తానింకా సోషలిస్టునే అంటున్న గ్రీకు ప్రధాని -కార్టూన్

చెయ్యాల్సిందంతా చేసిన గ్రీకు ప్రధాని జార్జి పపాండ్రూ తానింకా సోషలిస్టునే నని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నాడు. ఇప్పటికి ఐదు విడతలుగా అత్యంత కఠినమైన ప్రజా వ్యతిరేక పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేసిన పపాండ్రూ ఆరో విడత కోతలకు ప్రజల అనుమతి కావాలంటూ బయలుదేరాడు. గ్రీసు కోసం ఇ.యు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందంపైన గ్రీసు ప్రజల అనుమతి కోసం ‘రిఫరెండం’ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. మొదటి ఐదు విడత కోతలకు ప్రజల అనుమతి తీసుకోవాలని పపాండ్రూకి గుర్తు రాలేదు.…

లేని బాధ్యతను నెత్తినేసుకున్న అబ్దుల్ కలాం?

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తనకు మాలిన ధర్మాన్ని నెత్తిన వేసుకున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడులోని కుదంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి మద్దతుగా ప్రకటనలు జారీ చేస్తూ ఆయన, ప్రముఖంగా వార్తలలో నిలుస్తున్నాడు. ఆదివారం ఏకంగా కుదంకుళం ప్లాంటు సందర్శించి ప్రభుత్వం తరపునా, కంపెనీ తరపునా వకాల్తా పుచ్చుకుని ప్లాంటులో భద్రతా ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు. కుదంకుళం అణు విద్యుత్ కేంద్రం లో భద్రతా ఏర్పాట్లపైన ఏర్పడిన భయాలను పారద్రోలే పనిలో అబ్దుల్ కలాం…

అబ్బే, ఇండియాకి ఆ హోదాం మేం ఇవ్వలేదు -పాక్ ప్రధాని గిలాని

భారత్ అధికారుల అనుమానం నిజం అయ్యింది. ఇండియాకి తామింకా “అత్యంత అనుకూలమైన దేశం’ (మోస్ట్ ఫేవర్డ్ నేషన్ -ఎం.ఎఫ్.ఎఫ్) హోదా ఇవ్వలేదని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలాని స్పష్టం చేశాడు. ఆ హోదా ఇవ్వడానికి చర్చలు జరిపడానికి ముందుకు కదలాల్సిందిగా ‘వాణిజ్య మంత్రిత్వ శాఖ’ కు ఆదేశాలివ్వడం మాత్రమే జరిగిందని ఆయన శనివారం వెల్లడించాడు. “ఈ అంశంలో ముందడుగు వెయ్యాలని వాణిజ్య శాఖకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇండియాతో వాణిజ్యం విషయంలో చురుకుగా ఉన్న…