నేరుగా ఆవు పొదుగు నుండే పాలు తాగుతున్న బాలుడు, అయినా క్షేమం

ఇది 18 నెలల కాంబోడియా పసి బాలుడి కధ. ఈ బాలుడు నెల రోజులకు పైగా నేరుగా ఆవు పొదుగుని నోట్లో పెట్టుకుని పాలు తాగుతున్నాడు. అయినా బాలుడు క్షేమంగానే ఉన్నాడని బాలుడి తాత చెబుతున్నాడు. బాలుడి పేరు ధా సోఫత్. బాలుడు గత జులై నుండీ నేరుగా ఆవు పొదుగునుండి పాలు తాగుతున్నాడని వెల్లడించాక ఆ వార్త అంతర్జాతీయంగా పతాక శీర్షికలను ఆక్రమించింది. ఇటీవల సంభవించిన తుఫాను దెబ్బకి బాలుడి తల్లిదండ్రుల ఇల్లు పాడైపోయింది. జీవనానికి…

ఇండియా టెర్రరిస్టులే ఢిల్లీ పేలుళ్ళ బాధ్యులు కావచ్చు -హోం మంత్రి

ఇండియాలో ఉన్న టెర్రరిస్టులే ఢిల్లీ హైకోర్టులో జరిగిన పేలుళ్లకు బాధ్యులు కావచ్చని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం అన్నాడు. ” భారతదేశంలో జరిగే టెర్రరిస్టు దాడులకు ఇప్పుడు కేవలం సరిహద్దుల అవతలినుండే జరుగుతున్నాయని ఆరోపించలేము” అని ఆయన అన్నాడు. వార్తా ఛానెళ్ళకు అందిన ఈ మెయిళ్ళ సమాచారాన్ని నిపుణులు ఇంకా విశ్లేషిస్తున్నారని ఆయన తెలిపాడు. ఢిల్లీ హైకోర్టు పేలుళ్ళలో చనిపోయినవారి సంఖ్య 13కి చేరుకుందని కూడా ఆయన తెలిపాడు. పాకిస్ధాన్ నుండి నడిచే హర్కత్ ఉల్ జిహాదీ…