నాటో బాంబు దాడిలో గడ్డాఫీ మరణం -ఫొటో

గడ్డాఫీ చనిపోయింది లిబియా తిరుగుబాటు సైన్యాల చేతుల్లో కాదు. జన్మ పట్టణం సిర్టే నుండి వాహనాల కాన్వాయ్ లో కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ వెళుతుండగా నాటో బలగాలు అతని వాహనాలపై బాంబు దాడులు చేశాయి. రెండు కాళ్ళు, తలకు బలమైన గాయాలు కావడంతో అతని గాయాలతోనే చనిపోయాడు. గడ్డాఫీ విగత శరీరాన్ని మిస్రాటా నగరానికి తెచ్చినట్లుగా రాయిటర్స్ ప్రకటించింది. గడ్డాఫీ మృత శరీరం ఫోటోను యూట్యూబ్ లో ఉంచబడింది. – —

లిబియా అధ్యక్షుడు గడ్డాఫీని పట్టుకుని చంపేసిన నాటో బలగాలు?

లిబియా అధ్యక్షుడు మౌమ్మర్ గడ్డాఫీని అతని సొంత పట్టణం సిర్టే లోనే పట్టుకుని చంపినట్లుగా ఆల్ జజీరా టివి ఛానెల్ ప్రకటించింది. బిబిసి, రాయిటర్స్ తదితర ఛానెళ్ళు గడ్డాఫీని పట్టుబడ్డాడని చెబుతున్నప్పటికీ చంపేసిన సంగతిని ధ్రృవీకరించడం లేదు. ‘కాల్చొద్దు, కాల్చొద్దు’ అని గడ్డాఫీ కేకలు వేసినట్లుగా పశ్చిమ దేశాల వార్తా ఛానెళ్ళు అప్పుడే దుష్ప్రచారం మొదలుపెట్టాయి. గడ్డాఫీ గాయపడ్డాడని కొందరు చెబుతుండగా అతన్ని చంపేశారని మరికొందరు చెబుతున్నారని బిబిసి తెలిపింది. “అతను పట్టుబడ్డాడు. అతని రెండు కాళ్ళకూ…

పెద్ద దొంగను పట్టిస్తే జరిగేదేమిటి? -కార్టూన్

సౌదీ అరేబియాలో, అది కూడా రాజధాని రియాధ్ లోనే దరిద్రం ఎలా తాండవిస్తున్నదీ తెలియజెస్తూ ఫెరాస్ బగ్నా అనే యువకుడు ఒక చిన్న వీడియో తీసి దానిని ఇంటర్నెట్ లో పోస్ట్ చేసాడు. ఆ వీడియో చూసిన ధనవంతులు తమకు తోచిన మొత్తాన్ని దానం చేసి దరిద్రులకు అండగా నిలుస్తారని అతను భావించాడు. కాని అతనికి తెలియని మరొక విషయం కూడా వీడియో ద్వారా వెల్లడయింది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న సౌదీ అరేబియా ప్రజలు, అందునా…

అమెరికా వ్యాపార రహస్యాలు అమ్ముతూ పట్టుబడిన చైనీయుడు

అమెరికాలో స్ధిర నివాసం ఏర్పరచుకున్న చైనా శాస్త్రవేత్త ఒకరు అమెరికా వ్యాపార రహస్యాలను చైనాకు అమ్మడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయాడు. ‘డౌ ఆగ్రో సైన్సెస్’ కంపెనీలో పరిశోధనా శాస్త్రవేత్తగా పని చేస్తూ వ్యాపార రహస్యాలను అందజేసాననీ, కార్గిల్ కంపెనీలో పని చేస్తుండగా వ్యాపార రహస్యాలను దొంగిలించానని సదరు శాస్త్రవేత్త ‘కీక్సూ హువాంగ్’ అంగీకరించాడని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్’ (డి.ఒ.జె) డాక్యుమెంట్ల ద్వారా వెల్లడయ్యింది. గత ఆగస్టులోనే ఇదే విధంగా ‘జున్ వాంగ్’ అనే చైనీయుడు అత్యున్నత సామర్ధ్యంగల న్యూక్లియర్…

“వెయ్యి మందికి ఒకరు, ఒకరికి వెయ్యి మంది” -కార్టూన్

మూడు రోజుల క్రితం పాలస్తీనా పోరాట సంస్ధ హమాస్, ఇజ్రాయెల్ ప్రభుత్వం మధ్య ఖైదీల మార్పిడి జరిగింది. హమాస్ తమ బందీగా ఉన్న ఒకే ఒక్క ఇజ్రాయెల్ సైనికుడు (గిలాద్ షాలిత్) ను వదిలిపెట్టగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం దశాబ్దాల తరబడి విచారణ లేకుండా తాను ఖైదు చేసి ఉంచిన 1027 మంది పాలస్తీనీయులను విడుదల చేయవలసి వచ్చింది. ఈ మార్పిడి కోసం గత ఐదు సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. అసలు మార్పిడి జరగదని కూడా అనుకున్నా, ఇజ్రాయెల్…