2జి స్పెక్ట్రం కేటాయింపులపై చిదంబరం ప్రధానికి రాసిన నోట్ ఇదే

2జి స్పెక్ట్రం కేటాయిస్తూ అప్పటి టెలికం మంత్రి ఎ.రాజా 122 లైసెన్సులు జారీ చేయడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ లు జారీ చేసిన ఐదు రోజుల తర్వాత చిదంబరం ప్రధానికి ఈ నోట్ పంపాడు. దానిలో జరిగింది వదిలేద్దామని, ఇక ముందు జాగ్రత్తపడదామనీ చిదంబరం, ప్రధానికి సూచించాడు. వాస్తవానికి అప్పటికి ప్రధాని, ఆర్ధిక మంత్రి తలచుకున్నట్లయితే ఎ.రాజా లైసెన్సులు జారీ చేయకుండా అడ్డుకోగల అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. జనవరి 10 నాటికి లెటర్ ఆఫ్ ఇంటెంట్…

ఎ.రాజా 2జి స్పెక్ట్రం కేటాయింపులు చిదంబరం, మన్మోహన్‌లు తెలిసీ అమోదించారు

2జి స్పెక్ట్రం లైసెన్సులను అతి తక్కువ ధరలకు కేటాయించిన విషయం అప్పటి ఆర్ధిక మంత్రి, ప్రధాని మన్మోహన్ లకు తెలిసే జరిగిందని ఫస్ట్ పోస్ట్ వెల్లడించిన డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. ఆర్.టి.ఐ చట్టం ద్వారా ఫస్ట్ పోస్ట్ వెబ్ మ్యాగజైన్ ప్రధాన మంత్రికి 2జి కేటాయింపులపై చిదంబరం రాసిన నోట్‌ను సంపాదించింది. 122 2జి స్పెక్ట్రం లైసెన్సులను వివాదాస్పద రీతిలో అప్పటి టెలికం మంత్రి ఎ.రాజా కేటాయించిన ఐదురోజుల తర్వాత చిదంబరం ఒక నోట్ ను ప్రధానికి…

కార్పొరేట్ కంపెనీల అధిపతుల నెల జీతాలు కోట్లపైనే

2004-05 లెక్కల ప్రకారం పట్టణాల్లో తలకు రోజుకి రు.20/, గ్రామాల్లో తలకు రు.15/ సంపాదిస్తున్నట్లయితే వారు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లేనని ప్రణాళికా సంఘం కోర్టుకి అఫిడవిట్ సమర్పించడం పట్ల వివిధ వర్గాలు, సంస్ధలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. దారిద్ర్య రేఖను కృత్రిమంగా కిందికి జరిపి దరిద్రుల సంఖ్యను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారనీ, తద్వారా ప్రభుత్వం సబ్సిడీ అందించాల్సిన వారి సంఖ్యను తగ్గించడానికీ, బాధ్యతనుండి తప్పించుకోవడానికీ ప్రయత్నిస్తున్నదని నిపుణులు ఆరోపించారు. ప్రణాళికా సంఘం సభ్యులు కొందరు…

భారత ప్రజల్లో 40 కోట్లమంది దరిద్రులు, అదీ నెలకి వెయ్యి రూ.ల లెక్కన

భారత ప్రణాళికా సంఘం కొన్ని నిజాలను సుప్రీం కోర్టుకి తెలిపింది. భారత ప్రణాళిక సంఘం ఎవరిని దరిద్రులుగా లెక్కిస్తున్నదో కూడా వెల్లడించింది. ప్రణాళిక సంఘం దారిద్ర్య ప్రమాణాలను చూస్తే ముక్కు వేలు వేసుకోవలసిందే. మొత్తం 120 కోట్ల జనాభాలో 40.74 కోట్ల మంది దరిద్రంలో బతుకుతున్నారని ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకి తెలిపింది. ఎవరిని దరిద్రులుగా భావిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చూస్తే, పట్టణాలలో నెలకు రు.965/- (రోజుకి 32/-)కు తక్కువ సంపాదిస్తున్నవారు దరిద్రులు కాగా, గ్రామాల్లో నెలకు…

ఆత్మాహుతి దాడిలో ఆఫ్గన్ మాజీ అధ్యక్షుడు హతం

ఆఫ్ఘనిస్ధాన్ మాజీ అధ్యక్షుడు బర్హనుద్దీన్ రబ్బాని ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వం నియమించిన పీస్ కౌన్సిల్ కు నాయకత్వం వహిస్తున్న రబ్బానీ హత్యతో శాంతి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం ఏర్పడిందని ఆఫ్గన్ అధికారులతో పాటు వార్తా సంస్ధలు, పత్రికలు బాధపడుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్ధాన్, అమెరికా ప్రభుత్వాల అధికారులు చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఆఫ్ఘనిస్ధాన్‌లో శాంతి నెలకొల్పే అవకాశం లేకుండా పోయిందన్నది వారి బాధ. అసలు ఆఫ్ఘనిస్ధాన్‌లో ఎందుకు శాంతి లేకుండా పోయిందో వీరు ఆఫ్ఘనిస్ధాన్ ప్రజలకు…