పెట్రోల్ ధర తగ్గించకపోతే మద్దతు ఉపసంహరిస్తా -మమత బెనర్జీ

యు.పి.ఎ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న త్రిణమూల్ కాంగ్రెస్ శుక్రవారం పెట్రోల్ ధర పెంపును నిరసించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకోకపోతే తాను యు.పి.ఏ కు మద్దతు ఉపసంహరిస్తానని ప్రకటించింది. “నేను కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాకె మెయిల్ చేయడం లేదు. కాని మా పార్టీని అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు” అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించింది. తన హెచ్చరికను ప్రధాని మన్మోహన్ జి20 సమావేశాలనుండి వెనక్కి వచ్చేవరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే మమతా బెనర్జీ అభ్యంతరం తమ పార్టీతో…

ఇండియాకు ‘అత్యంత అనుకూల దేశం’ హోదా ఇవ్వడానికి పాకిస్ధాన్ వెనకడుగు?

ఈ వారం ప్రారంభంలో ఇండియాకు, పాకిస్ధాన్ ప్రకటించిన ‘అత్యంత అనుకూల దేశం’ (మోస్ట ఫేవర్డ్ నేషన్ -ఎం.ఎఫ్.ఎన్) హోదా ను మళ్ళీ చిక్కులో పడింది. దేశీయంగా తలెత్తిన అభ్యంతరాలతో ఇండియాకు ఎమ్.ఎఫ్.ఎఫ్ హోదా ఇవ్వకుండా వెనక్కి తీసుకుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు ఈ అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ శుక్రవారం తెలిపింది. ఎం.ఎఫ్.ఎన్ హోదా ఉన్నట్లయితే కొన్ని వ్యాపార సంభంధిత ప్రయోజనాలను ఇండియా పొందగలుగుతుంది. ఇండియా, పాకిస్ధాన్ కు ఎన్నడో…

‘గాలి’ కేసులో సి.బి.ఐ ముందు హాజరైన ‘జగన్’

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అధిపతి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజ శేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సి.బి.ఐ కోర్టు ముందు హాజరయ్యాదు. హాద్రాబాద్ లో కోఠి సెంటర్ వద్ద ఉన్న సి.బి.ఐ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు హాజరయినట్లుగా వార్తా ఛానెళ్ళు తెలిపాయి. గాలి జనార్ధనరెడ్డి పాల్పడిన అక్రమ మైనింగ్ కేసులో ప్రశ్నించడం కోసం సి.బి.ఐ సమన్లు జారీ చేయడంతో జగన్ సి.బి.ఐ ముందు హాజరు కావలసి వచ్చింది. గాలి జనార్ధన రెడ్డికి చెందిన ‘ఓబులాపురం…