పాక్ ద్వేషులకు దుర్వార్త, భారత్ పాక్‌లు వాణిజ్య బంధం పటిష్టం చేసుకుంటున్నాయి

ఇది మన పొరుగు దేశం పాకిస్ధాన్‌ను అకారణంగా ద్వేషించేవారికి నిజంగా దుర్వార్తే. భారత్, పాకిస్ధాన్ దేశాలు తమ మధ్య వాణిజ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. వాణిజ్య బంధాలను పటిష్టం చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లయితే అటువంటి చర్యలు ఇరు దేశాలు భవిష్యత్తులో మరింత సమీప సంబంధాలను అభివృద్ధి కావడానికి దోహదపడతాయని రెండు దేశాలు భావిస్తున్నాయి. పాకిస్ధాన్ వాణిజ్య మంత్రి ‘మక్దూమ్ అమిన్ ఫాహిమ్’ ప్రస్తుతం ఆరు రోజుల ఇండియా పర్యటనలో ఉన్నాడు.…

తప్పుడు ప్రచారం చేసినందుకు ‘రీబాక్’ బూట్ల కంపెనీపై $25 మిలియన్ వడ్డన

ఇది అమెరికాలో సంగతి. తమ బూట్లు ధరించి వ్యాయామం చేసినట్లయితే ఇతర బూట్లు ధరించినవారి కంటే వేగంగా ఫిట్‌నెస్ సాధిస్తారని ‘రీబాక్’ బూట్ల కంపెనీ ప్రచారం చేసినందుకుగాను అమెరికా ‘ఫెడరల్ ట్రేడ్ కమిషన్’ దానిపైన 25 మిలియన్ డాలర్ల పెనాల్టీని వడ్డించింది. రీబాక్ కంపెనీ, ఫెడరల్ ట్రెడ్ కమిషన్ (ఎఫ్.టి.సి) లు పరస్పర అంగీకారం మేరకు ఈ వడ్డన అమలు చేస్తారు. వినియోగదారులకు చేసే చెల్లింపులకు దీనిని ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఎఫ్.టి.సి, రీబాక్ కంపెనీ ప్రచారంపైన…

పుతిన్ చేతిలో మెడ్వెడెవ్, మెడ్వెడెవ్ చేతిలో పుతిన్ -కార్టూన్

ప్రస్తుత రష్యా అధ్యక్షుడు మెడ్వెడెవ్ తన అనంతరం పుతిన్ రష్యా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నాడని అధికారికంగా ప్రకటించేశాడు. మెడ్వెడెవ్ అధ్యక్షుడు కాక ముందు పుతిన రష్యా అధ్యక్షుడుగా రెండు సార్లు పనిచేశాడు. వరుసగా మూడో సంవత్సరం కూడా అధ్యక్షుడుగా పని చేసే అవకాశం రష్యా రాజ్యాంగం ఇవ్వదు. అందువలన తన కీలు బొమ్మగా అధ్యక్ష స్ధానానికి తన అనుచరుడు మెడ్వెడెవ్ ను అధ్యక్షుడిగా చేసి తాను ప్రధానిగా పుతిన్ పని చేశాడు. ఇప్పుడు మెడ్వెడెవ్ పదవీకాలం…

మూడు సంవత్సరాల్లో అత్యధిక షేర్ నష్టాలను చవిచూసిన రెండో క్వార్టర్

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోని రెండవ క్వార్టర్ (జులై, ఆగస్టు, సెప్టెంబరు 2011) గత మూడు సంవత్సరాలలోనే అత్యధికంగా నష్టాలను చవిచూసిన క్వార్టర్ గా రికార్డయ్యింది. 2008 లో సెప్టెంబర్ లో లేమేన్ బ్రదర్స్ కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటించాక అక్టోబర్, నవంబరు డిసెంబరు నెలలతో కూడిన క్వార్టర్ అత్యధిక స్ధాయిలో సెన్సెక్స్ 25 శాతం నష్టపోయింది. దాని తర్వాత మళ్లీ ఇప్పుడు జులై, ఆగస్టు, సెప్టెంబరు (2011) లతో కూడిన క్వార్టర్ లో సెన్సెక్స్ 12.8 శాతం…

ఇండియా అణుపరిహార చట్టం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదు -అమెరికా

గత సంవత్సరం భారత పార్లమెంటు ఆమోదించిన “అణు ప్రమాద నష్టపరిహార చట్టం” అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని అమెరికా పెదవి విరిచింది. అంతర్జాతీయ ప్రమాణంగా చెబుతున్న “కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కాంపెన్సేషన్” (సి.ఎస్.సి) కు అనుగుణంగా భారత చట్టం లేదనీ, ఈ విషయంలో ఇండియా తన నిర్ణయాలను స్పష్టం చేయడానికి ఐ.ఎ.ఇ.ఎ ను వేదికగా ఎంచుకోవాలని అమెరికా హిత బోధ చేసింది. మూడేళ్ళ క్రితం అమెరికా భారత్ ల మధ్య “పౌర అణు ఒప్పందం” కుదిరింది. ఇందిరాగాంధి…