రిటైల్ రంగాన్ని త్వరలోనే మీకు అప్పజెపుతాం, విదేశీ ప్రవేటు కంపెనీలకు ఇండియా హామీ

కోట్లాది డాలర్ల విలువ గల భారత రిటైల్ రంగాన్ని విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పజెపడానికి భారత ప్రభుత్వం చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నదని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆర్.పి.సింగ్ హామీ ఇచ్చాడు. 450 బిలియన్ డాలర్ల (రు. 20 లక్షల కోట్లు) విలువ గల భారత రిటైల్ రంగం వాల్ మార్ట్ లాంటి ప్రపంచ స్ధాయి కంపెనీలకు అప్పగిస్తామని భారత ప్రభుత్వం చాలా కాలంగా హామీ ఇస్తున్నప్పటికీ దానిని అమలు చేయడం లేదని పశ్చిమ దేశాల ప్రభుత్వాలు,…

అంతా దయానిధి మారన్ వల్లనే -2జి పై ప్రధాని మన్మోహన్

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2జి కుంభకోణంపై నోరు విప్పాడు. తమ బాధ్యత గురించి మాట్లాడకుండా నేరాన్ని టెలికం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ పైకి నెట్టేశాడు. దయానిధి రాసిన ఉత్తరంతోటే తాను 2జి స్పెక్ట్రం విషయాన్ని మంత్రుల బృందం పరిశీలననుండి తప్పించి పూర్తిగా టెలికం శాఖ నిర్ణయానికి అప్పజెప్పానని చెప్పాడు. అమెరికా నుండి ఇండియా వస్తూ విమానంలోనే మన్మోహన్ సింగ్ పత్రికా విలేఖరులకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఇండియాలో విమానం దిగే నాటికి ఇంటర్వ్యూ…

అమెరికా ఇండియావైపు మొగ్గడం సమ్మతం కాదు -పాక్ ప్రధాని

దక్షిణాసియాలో అమెరికా పాకిస్ధాన్‌ను విస్మరించి ఇండియావైపు ముగ్గు చూపడం తమకు సమ్మతం కాదని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నాడు. రాయిటర్స్ సంస్ధకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ప్రచ్ఛన్న యుద్ధం కాలమంతా అమెరికా, పాకిస్ధాన్ లు మిత్రులుగా మెలిగిన సంగతిని గుర్తు చేశాడు. అలాంటిది అమెరికా పాకిస్ధాన్ ను వదిలిపెట్టి ఇండియాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడం అమెరికాకి మేలు చేయగల చర్య కాదని గిలాని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత ఐదు సంవత్సరాలుగా అమెరికా…