‘తెలంగాణ’ ఏర్పాటుపై ఇంత ద్వేషం అవసరమా?

ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుపైన ఇంత నటన, రాజకీయం, ఎగతాళి, విద్వేషం అవసరమా? తెలంగాణ ప్రాంతం వాళ్ళు భారత దేశం నుండి విడిపోతామని కోరుతున్నారా? కేంద్ర ప్రభుత్వ అధికారం తమపై వద్దని నిరాకరిస్తున్నారా? తెలంగాణకు స్వయం ప్రతిపత్తి కావాలని అడుగుతున్నారా? పాకిస్ధానీ ఐ.ఎస్.ఐ కి గూఢచారుల్ని సరఫరా చేస్తున్నారా లేక చైనా ఇంటెలిజెన్స్ కు సమాచారం ఇస్తున్నారా? తెలంగాణ రాష్ట్రం అడుగుతున్నారా వాళ్ళు, లేక తెలంగాణ దేశం అడుగుతున్నారా? కేవలం రాష్ట్రం మాత్రమే తెలంగాణ ప్రజలు అడుగుతున్నది.…

పాపం అంతా యూరోజోన్‌దే -నిరుద్యోగం పై బ్రిటన్ ప్రభుత్వం

కన్సర్వేటివ్ ల నాయకత్వంలోని కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రిటన్ ప్రభుత్వం బ్రిటన్ నిరుద్యోగం పాపం అంతా యూరోజోన్ సంక్షోభందేనని చేతులు దులుపుకుంది. బ్రిటన్ లో నిరుద్యోగం పెరగడానికి దేశీయంగా ప్రభుత్వ రంగం, ప్రవేటు రంగం, ఛారిటి రంగాల నిర్వాకాలే కారణమని సి.ఐ.పి.డి నివేదిక చెబుతుండగా ట్రెజరీ కి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న మార్క్ హోబన్ మాత్రం పాపం అంతా యూరోజోన్ సంక్షోభంపైకి నెట్టేసి దులుపుకున్నాడు. యూరప్ లో 27 దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్ గా ఏర్పడ్డాయి.…

బ్రిటన్ లో దారుణ స్ధితికి చేరుకున్న నిరుద్యోగం

యూరప్ రుణ సంక్షోభం బ్రిటన్ పైన దారుణంగా ప్రభావం చూపుతోంది. ఉపాధి అవకాశాలు అక్కడ పూర్తిగా పడిపోయాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి. పబ్లిక్, ప్రవేటు రెండు రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. పొదుపు ఆర్ధిక విధానాల పేరుతో ప్రభుత్వరంగాన్ని ప్రవేటుపరం చేస్తుండడంతో ప్రభుత్వరంగంలో ఉపాధి అవకాశాలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. కంపెనీలు ఉద్యోగులను నియమించే ఆలోచనే పెట్టుకోవడం లేదు. ఒకరిద్దరూ ఎవరైనా నియామకాలకు పూనుకున్నా, యూరప్ లోని తాజా పరిణామాలతో ఆ ప్రయత్నాలను రద్దు చేసుకుంటున్నారు. పైగా…

చంద్రబాబునాయుడు ఆస్తులపై సి.బి.ఐ విచారణకు హైకోర్టు ఆదేశం

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విసిరిన పాచిక తాత్కాలికంగానైనా పని చేసినట్లు కనిపిస్తోంది. దాదాపు రెండు వేల పేజీల సాక్ష్యాలతో మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల సంపాదించాడంటూ జగన్ తల్లి వై.విజయమ్మ ద్వారా వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు డివిజన్ బెంచి పిటిషనర్ల కోరిక మేరకు సి.బి.ఐని రంగంలోకి దించింది. వై.విజయమ్మ ఆరోపించినట్లుగా మాజీ ముఖ్యమంత్రి తన అధికారాన్ని ఉపయోగించుకుని, రామోజీరావును ముందుంచి అక్రమ ఆస్తులను సంపాదించిందీ లేనిదీ విచారించవలసిందిగా హైకోర్టు బెంచి సి.బి.ఐని ఆదేశించింది.…

జమ్ము& కాశ్మీర్ లో సైనిక చట్టం ఉపసంహరణకు ప్రధాని, సి.ఎం సమావేశం

జమ్ము&కాశ్మీరు రాష్ట్రంలో ప్రజల పాలిట మృత్యుపాశంగా మారిన “సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ – ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ)” ను కొన్ని జిల్లాలలో ఉపసంహరించుకునే విషయమై చర్చించడానికి సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధానితో సమావేశం అయ్యాడు. గత కొన్ని వారాలుగా ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ చట్టాన్ని భద్రతా పరిస్ధితులు మెరుగుపడిన జిల్లాలలో ఉపసంహరించాలని జమ్ము&కాశ్మీరు ముఖ్యమంత్రి వాదిస్తూ వచ్చాడు. సి.ఎం వాదనను సైనిక దళాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భద్రత రిత్యా చట్టం ఉపసంహరణ…