మీపై దాడులకు మేమెలా బాధ్యులం? అమెరికాకి పాక్ సూటి ప్రశ్న

అమెరికా హెచ్చరికను పాకిస్ధాన్ తిప్పికొట్టింది. హెచ్చరికను స్వీకరించడానికి పాక్ సైనికాధికారులు నిరాకరించారు. మంగళవారం నుండి బుధవారం వరకూ కాబుల్ పట్టణ నడిబొడ్డున అమెరికా ఎంబసీపై తాలిబాన్ మిలిటెంట్లు చేసిన రాకెట్ దాడితో అమెరికా నేతృత్వంలోని నాటో అధికారులు తత్తరపాటుకి గురయ్యారు. ఆఫ్ఘన్ దురాక్రమణ తర్వాత ఇంతవరకూ మిలిటెంట్లు ఎన్నడూ కాబూల్ పై అంతసేపు దాడి చేయలేదని రాయిటర్స్ సంస్ధ పేర్కొంది. పాకిస్ధాన్ భూభాగంలో స్ధావరాలు ఏర్పరుచుకున్న హక్కాని మిలిటెంట్ల గ్రూపు ఈ దాడికి కారణమని అనుమానిస్తున్న అమెరికా…

మా రక్షణ కోసం మేం ఏమైనా చేస్తాం, పాక్‌కు అమెరికా హెచ్చరిక

పాకిస్ధాన్‌కి అమెరికా తాజాగా హెచ్చరిక జారీ చేసింది. తాలిబాన్ మిలిటెంట్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నడిబొడ్డున ఉన్న అమెరికా ఎంబసీ, నాటో కార్యాలయం ఉన్న ప్రాంతంపైన రాకెట్లు, మెషిన్ గన్‌లతో దాడి చేసింది. మంగళవారం మధ్యాహ్నం నుండి బుధవారం ఉదయం వరకు ఇరవై గంటలపాటు సాగిన ఈ దాడిలో పెద్దగా నష్టం ఏమీ జరగనప్పటికీ, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ‘హై సెక్యూరిటీ జోన్’ లోకి రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్, మెషిన్ గన్లతో సహా మిలిటెంట్లు…

తమరు అంతగా సంతోషించడానికేమీ లేదు -మోడితో సంజయ్ భట్

సుప్రీం కోర్టు తీర్పులో నరేంద్రమోడీ సంతోషించడానికేమీ లేదని ఓ బహిరంగ లేఖలో పోలీసు అధికారి సంజీవ్ భట్ తేల్చి చెప్పాడు. పైగా ఆ తీర్పుతోనే మోడిపై విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయని సంజీవ్ భట్ తన లేఖలో పేర్కొన్నాడు. గోద్రా ఘటనపై ముస్లింలపై మారణ కాండ ప్రారంభమైనప్పుడు ‘దాడులు చేస్తున్న హిందువులను అడ్డుకోవద్దని’ చెప్పడానికి మోడి ఏర్పాటు చేసిన సమావేశానికి తాను కూడా హాజరయ్యానని కొద్ది వారాల క్రితం ప్రకటించి సంజీవ్ భట్ సంచలనం సృష్టించాడు. ఆ…