కుప్ప కూలిన షేర్లు, బ్లూఛిప్స్‌తో సహా ఒక్క రోజులోనే 2.15 లక్షల కోట్లు నష్టం

గురువారం షేర్ మార్కెట్లు మదుపుదారులకు చుక్కలు చూపించాయి. మూడు సంవత్సరాల క్రితం నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం రోజులను ఒకసారి గుర్తుకు తెచ్చాయి. గత 26 నెలల్లోనే ఎన్నడూ లేనంతగా సెన్సెక్స్ సూచి 704 పాయింట్లు నష్టపోయింది. మొత్తం షేర్ల విలువలో చూసినట్లయితే షేర్లలో ఉన్న మదుపుదారుల సొమ్ము రు.2.15 లక్షల కోట్లు ఒక్కరోజులో అదృశ్యమైంది. చిన్న కంపెనీల షేర్ల కంటే బ్లూచిప్ కంపెనీల షేర్లు ఉన్నవారే అత్యధికంగా నష్టపోవడం విశేషం. లిస్టెడ్ షేర్ల విలువ బుధవారం…

నిలువునా కూలిన భారత షేర్లు, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ప్రభావం

గురువారం భారత్ షేర్ మార్కెట్లు నిలువునా కుప్పకూలాయి. మూడు శాతానికి పైగా నష్టాలను మూటగట్టుకున్నాయి. గత రెండు మూడు రోజులుగా సంపాదించిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆసియా మార్కెట్లనుంది ప్రతికూల సంకేతాలు అందడం, అమెరికా ఆర్ధిక వృద్ధిపై ఫెడరల్ రిజర్వు ప్రతికూల దృశ్యాన్ని ఆవిష్కరించడం తదితర ప్రపంచ స్ధాయి సంకేతాలు భారత షేర్ మార్కెట్లను కూల్చివేశాయి. దాదాపు అన్ని లిస్టెడ్ షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి పెరిగింది. లోహాలు, రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు ఐదు శాతం వరకూ పతనమయ్యాయి.…

2జి స్పెక్ట్రం కుంభకోణంలో పీకలలోతుల్లో చిదంబరం?

కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం మెడ చుట్టూ 2జి స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల కేటాయింపు కుంభకోణం ఉరి బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రికి రాసిన నోట్‌ను బట్టి స్పెక్ట్రం ధరలను అతి తక్కువగా నిర్ణయించడంలో చిందంబరం పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు బలపడుతున్నాయి. ఆర్ధిక మంత్రిత్వ శాఖనుండి ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపిన రహస్య నోట్ పైన ఆధారపడి జనాతా పార్టీ నేత సుబ్రమణ్య స్వామి,…