లిబియాలో నాటో హత్యాకాండ -గ్రాఫిక్స్‌తో వివరణ

అక్టోబరు 31 తో లిబియాపై నాటో యుద్ధం ముగిసినట్లుగా నాటో కూటమి ప్రకటించింది. యుద్ధం ముగిసింది కాబట్టి నాటో సైన్యాలు, గూఢచారులు లిబియా వదిలి పోతున్నాయనుకుంటే పొరబాటే. లిబియా జలాల్లో మొహరించిన నాటో దేశాల యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు తమ పూర్వ ప్రాంతానికి వెళతాయని భావించినా పొరబాటే. ఎందుకంటె అవి అక్కడే, లిబియాపై దాడులు జరిగనంతకాలం ఎక్కడ ఉన్నాయో అక్కడే కొనసాగబోతున్నాయి. పైగా గూఢచారులు, సైనికులు మరింత స్వేచ్ఛగా బహిరంగంగా లిబియా నేలపైన సుదీర్ఘ…

3 రోజుల్లో 24 మంది ఆఫ్ఘన్ దురాక్రమణ సైనికుల హతం

ఆఫ్ఘనిస్ధాన్ లో పాశ్చ్యాత్య దురాక్రమణ సైన్యం చావు దెబ్బలు తినడం కొనసాగుతోంది. గత శనివారం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ వద్ద జరిగిన భూతల దాడిలో 17 మంది సైనికులు చనిపోగా, దక్షిణ ఆఫ్ఘనిస్ధన్ లో ఆఫ్ఘనిస్ధాన్ సైనికాధికారి ఒకరు తిరగబడి ఆస్ట్రేలియా సైనికులను ముగ్గురిని కాల్చి చంపాడు. ఈ రోజు సోమవారం 4గురు విదేశీ సైనికులను కాందహార్ వద్ద తాలిబాన్ మిలిటెంట్లు కాల్చి చంపారు. ఈ నలుగురితో కలుపుకుని గత మూడు రోజుల్లోనే 24 మంది దురాక్రమణ…

‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమంతో పెరిగిన పోలీసు ఉద్యోగాలు! -కార్టూన్

“వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం ప్రపంచవ్యాపితంగా 85 దేశాలలోని 2,500 నగరాలకు వ్యాపించినట్లుగా ఉద్యమ సంస్ధల వెబ్ సైట్లు చెబుతున్నాయి. ఈ ఉద్యమం ఇతర ప్రాంతాల్లో కంటె అమెరికా, యూరప్ లలోనే ఎక్కువగా కనిపిస్తోంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలలో కొన్ని ప్రధాన పట్టణాలలో పదుల సంఖ్యలో మాత్రమే నిరసనకారులను ఆకర్షిస్తున్న ఈ ఉద్యమం ఉత్తర అమెరికా, యూరప్ దేశాలలో మాత్రం వేల సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తోంది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి ఎక్కువగా దెబ్బ తిన్నది అమెరికా,…

2010 సం.లో ఇండియాలో 5484 మంది పిల్లలపై లైంగిక అత్యాచారాలు

పిల్లలపై అత్యాచారాలు జరపడంలో భారత దేశం పశ్చిమ దేశాలతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్క 2010 సంవత్సరంలోనే భారత దేశంలో 5484 మంది పిల్లలపై లైంగిక అత్యాచారాలు జరిగాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో తన నివేదికలో తెలియజేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 1408 మంది పిల్లలను చంపేశారని కూడా ఆ నివేదిక పేర్కొంది. అలాగే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటా కలుపుకుని మొత్తం 10,670 మంది పిల్లలను కిడ్నాప్ చేయడమో, ఎత్తుకెళ్లడమో చేశారని ఎన్.సి.ఆర్.బి తెలిపింది.…

16 సంవత్సరాల్లో 2.5 లక్షల రైతుల ఆత్మ హత్యలు

భారత దేశంలో రైతుల ఆత్మ హత్యలు ఒక సార్వజనీన సత్యం. రైతు ఆత్మహత్య చేసుకున్నపుడల్లా వ్యవసాయ ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించి కాకుండా మరేదైనా కారణాలను ప్రభుత్వాలు వల్లె వేయడం కూడా అంతే సార్వజనీనం. వారికి తమ పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త రావడం ఇష్టం ఉండదు. కనుక రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు తీసుకుంటారనుకుంటే పొరబాటే. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు అని నిరాకరించడానికి వారు ముందు ప్రయత్నిస్తారు. కాదు చేసుకున్నారంటే ఏదో వ్యక్తిగత కారణాలవల్ల…

కూడూ, నీడా, చదువూ లేని ఫార్ములా 1 రేసు రోడ్డు నిర్మాతలు

ఢిల్లీకి సమీపంలో భారత దేశ సంపన్నులకు సంతోషం చేకూర్చే ఫార్ములా 1 రేసు మొట్ట మొదటి గ్రాండ్ ప్రిక్స్ పోటీలు ఆదివారం జరగనున్నాయి. భారత దేశ ధనికుల విలాసాలను పట్టి చూపే ఫార్ములా 1 రేసు ఓవైపు ప్రారంభం అవుతున్నప్పటికీ ఆ రేసు కోసం రోడ్డును అందంగా పటిష్టంగా నిర్మించి పెట్టిన కూలీలకు ఇంతవరకూ కూలి డబ్బులు దక్కని దయనీయ పరిష్దితి నెలకొని ఉంది. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధ తాను సాధించిన అభివృద్ధికి మురిపెంగా చూపుకునే సాక్ష్యాలలో…

ముంబై దాడులపై ప్రణబ్ ముఖర్జీ మాటలకు బెంబేలెత్తిన పాకిస్ధాన్ -రైస్ ఆత్మకధ

26/11 దాడులు గా పేరు పొందిన ముంబై టెర్రరిస్టు దాడుల అనంతరం అప్పటి కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ కటువుగా చేసిన వ్యాఖ్యలతో పాకిస్దాన్ బెంబేలు చెందినట్లుగా అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కొండొలిజా రైస్ తన ఆత్మకధలొ పేర్కొంది. “మేము యుద్ధానికి దిగడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నారు” అని ప్రణబ్ ముఖర్జీ ఫోన్ లో మాట్లాడుతూ అనడంతో పాకిస్ధాన్ తీవ్ర స్ధాయిలో అప్రమత్తమయ్యిందని ఆమె పేర్కొన్నది. చైనా నుండి అమెరికా…

‘టచ్ స్క్రీన్’ లేని స్టీవ్ జాబ్స్ ‘ఆటో బయోగ్రఫీ’ -కార్టూన్

స్టీవ్ జాబ్స్ అనగానే యాపిల్ కంపెనీ, ఆ తర్వాత ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్ లు గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా టచ్ స్క్రీన్ గుర్తొస్తుంది. వేళ్లతో తాకి ఎలక్ట్రానిక్ పరికరాలకు ఆదేశాలివ్వడం అన్న నూతర ఒరవడికి స్టీవ్ జాబ్స్ శ్రీకారం చుట్టాడు. ఆయన ఆత్మకధను తిరగేయడానికి కూడా టచ్ స్క్రీన్ కోసం చూడడంలో వింతేమీ లేదు కదా. – ఏమిటీ?! టచ్ స్క్రీన్ లేదా!!! —

మూడో క్వార్టర్‌లో ఫర్వాలేదనిపించిన అమెరికా ఆర్ధిక వృద్ధి

మూడో క్వార్టర్ లో అమెరికా ఆర్ధిక వృద్ధి ఫర్వాలేదనిపించింది. గత రెండు క్వార్టర్లలో మాదిరిగానే అమెరికా జిడిపి వృద్ధి దాదాపు ఆగిపోయినట్లుగానె అందరూ భావిస్తున్న నేపధ్యంలో 2.5 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు కావడంతో మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే సామాన్య జనం ఊపిరిలు ఆగిపోవడం కొనసాగుతోందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికా వాణిజ్య విభాగం గురువారం చేసిన ప్రకటనలో మూడవ క్వార్టర్ (జులై, ఆగష్టు, సెప్టెంబరు) జిడిపి వృద్ధి వివరాలు తెలిపింది. వార్షిక వృద్ధి…

యూరప్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం, ముందుంది మొసళ్ళ పండగ

గురువారం అర్ధరాత్రి దాటాక కూడా జరిగిన తీవ్ర చర్చల అనంతరం యూరోప్ దేశాలు తమ రుణ సంక్షోభం పరిష్కారం దిశలో ఒక ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటించాయి. ప్రస్తుత సంక్షోభం గ్రీసు తన రుణాలు చెల్లించలేకపోవడం చుట్టూ తిరుగుతున్న నేపధ్యంలో గ్రీసు రుణంలో కోతకు అంగీకరించినట్లుగా యూరప్ సమావేశం ప్రకటించింది. బుధవారం నుండి జరుగుతున్న యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశం గ్రీసు రుణ సంక్షోభమే ప్రధాన ఎజెండగా జరిగింది. అనేక తర్జన భర్జనలు, చర్చోప చర్చల అనంతరం ఒప్పందం…

భారత్ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన పాక్ హ్యాకర్లు, ప్రతీకారమే కారణం

పాకిస్ధాన్ కి చెందిన హ్యాకర్లు భారత ప్రభుత్వానికి చెందిన కొన్ని కంపెనీలు, విభాగాల వెబ్ సైట్లను హ్యాకింగ్ చేసారు. భారత హ్యాకర్లు పాకిస్ధాన్ ప్రభుత్వ కంప్యూటర్లను పలుమార్లు హ్యాకింగ్ చేస్తున్నాయనీ, అందుకే తాము భారత ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్ చేస్తున్నామని  వారు ప్రకటించారు. దాదాపు ఎనిమిది ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాకింగ్ కి గురయినట్లుగా తెలుస్తోంది. హ్యాకింగ్ చేసిన వెబ్ సైట్లలో అభ్యంతరకరమైన వార్తలు ప్రచురించారని ‘ది హిందూ’ తెలిపింది. పాకిస్ధాన్ హ్యాకర్ తననుతాను ‘khantastic…

ఇరాక్‌లో అమెరికా దురాక్రమణ యుద్ధం పూర్తయ్యిందట!

ఇరాక్ లో అమెరికా యుద్ధం పూర్తయ్యిందట. అలా అని అమెరికా అధ్యక్షుడు రెండు రోజుల క్రితం ప్రకటించాడు. ఇరాక్ లో అమెరికా పని పూర్తయినందున ఈ సంవత్సరాంతానికి అక్కడనుండి అమెరికా సైన్యాలన్ని వెనక్కి వస్తాయి అని ఆయన ప్రకటించాడు. “అమెరికా సైనికులు తల ఎత్తుకుని, తమ విజయాన్ని చూసి గర్వపడుతూ, సైన్యానికి మద్దతు ఇవ్వడం కోసం అమెరికా ప్రజలంతా సమైక్యంగా నిలబడి ఉన్నారన్న సంగతిని గుర్తెరిగి ఇరాక్ ని వదిలి ఇళ్ళకు చేరుకుంటారు” అని ఒబామా ప్రకటించాడు.…

లిబియా నుండి నాటో సైన్యాలు ఇప్పుడప్పుడే వెళ్ళవు -అమెరికా

షరా మామూలే. సవాలక్ష అబద్ధాలు చెప్పడం, ప్రజస్వామ్యం స్ధాపిస్ధానని బొంకడం, బాంబులతో నాశనం చేయడం, దేశాలలో జొరబడడం, ఆ తర్వాత ఇప్పుడప్పుడే వెళ్ళేది లేదనీ ఆయా దేశాల ప్రభుత్వాలే తమను ఇంకా ఉండమని కోరుతున్నాయని నంగనాచి కబుర్లు చెప్పడం. అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల నేతృత్వంలోని నాటో సైన్యాల సాధారణ కార్యక్రమం ఇది. అదిగో లిబియాలో కూడా తిరుగుబాటు తలెత్తింది అని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు గత ఫిబ్రవరిలో చెప్పాయి. కాని ప్రజలు పాల్గొన్న తిరుగుబాటుపై ఒక్క…

జపాన్ రాయబార కార్యాలయాలపై సైబర్ దాడులు

జపాన్ విదేశీ మంత్రిత్వ శాఖతో పాటు వివిధ దేశాల్లో ఉన్న జపాన్ రాయబార కార్యాలయాలలోని కంప్యూటర్లపై సైబర్ దాడులు జరిగాయని జపాన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ దాడులు జూన్ నెలనుండి జరుగుతున్నాయని తెలిపింది. ఉత్తర అమెరికా, ఆసియా దేశాలలో ఉన్న జపాన్ కార్యాలయాలపైనా ఈ దాడులు జరిగాయని క్యోడో వార్తా సంస్ధ తెలిపింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వాధికారులు ఈ విషయం తెలిపాయని క్యోడో ప్రకటించింది. విదేశాలలో ఉన్న కొన్ని కార్యాలయాల కంప్యూటర్లలోకి వైరస్ ప్రవేశపెట్టారని…