ఆదివారం తన నిరవధిక నిరాహార దీక్షను ముగించనున్న అన్నా హజారే

అన్నా అభిమానులకు శుభవార్త. ప్రభుత్వం అన్నా ప్రతిపాదించిన మూడు డిమాండ్లను పార్లమెంటులో ఓటింగ్ కి పెట్టడానికి అంగీకరిస్తున్నట్లు పౌర సమాజ ప్రతినిధులకు ప్రణబ్ ముఖర్జీ లేఖ రాయడంతో అన్నా బృందంలో ఆనందం వెల్లివిరిసింది. శనివారం ఈ మేరకు తమకు లేఖ అందినట్లుగా అన్నా బృందం విలేఖరులకి తెలిపింది. లోక్ పాల్ బిల్లుపై తమ డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ఓటింగ్ కి ప్రవేశపెడుతున్నట్లు గా ప్రభుత్వం నుండి తమకు సమాచారం అందిందని టీమ్ అన్నా తెలిపింది. ఈ పరిణామం…

తిరుగుబాటు ముందువరకూ గడ్డాఫీ అమెరికాకి మిత్రుడే -వికీలీక్స్

ప్రస్తుతం లిబియా రాజధాని ట్రిపోలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సుల సైన్యాలతూ కూడిన నాటో దళాలు మౌమ్మర్ గడ్డాఫీ కోసం వేటాడుతున్నాయి. గడ్డాఫీ నమ్మకస్తులనుకున్నవారి ఇళ్లపై బడి గడ్డాఫీకోసం వెతుకులాట పేరుతో దారుణ విధ్వంసం సృష్టిస్తున్నాయి. ‘వేటాడి చంపవలసినవాడు’ గా అమెరికా ప్రకటించిన కల్నల మౌమ్మర్ గడ్డాఫీ నిజానికి తిరుగుబాటు పేరుతో అంతర్యుద్ధం ప్రారంభమయ్యే వరకూ అమెరికా కు అనుంగు మిత్రుడే. ఆ మేరకు రిపబ్లికన్ సెనేటర్లతో పాటు, బుష్ అధికార బృందంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా…

నేను అన్నాను కాలేను -అరుంధతీ రాయ్ (అనువాద వ్యాసం) -2

‘ప్రజలు’ అంటే జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించకుంటే చివరికంటా నిరాహార దీక్ష చేసి చనిపోతానని ఒక 74 ఏళ్ళ వ్యక్తి కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న దృశ్యాన్ని వీక్షించడానికి జమ కూడినవారు మాత్రమే. ఆకలిగొన్నవారికోసం చేపలు, రొట్టెలను యేసు క్రీస్తు అనేక రెట్లు పెంచిన పద్ధతిలో, టి.వి ఛానెళ్ళు తమ అద్భుత మాయాజాలంతో మిలియన్లకు పెంచగలిగన పదుల వేల మంది మాత్రమే ప్రజలు. “ఒక బిలియన్ మంది (వంద కోట్లు) ఒకే గొంతుకతో ‘ఇండియాయే…