్ మార్కెట్లు) వాల్ మార్డ్, కేరేఫర్, టెస్కో లాంటి కంపెనీలను భారత దేశంలోకి అనుమతించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం కోసం అనేక సంవత్సరాలుగా పశ్చిమ దేశాలు భారత దేశంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. భారత దేశ దళారీ పాలకులు, దళారి కంపెనీల తృప్తికి సరిపడా బేరాలు కుదరలేదేమో, ఇన్నాళ్ళూ అది కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు…

వారి శరీరమే ఓ కాన్వాస్ -ఫొటోలు

తమ శరీరాలనే కాన్వాస్ లు గా మలుచుకుని ప్రదర్శించే కళ బాడీ ఆర్ట్. ఈ బాడి ఆర్ట్ కి సంబంధించి నవంబరు 20 తేదీన వెనిజులా లోని కారకాస్ నగరంలో ప్రపంచ స్ధాయి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు 18 దేశాలనుండి 50 కి పైగా కళాకారులు పాల్గొన్నారు. బాడీ ఆర్ట్ లో శరీరాలపై పెయింట్లు వేసుకోవడం, పచ్చ బట్లు పొడిపొంచుకోవడం దగ్గర్నుండి కేవలం ఆభరణాలు ధరించడం వరకూ ఉంటుంది. వివిధ ఊహా చిత్రాలనుండీ తమ తమ…

ఐ-ఫోన్ పాపాయి -కార్టూన్

సమాచార విప్లవం కొంత పుంతలు తొక్కుతోంది. బొమ్మ, పాట, మాట, కదిలే బొమ్మ అన్నీ జేబులో ఒదిగిపోతున్నాయి. ప్రభుత్వాల విధానాలతో సమాచార విప్లవ ఫలితాలు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. అంతేనా, కంప్యూటర్ల దగ్గర్నుండి ఐ ఫోన్ల వరకూ అన్నీ చిన్న పిల్లలకు కూడా అత్యవసరాలుగా మారిపోయాయి. – –