పాక్‌పై అమెరికా దాడి చేస్తే ఆఫ్ఘనిస్ధాన్ పాక్ పక్షమే నిలుస్తుంది -ఆఫ్ఘన్ అధ్యక్షుడు

“పరిస్ధితులు అనుకూలించక అమెరికా పాకిస్ధాన్ పైన దాడి చేసినట్లయితే, దైవం నివారించుగాక, ఆఫ్ఘనిస్ధాన్ నిస్సందేహంగా పాకిస్ధాన్ కే మద్దతుగా నిలుస్తుంది” అని ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ వ్యాఖ్యానించాడు. అమెరికా, పాక్ పై దాడి చేయడం ప్రస్తుత పరిస్ధితుల్లొ పూర్తిగా అసంగతం అయినప్పటికీ మాటమాత్రంగానైనా ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు పొరుగు దేశం పక్షానే నిలుస్తానని చెప్పడం సంతోషించ దగిన విషయం. కనీసం మాటల్లోనైనా ఆఫ్ఘన్ అధ్యక్షుడు పొరుగు దేశం పక్షాన నిలిచాడు. నిజానికి ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాల మధ్య…

సరిహద్దులో భారత్ హెలికాప్టర్ ను బలవంతంగా దింపిన పాకిస్ధాన్ ఫైటర్ జెట్లు

భారత హెలికాప్టర్ ఒకటి పాకిస్ధాన్ గగనతలంలోకి చొరబడడంతో పాకిస్ధాన్ మిలట్రీకి చెందిన ఫైటర్ జెట్ విమానాలు దానిని బలవంతంగా కిందికి దింపాయి. హెలికాప్టర్ లో నలుగుతు భారత్ మిలట్రీ అధికారులు ఉన్నారు. పాకిస్ధాన్ గగనతలంలోకి జరిగిన చొరబాటు ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదనీ, దట్టంగా మంచు కమ్మడంతో జరిగిందనీ భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు. నలుగురు అధికారులు ప్రస్తుతం పాకిస్ధాన్ కస్టడీలో ఉన్నారు. నలుగురు క్షేమంగా ఉన్నారని పాకిస్ధాన్ అధికారులు చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంట…

నరేంద్ర మోడిపై ఛార్జి షీటు దాఖలుకు పుష్కల అవకాశాలు

గుజరాత్ మారణకాండలో హత్యకు గురైన కాంగ్రెస్ ఎం.పి జాకియా జాఫ్రి కేసులో నిజా నిజాలను వెల్లడించడానికి సుప్రీం కోర్టు నియమించుకున్న అమికస్ క్యూరీ ‘రాజు రామచంద్రన్’ నివేదిక పుణ్యమాని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడిపైన ఛార్జి షీటు దాఖలు చేసి విచారించడానికి అవకాశాలు పెరిగాయి. అమికస్ క్యూరి నివేదికలో పొందుపరిచిన వివరాల ఆధారంగా 2002లో జరిగిన ముస్లింల మారణకాండకు బాధ్యుడిగా నరేంద్రమోడిపైన ఛార్జిషీటు దాఖలు చేయడం కోసం తగిన పునాది ఏర్పడిందని చెప్పవచ్చు. నివేదిక ఇంకా రహస్యంగా ఉన్నప్పటికీ…

ఇప్పుడిక ప్రజలపై బాదుడే ప్రణాళికల లక్ష్యం

చైనాలో మావో సేటుంగ్ ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు భారత ప్రధాని నెహ్రూ భారత్ కి కూడా ఉపయోగపడతాయని భావించాడు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో అవి పకడ్బందీగా అమలు జరిగాయి. ఆ మేరకు చైనా ప్రజలు అమితంగా లాభపడ్డారు. ఆర్ధిక వ్యవస్ధను ప్రవేటు పెట్టుబడిదారుల ఇష్టారాజ్యానికి వదిలేయకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉంచుకుంటూ ఏ కాలానికి ఏ రంగంలో ఎంత ఉత్పత్తిని సాధించాలి అన్న విషయాలను ప్రభుత్వమే నిర్ణయించే వ్యవస్ధను ప్రణాళికాబద్ధ ఆర్ధిక వ్యవస్ధగా చెప్పుకుంటున్నాం. భారత దేశం…