‘హరిద్వార్’ పుణ్యక్షేత్రం వద్ద తొక్కిసలాట, 16 మంది భక్తుల దుర్మరణం

హిందువుల పుణ్య క్షేత్రం హరిద్వార్ లో ‘ఆచార్య పండిట్ శ్రీరాం శర్మ’ గారి వందవ పుట్టినరోజు సందర్భంగా జరిగిన మత కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 14 మంది స్త్రీలు, ఇద్దరు పురుషులు దుర్మరణం చెందారు. గంగా నదిపై గల ప్రఖ్యాతి చెందిన ‘హర్ కి పురి’ ఘాట్ వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో మరో ముప్ఫై మంది గాయపడ్డట్లుగా జిలా కలెక్టర్ తెలిపాడు. చనిపోయినవారు ఎక్కువమంతి వయసు మళ్ళినవారేనని ఎస్.పి తెలిపాడు. కొన్ని పదుల వేలమంది హాజరైన…

పెట్రోల్ ధరలపై త్రిణమూల్ బెదిరింపులు ఉత్తుత్తివే

“పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించకపోతే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాం” అని బెదిరించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, చివరికి తన బెదిరింపులు నిజమైనవి కావని తేల్చేసింది. మంగళవారం ప్రధానితో సమావేశమైన తృణమూల్ కాంగ్రెస్ ఎం.పి లు ప్రధాని నుండి తమకు ఏ విధమైన హామీ రాలేదని చెప్పారు. “(ఇప్పుడు పెంచితే పెంచారు), ఇకముందు పెంచకూడదు” అని హెచ్చరించి వచ్చాం” అని కూడా వారు పత్రికలకు చెప్పి చక్కా పోయారు. ‘లేస్తే మనిషిని కాను’ టైపు ప్రకటనలతో ప్రజల్నీ,…

సొమ్ములు నొక్కడానికి పాపులిస్టు ఫోజులు, మమత నక్క జిత్తులు

పెట్రోలు ధరలు ఈ సంవత్సరం ఇప్పటికి ఐదు దార్లు పెంచారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పదకొండు సార్లు పెంచారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపుపై గతంలో ఎన్నడూ నోరు విప్పని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కొద్ది రోజుల క్రితం రు1.80 లు పెంచితే గయ్యిమని లేచింది. పెంచిన రేట్లు తగ్గిస్తారా లేక కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించమంటారా? అంటూ తాఖీదు పంపింది. పెట్రోల్ ధరలు తగ్గించకపోతే మద్దతు ఉపసంహరిస్తామని తన ఎం.పిలు (తనకు తెలియకుండా)…