కొత్త ఆయుధంతో అమెరికాకు దడ పుట్టిస్తున్న తాలిబాన్

ఇటీవలి కాలంలో తాలిబాన్ బలగాలు నాటోకి చెందిన హెలికాప్టర్లను కూల్చివేస్తున్న వార్తలు వరుసగా వెలువడ్డాయి. దానికి కారణం తాలిబాన్ కొత్త ఆయుధాన్ని సమకూర్చుకోవడమేనని తాలిబాన్ వర్గాలను ఉటంకిస్తూ ఏసియా టైమ్స్ పత్రిక తెలిపింది. భూమి మీది నుండి గాలిలోకి ప్రయోగించే మిసైల్ ద్వారా తాము గణనీయమైన సంఖ్యలో హెలికాప్టర్లను కూల్చివేశామని తాలిబాన్ ప్రతినిధి చెప్పాడు. అయితే నాటో, అమెరికా వర్గాలు మాత్రం తమ హెలికాప్టర్లు కూలినప్పుడల్లా సాంకేతిక లోపం వలన కూలిందని చెబుతున్నాయి. తాలిబాన్ ఇంతవరకూ ఒకటీ…

శవాల కుప్పలపై ‘నాటో’ ప్రజాస్వామ్య స్ధాపన -కార్టూన్

నాటో – ‘నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్’, అన్నది మిలట్రీ ఒప్పందం. మిలట్రీ పరంగా ఒకదానికొకటి ముడి వేసుకున్న ఈ కూటమి ప్రజాస్వామ్య స్ధాపన చేస్తానంటూ బయలుదేరడమే ఒక వింత. తన ప్రజాస్వామ్యాన్ని అంగీకరించకపోతే అది జరిపే హత్యాకాండ, ఇతరులకు ఒక గుణపాఠంగా నిలుస్తుంది. – కార్టూనిస్టులు: క్రిటికల్ పాయింట్ (కార్టూనిస్టుల గ్రూపు)

“సెప్టెంబరు 11” కి పదేళ్ళు -కార్టూన్

న్యూయార్క్, అమెరికా, నగరంలోని ప్రపంచ వాణిజ్య సంస్ధకు చెందిన జంట టవర్లపై టెర్రరిస్టు దాడులు జరిగి నేటితో (సెప్టెంబరు 10) పదేళ్ళు నిండాయి. దాడుల్లో మూడువేలకు పైగా చనిపోయారని అమెరికా తెలిపింది. టెర్రరిస్టు దాడుల్లో చనిపోయిన అమెరికన్లకు పూర్తిగా సానుభూతి, సహకారం అందించే లోపే, అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్, అదే దుర్ఘటనను అడ్డు పెట్టుకుని దురాక్రమణ యుద్ధాలకి తెర లేపాడు. రుజువుకాని నేరాన్ని మోపి, రుజువు కానవసరం లేదన్నట్లుగా, ఘటనతో సంబంధం లేని రెండు దేశాలు,…

అమెరికా, యూరప్ సంక్షోభాలకు పరిష్కారం చూపని జి7 సమావేశాలు

శుక్రవారం జరిగిన జి7 సమావేశాలు చప్పగా ముగిశాయి. ప్రపంచ ఆర్ధికవ్యవస్ధ మరొక మాంద్యం ముంగిట నిలబడి ఉన్నప్పటికీ ఇతమిద్ధమైన పరిష్కారారాన్నేదీ చూపలేకపోయింది. అందరం కలిసి ఉమ్మడి సహకారంతో సంక్షోభానికి స్పందించాలన్న మొక్కుబడి ప్రకటన తప్ప సమావేశాలు ఏమీ సాధించలేకపోయాయి. పైగా యూరప్ రుణ సంక్షోభంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి నిరాశపరిచాయి. యూరప్ రుణ సంక్షోభం పరిష్కారానికి యూరోప్ కి చెందిన శక్తివంతమైన దేశాలు యూరోజోన్ లోని బలహీన దేశాలకు ద్రవ్య మద్దతు ఇవ్వాలని అమెరికా నొక్కి చెప్పగా,…

ఇజ్రాయెల్ ఎంబసీపై ఈజిప్షియన్ల దాడి, దేశం విడిచిపోయిన రాయబారి

ఈజిప్టు ప్రజలు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను తామే, తాత్కాలికంగానే అయినా, తెంచేశారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై పెద్ద సంఖ్యలో దాడి చేసిన ఈజిప్టు ప్రజలు ఇజ్రాయెల్ జెండాను కూలగొట్టి, రాయబార కార్యాలయంలోపలికి జొరబడ్డారు. లోపల ఉన్న ఫర్నిచర్, రికార్డులు అన్నింటినీ ధ్వంసం చేశారు. దానితో ఇజ్రాయెల్ రాయబారి ఈజిప్టు విడిచి కుటుంబంతో సహా స్వదేశం వెళ్ళిపోయాడు. గత నెలలో ఈజిప్టు సరిహద్దు భద్రతా దళాల పోలీసులను ఇజ్రాయెల్ సైనికులు చంపినందుకు ప్రతీకారంగా, ఇజ్రాయెల్‌నుండి తమ రాయబారిని ఉపసంహరించుకుంటానని…