Q1 జిడిపి వృద్ధిలో చైనా, ఇండియాలను కిందికి తోసిన టర్కీ, అర్జెంటీనా

2011 క్యాలెండర్ సంవత్సరంలో మొదటి క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో చైనా, ఇండియాలు జిడిపి వృద్ధికి సంబంధించి తమ స్ధానాలను కోల్పోయాయి. వాటి స్ధానాలను టర్కీ, అర్జెంటీనాలు ఆక్రమించాయి. ఇప్పటివరకూ చైనా, ఇండియాలో జిడిపి వృద్ధి రేటులో ప్రపంచంలో మొదటి రెండు స్ధానాల్లో కొనసాగుతున్నాయి. ఆర్ధిక సంక్షోభం తర్వాత ఇంతవరకూ అవి తమ స్ధానాలను కాపాడుకుంటూ వచ్చాయి. మొదటి క్వార్టర్ జిడిపి వృద్ధి రేటులో మొదటి ఐదు స్ధానాల్లో ఉన్న దేశాలను కింది పట్టికలో చూడవచ్చు.…

లిబియా ‘ఆయిల్ కేక్’ పంపకాలకు పశ్చిమ రాజ్యాలు సిద్ధం -కార్టూన్

లిబియా ఆయిల్ వనరుల్ని పంచుకోవడానికి పశ్చిమ రాజ్యాల ఆయిల్ కంపెనీలు ఇప్పుడు లిబియాలో చర్చల్లో మునిగితేలుతున్నాయి. తిరుగుబాటు ప్రారంభమైందని ప్రపంచానికి పూర్తిగా తెలియక ముందే తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించిన ఫ్రాన్సుకు పెద్ద భాగం లభించింది. 34 శాతం ఆయిల్, గ్యాస్ వనరుల్ని ఫ్రెంచి కంపెనీ టోటల్ కి అప్పగిస్తున్నట్లుగా లిబియా నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ ప్రకటించింది. ఇంకా అమెరికా (ఎక్సాన్ మొబిల్), ఇటలీ (ఇ.ఎన్.ఐ), రష్యా (గాజ్‌ప్రోమ్), బ్రిటన్ (బిపి), హాలండ్ (రాయల్ డచ్ షెల్), స్పెయిన్…

టర్కీ దేశస్ధుల హత్య – ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ కోర్టుకి వెళ్ళనున్న టర్కీ

గాజా ప్రజలకోసం అంతర్జాతీయ సహాయం తీసుకెళ్తున్న ఓడలపైన ఇజ్రాయెల్ రక్షణ బలగాలు దాడి చేసి తొమ్మింది మంది టర్కీ దేశస్ధులను చంపివేశాక టర్కీ ప్రభుత్వం ఇజ్రాయెల్ దేశంపై కారాలు మిరియాలు నూరుతోంది. పాలస్తీనీయులకు చెందిన గాజా ప్రాంతాన్ని సైన్యంతో చుట్టుముట్టి ఎటువంటి సరుకులూ అందకుండా కాపలా కాస్తుండడంపై ‘అంతర్జాతీయ న్యాయ స్ధానం’ ను ఆశ్రయించాలని టర్కీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ సహాయాన్ని పట్టుకెళ్తున్న ఓడల వరుసపైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) బలగాలు, అంతర్జాతీయ జలాల్లో ఉండగానే…

‘టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం’ కోసం గడ్డాఫీతో అమెరికా, బ్రిటన్‌ల గూఢచారి సంబంధాలు

“టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం” పేరుతో అమెరికా ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లపై దురాక్రమణ దాడి చేసింది. లక్షల మందిని పొట్టన బెట్టుకుంది. ఇంకా అక్కడ సైన్యాన్ని కొనసాగిస్తూ రోజూ నరమేధం కొనసాగిస్తూనే ఉంది. ఓ వైపు ఆల్‌ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకోవడానికి ఆఫ్ఘనిస్ధాన్ లో నరమేధం సాగిస్తూనే మరోవైపు లిబియాలో అదే ఆల్‌ఖైదాతో జట్టుకట్టి ఆ దేశ అధ్యక్షుడు గడ్డాఫీను కూలదోసి తన తొత్తు ప్రభుత్వాన్ని కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. మిగతా ప్రపంచం అంతా ఆల్‌ఖైదా,…

‘వికీలీక్స్’లో తెలంగాణ, అమెరికా రాయబారితో స్పీకర్ భేటి

తెలంగాణ ఉద్యమంపై, అసెంబ్లీ మాజీ డిప్యుటి స్పీకర్, ప్రస్తుత స్పీకర్ నాదెండ్ల మనోహర్ అమెరికా రాయబారితో అభిప్రాయాలు పంచుకున్న సంగతి వికీలీక్స్ బైటపెట్టింది. భారత దేశంలోని అమెరికా రాయబారి అమెరికా ప్రభుత్వానికి రాసిన కేబుల్ ఉత్తరంలో తెలంగాణ ఉద్యమం గురించి విశ్లేషణ రాశాడు. ఈ విశ్లేషణ లోని అంశాలు ఇప్పటికే తెలంగాణ అంశంపై జరుగుతున్న చర్చలలో నానుతున్నవే అయినప్పటికీ, స్పీకర్ ద్వారా అమెరికా రాయబారికి చేరడమే, తెలంగాణ వాదుల్లో వ్యతిరేకతను రగిలిస్తోంది. నాదెండ్ల వెలిబుచ్చిన అభిప్రాయాల్లో కొన్ని…