అన్నా దీక్ష చేసుకోదలిస్తే చేసుకోనివ్వండి, అది మా సమస్య కాదు -ప్రణబ్, ఖుర్షీద్

ఓ వైపు ప్రధాని మన్మోహన్ అన్నా హజారే ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీవ్రంగా కలవరపడుతున్నదని చెబుతుండగా మరో వైపు ప్రధాని సహచరులు అన్నా దీక్ష తమ సమస్య కాదు పొమ్మంటున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకూ ఒప్పందం కుదురుతుందన్న వార్తాలు షికార్లు చేయగా సాయంత్రం జరిగిన సమావేశంలో చర్చలు వాడిగా జరిగినట్లుగా పౌరసమాజ కార్యకర్తలు చెబుతున్నదాన్ని బట్టి అర్ధం అవుతోంది. ప్రభుత్వానికీ అన్నా బృందానికి మధ్య జరుగుతున్న చర్చలు మళ్ళీ మొదటికే వచ్చిన పరిస్ధితి కనపడుతోంది. మంత్రులు ప్రణబ్…

జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

జగన్‌కీ ఆయనపై ఆశలు పెట్టుకున్న 29 మంది ఎం.ఎల్.ఎ లకు దింపుడు కళ్ళెం ఆశలు కూడా ఆవిరయినట్లు కనిపిస్తోంది. జగన్ అక్రమ ఆస్తులపై పూర్తి విచారణ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ అక్కడ కూడా దెబ్బ తిన్నాడు. ప్రాధమిక ఆధారాలున్నందునే హైకోర్టు పూర్తి విచారణకు ఆదేశించినందున ఈ స్ధితిలో తాము జోక్యం చేసుకోజాలమని సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది.”హైకోర్టు ఆదేశాలలో జోక్యం…

జన్ (రాజీవ్) లోక్ పాల్ బిల్లు -కార్టూన్

‘శంఖంలో పోస్తే కాని తీర్ధం కాద’ని సామెత! అది తెలుసుకున్నాడు కనకనే దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రతి పధకానికి ముందు రాజీవ్ అనో, ఇందిరా అనో తగిలించాడు. సోనియా, రాహుల్ లవరకూ అది సాగేదేమో, ఇంతలో ఆయన పరమపదించారు. ఆయన పుత్రుడికి నడమంత్రపు సిరితో కన్నూ మిన్నూ కానక భజన మానుకున్నాడు. ఫలితం చూస్తూనే ఉన్నాం. అవినీతి భరతం పట్టడానికి జన్ లోక్ పాల్ బిల్లుని తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టాడు, అన్నా హజారే. అది…

ప్రజలూ అవినీతిపరులేనట! -కార్టూన్

అవినీతిని రూపుమాపాలని ప్రజలు కోరుతుంటే అతితెలివిపరులు లంచం ఇవ్వడం మానేస్తే అవినీతి అదే తగ్గుతుందని బుద్ధుడి లెవల్లో బోధిస్తారు. తెలుగు ఛానెళ్లలో ఒక ప్రకటన వస్తోంది. “అవినీతి నిర్మూలన మననుండే ప్రారంభిద్దాం” అని. అందులో లంచం ఇస్తుండబట్టే, తీసుకునే వాళ్ళున్నారని చూపిస్తున్నారు. ఆర్.టి.ఒ ఆఫీసుకి గానీ, రిజిస్ట్రార్ ఆఫీసుకి గానీ లేదా ట్రెజరీ ఆఫీసుకి గానీ పనికి వెళ్ళి నేను లంచం ఇవ్వను అంటే పనవుతుందా? నానుండే అవినీతి నిర్మూలన ప్రారంభించాలి అని శపధం చేసి లంచం…

జపాన్ క్రెడిట్ రేటింగ్ తగ్గించిన మూడీస్, రాజకీయ అనిశ్చితే కారణం

క్రెడిట్ రేటింగ్ సంస్ధలు ఆర్ధిక పరిణామాలను అధారం చేసుకుని మాత్రమే రేటింగ్ ఇవ్వవలసి ఉండగా, రాజకీయ పరిస్ధితుల ఆధారంగా కూడా క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం ప్రారంభించినట్లుంది. ఎడతెగని రాజకీయ సంక్షోభం రీత్యా జపాన్ క్రెడిట్ రేటింగ్ ను ఒక మెట్టు తగ్గించింది. జపాన్ లో గత ఐదు సంవత్సరాలలో ఐదుగురు ప్రధానులు పని చేశారు. ఇప్పటి ప్రధాని కూడా ఆగస్టు నెలాఖరుకు పదవు నుండి తప్పుకోబోతున్నాడు. భూకంపం, సునామీలకు సమర్ధవంతంగా, వేగంగా స్పందించడంలో విఫలమైనాడని అందరూ భావిస్తుండడంతో…

లిబియాలో గడ్డాఫీ ఉన్నాడా, పోయాడా? -కార్టూన్

నాటో బాంబుదాడులు తోడు రాగా లిబియా తిరుగుబాటుదారులు రాజధాని ట్రిపోలిలో ప్రవేశించారు. ట్రిపోలీ ప్రజలు ఆనందోత్సాహాలతో వారికి స్వాగతాలు పలికారని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు బాకాలుదాయి. తిరుగుబాటుదారుల నాయకత్వ కమిటీ ‘ట్రాన్సిషనల్ నేషనల్ కౌన్సిల్’ గడ్డాఫీ ఇద్దరు కొడుకులనూ అరెస్టు చేశామని ప్రకటించింది. వారాల ప్రకటించిన గంటలలోపే గడ్డాఫీ కుమారుడు, ఎలైట్ ఫోర్స్ నాయకుడు సైఫ్ ఇస్లాం తిరిగి ట్రిపోలిలోనే ప్రత్యక్షమయ్యాడు, మద్దతుదారులకు విక్టరీ సిగ్నల్ చూపుతూ. ఇదేలా సాధ్యం? అరెస్టయినవాడు నవ్వుతూ, చేతులూపుతూ ఎలా ప్రత్యక్షమైనట్లు?…