కమ్యూనిస్టు విప్లవకారుల అవగాహనకు దగ్గరలో అన్నా హజారే ప్రసంగాలు

పౌర సమాజ నాయకుడుగా ఆవిర్భవించిన గాంధేయవాది అన్నా హజారే శక్తివంతమైన లోక్‌పాల్ బిల్లుకోసం అయిదు రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తుండడమే కాక మధ్య మధ్యలో ప్రసంగాలు కూడా చేస్తున్నాడు. నిరాహార దీక్ష ప్రారంభం అయినప్పటినుండీ అన్నా చేస్తున్న ప్రసంగాలు కమ్యూనిస్టు విప్లవకారులుగా ఉన్న పార్టీల అవగాహనకు సమీపంలో ఉన్న సంగతి గమనార్హం. సి.పి.ఐ (ఎం.ఎల్ – మావోయిస్టు), సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూడెమొక్రసీ), సి.పి.ఐ (ఎం.ఎల్ – జనశక్తి) తదితర పార్టీలు భారత దేశంలో విప్లవ…

ఫేస్‌బుక్, ట్విట్టర్… లండన్‌లో మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ళు -కార్టూన్

లండన్ పోలీసుల దృష్టిలో ఫేస్ బుక్, ట్విట్టర్ లు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ళు. బ్రిటన్‌లో ప్రజాస్వామ్యం ఉంది అని ప్రపంచం భావిస్తోంది కనుక ఆగారు కానీ ఈ పాటికి ఈ ఇద్దరు నేరగాళ్ళని లండన్ పోలీసులు పబ్లిక్ లో కనపడకుండా చేసేవారే. జోర్డాన్ బ్లాక్‌షా (20 సం.లు), సట్‌క్లిఫ్ కీనన్ (22 సం.లు) అనే ఇద్దరు యువకులకి లండన్ మెజిస్ట్రేట్ కోర్టు నాలుగు సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సందేశాలు…

ఇండియా, బెలారస్ ల ఎరువుల ఒప్పందానికి మోకాలడ్డిన అమెరికా?

ఇండియా, బెలారస్ ల మధ్య పొటాష్ ఎరువులకు సంబంధించి కుదిరిన ఒప్పందానికి అమెరికా మోకాలడ్డినట్లు అనుమానాలు తలెత్తాయి. కేబినెట్ నిర్ణయాలను అమెరికాకి చేరవేయడానికి భారత ప్రభుత్వ కేబినెట్ లో అమెరికా ఏజెంటు ఉన్న అనుమానాలు కూడా వాటికి జత కలిశాయి. పాత సోవియట్ రాజ్యం బెలారస్‌లోని పొటాషియం గనులను కొనాలనీ, అలాగే విదేశాలలో ఎరువుల గనులను ప్రాధామ్యం ప్రాతిపదికన సొంతం చేసుకోవాలని కేంద్ర కేబినెట్ సూత్ర ప్రాయంగా ఒక ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన రోజునే బెలారస్ పై…

ఈజిప్టు పోలీసులను చంపిన ఇజ్రాయెల్, రాయబారిని ఉపసంహరించుకుంటున్న ఈజిప్టు

ప్రజాస్వామిక హక్కుల కోసం జరిగిన ప్రజా ఉద్యమం అనంతరం నియంత ముబారక్ గద్దె దిగాక ఈజిప్టు, ఇజ్రాయెల్ ల మధ్య సంబంధాలు కొంతవరకు దెబ్బతిన్నాయి. మిలిటెంట్లకోసం వెతుకుతూ ఈజిప్టు భూభాగంలోనికి వచ్చిన ఇజ్రాయెల్ సైనికులు మిలిటెంట్లన్న నెపంతో ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపడం ఈజిప్టు ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకుని ఇజ్రాయెల్ రాయబారిని దేశం నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈజిప్టు ప్రజలు ఆందోళన నిర్వహించడంతో తమ రాయబారిని ఇజ్రాయెల్ నుండి విరమించుకోబోతున్నట్లుగా…

రాజకీయ పార్టీల నిధుల సేకరణను దెబ్బతీసిన అమెరికా రుణ సంక్షోభం -కార్టూన్

అమెరికా రుణ సంక్షొభం ప్రభావం అన్ని రంగాల మీదా పడుతోంది. 2012లో జరగనున్న ఎన్నికల కోసం నిధుల సేకరణకు అమెరికా రాజకీయ పార్టీలు ఇప్పటినుండే నిధులు సేకరిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ, ప్రభుత్వ ఖర్చు ఎక్కువయ్యిందని చెబుతూ ప్రజలపైన కఠినమైన పొదుపు విధానాలను రుద్దుతోంది. అధికారంలో ఉన్న డెమొక్రటిక్ పార్టీకి నిధుల లభ్యత విషయంలో సమస్యలు ఎదుర్కోక పోవచ్చు. కానీ రిపబ్లికన్ పార్టీకి ఆ సమస్యలు తప్పవు. నిధుల సేకరణ విషయంలో వారికి సమస్యలు ఎదురవ్వుతాయని చెబుతూ, ఈ…

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ముగిసింది -పాలస్తీనా సంస్ధ హమాస్

పాలస్తీనా మిలిటెంట్ సంస్ధ “హమాస్,” శనివారం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పాలస్తీనాను అక్రమించిన ఇజ్రాయెల్ తో తనంత తానుగా ప్రకటించిన కాల్పుల విరమణ ముగిసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో మధ్య ప్రాచ్యం ప్రాంతంలో ఉద్రిక్తలు మరోమారు ఉచ్ఛ స్ధాయికి చేరనున్నాయి. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, కారణం లేకుండా తమ ఆధీనంలో ఉన్న గాజాపై దాడులు చేస్తూ ప్రజలను చంపుతున్నందున తాము పాటిస్తున్న “కాల్పుల విరమణకు” ఇక అర్ధం లేదని హమాస్ సంస్ధ ప్రకటించింది. గత రెండు…