రికార్డు స్ధాయిలో రూపాయి పతనం

మంగళవారం రూపాయి రికార్డు స్ధాయిలో పతనం అయ్యింది. ఒక దశలో డాలరుకు రు.52.73 పై.ల విలువకు రూపాయి పతనం అయ్యింది. మంగళవారం వ్యాపార సమయం ముగిసే నాటికి అత్యల్ప స్ధాయి డాలరుకు రు.52.73 పై ల నుండి కొద్దిగా కోలుకుని డాలరుకు రు.52.32  పై.ల స్ధాయికి రూపాయి విలువ చేరుకుంది. అంటే సోమవారం ముగింపు డాలరుకు రు.52.16 పై.ల స్ధాయితో పోలిస్తే మంగళవారం రూపాయి 16 పైసల విలువ కోల్పోయింది. ముప్ఫై షేర్ల సెన్సెక్స్ మంగళవారం ఎనిమి…

ఇరాక్‌లో లక్షన్నర అమెరికా సైన్యం, కాశ్మీర్ లో ఏడు లక్షల ఇండియా సైన్యం -అరుంధతి రాయ్

అమెరికా నాయకత్వంలోని నాటో బలగాలు ఇరాక్ లో లక్షన్నర వరకూ ఉండగా, చిన్నపాటి కాశ్మీరు లోయలో మాత్రం భారత సైన్యాలు ఏడు లక్షలకు పైగా మొహరించాయని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ పేర్కొంది. న్యూయార్క్ నగరంలోని ఆసియా సొసైటీ వారు నిర్వహించిన ఒక కాన్ఫరెన్సులో కాశ్మీరు విషయమై మాట్లాడుతూ ఆమే ఈ వ్యాఖ్యలు చేశారు. “కాశ్మీర్: ద కేస్ ఫర్ ఫ్రీడం” అన్న అంశంపై ఈ కాన్ఫరెన్సు జరిగింది. ప్రపంచంలోనే అత్యంత రక్తపూరితమైన ఆక్రమణలలో కాశ్మీరు ఒకటని…

కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ చిరస్మరణీయుడు -అద్భుతమైన కవిత

వాడ్ని గిరజాల జుట్టోడని వాళ్ళు తెగ ఆడిపోసుకున్నారు, అది తమ బర్బర ఆదివాసీ సాంస్కృతిక వారసత్వ సంపద అన్నాడు.           సర్వ సేనానిగా ఉండి ఆఫ్ట్రాల్ కల్నల్ బిరుదేమిటన్నారు,           జనరల్ కంటే కల్నలే సిపాయిల్లో మమేకతకి సాధనమన్నాడు. రాజై రాజ దుస్తులొదిలి సైనిక దుస్తుల ధారణేమిటని వెక్కిరించారు, అది ‘ప్రపంచ పోలీసు’ పై సాయుధ ప్రతిఘటనా సంకేతమన్నాడు.           విదేశీ సభలకీ ఒంటె, టెంటు, మందీ, మార్బలాలు ఆటవికమన్నారు,           ఎడారి మూలవాసుల బిడారి వృత్తిపట్ల…

అమెరికాకి ఒక తలుపు మూసుకుంటే మరొక తెలుపు తెరుచుకుంటుంది -కార్టూన్

అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇటీవలి కాలంలో రెండు కీలక నిర్ణయాలను ప్రకటించాడు. అవి రెండూ ప్రపంచ దేశాలపైన అమెరికా ఆధిపత్యానికి సంబంధించినవి. మరీ ముఖ్యంగా ఆసియా, మధ్య ప్రాచ్యం ప్రాంతాలలో అమెరికా ఉనికికి సంబంధించినవి. ఇరాక్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుండి విదేశీ సైనికులని ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించడంతో ఇరాక్ లో పనైపోయింది కనుక అక్కడి నుండి ఉపసంహరించుకుంటున్నామని అట్టహాసంగా ప్రకటించాడు. ఆఫ్ఘనిస్ధాన్ నుండి కూడా దాదాపు అదే కారణంతో సైనిక ఉపసంహరణను ప్రకటించాడు. ఆ క్రమం…

‘ఇష్రత్ జహాన్’ ఎన్‌కౌంటర్ పచ్చి బూటకం, నరేంద్ర మోడికి మరో లెంపకాయ

నరేంద్ర మోడి హయాంలో గుజరాత్ పోలీసులు సాగించిన బూటకపు ఎన్‌కౌంటర్ ల గుట్టుమట్లు ఒక్కొక్కటీ వెల్లడవుతున్నాయి. నిప్పులాంటి నిజాలు తమను ఆవహించిన నివురుని చీల్చుకుని బైటికి వస్తున్నాయి. గుజరాత్ హైకోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) పందొమ్మిదేళ్ళ విద్యార్ధినితో పాటు మరొక ముగ్గురు యువకులను ఉత్తి పుణ్యానికి కాల్చిచంపి ఎన్ కౌంటర్ గా కధ అల్లిన ఘటనపైన విచారణ జరిపి నిజా నిజాలను వెల్లడించింది. పోలీసు ఉన్నతాధికారులు చెప్పినట్లుగా ఇష్రత్ జహాన్, జావేద్ షేక్ అలియాస్…