తిరుగుబాటులో చీలిక! లిబియా దాడిలో పట్టు కోల్పోతున్న నాటో?

లిబియాలో తిరుగుబాటుగా చెబుతున్న యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్సు, అమెరికాలు వైమానిక దాడులతో మద్దతు, సహకారం ఇస్తున్నప్పటికీ లిబియా తిరుగుబాటుదారులు ముందంజ వేయడంలో విఫలమవుతుండం పశ్చిమ రాజ్యాలను నిరాశకు గురి చేస్తోంది. తిరుగుబాటు ప్రారంభం అయిన ప్రారంభ దినాల్లొనే లిబియా తిరుగుబాటుదారుల పక్షం చేరిపోయిన మిలటరీ కమాండర్ జనరల్ అబ్దెల్ ఫత్తా యోనెస్ హత్యతో లిబియా తిరుగుబాటుదారుల్లో ఉన్న విభేదాలు లోకానికి వెల్లడయ్యాయి. ఫ్రంట్ లైన్ యుద్ధంలో పాల్గొంటున్న కమాండర్ ను వెనక్కి పిలిపించి మరీ హత్య చేయడతో…

కొనసా……..గుతున్న షేర్ల పతనం

ఈ వారం మూడవ రోజు కూడా బారత షేర్లు పతన బాటలో కొనసాగాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు ప్రధాన షేర్ల సూచీలు దాదాపు ఒక శాతం నష్టాలు చవిచూశాయి. అమెరికా రుణ పరిమితి పెంపు పైనా, బడ్జెట్ లోటు తగ్గింపు పైనా అక్కడి చట్ట సభలు, వైట్ హౌస్ లు ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ మార్కెట్లు లేదా మదుపుదారులు సంతృప్తి చెందలేదు. రుణ పరిమితి పెంపు, బడ్జెట్ లోటు తగ్గింపు లకు సంబంధించిన చర్చలు సుదీర్ఘ కాలంపాటు…

ప్రపంచంలో అతి పొడవైన పది వంతెనలు -ఫోటోలు

సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకీ అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు అసాధ్యం అనుకున్నవి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మనిషి సుసాధ్యం చేసుకుంటున్నాడు. అత్యంత సూక్ష్మ పరికరాలనుండి అతి పెద్ద ఆకాశ హర్మ్యాల వరకూ మనిషి తన జీవన సౌకర్యాల కోసం అభివృద్ధి చేసుకున్నాడు. పెద్ద పెద్ద డ్యాం లు కట్టి నీటిని నియంత్రణలోకి తెచ్చుకున్న మనిషి తనకు అవసరమైన చోటికి నీటిని తీసుకెళ్ళగలగడం వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను తెచ్చి పెట్టింది. యేసు క్రీస్తు నీటి మీద నడవడం నిజమో…

అదే సచిన్ అయితే పెద్ద గొడవై ఉండేది -ఇంగ్లండ్ క్రికెట్ కోచ్

ఇంగ్లండు క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న మాజీ  జింబాబ్వే ఆటగాడు ఆండి ఫ్లవర్, సచిన్‌ టెండూల్కర్‌ను ఒకసారి తలచుకున్నాడు. రెండవ టెస్టు మ్యూచ్ జరుగుతున్న సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బెల్ రనౌట్‌ను తిరిగి పరిశీలించాలని భారత్ జట్టు డ్రెస్సింగ్ రూంకి వెళ్ళి కోరడాన్ని ఆయన సమర్ధించుకుంటూ తన నిర్ణయంలో సచిన్‌ని ప్రతిక్షేపించుకున్నాడు. “ఇయాన్ బెల్ లాగే సచిన్ అవుటై ఉన్నట్లయితే క్రికెట్ ప్రపంచం అంతా గగ్గోలు పెట్టి ఉండేది” అని చెబుతూ తమ చర్యను సమర్ధించుకున్నాడు.…

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా యెడ్యూరప్ప మద్దతుదారు “సదానంద గౌడ” ఎన్నిక

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మొత్తం మీద తన పంతం కొంతమేరకు నెగ్గించుకున్నాడు. నూతన ముఖ్యమంత్రిగా, యెడ్యూరప్ప వర్గీయుడైన “సదానంద గౌడ” ఎన్నికయ్యాడు. కర్ణాటక లెజిస్లేచర్ పార్టీ నూతన నాయకుడిని ఎన్నుకోవడానికి బుధవారం సమావేశమైంది. ముఖ్యమంత్రి పదవి కోసం యెడ్యూరప్ప, బి.జె.పి అధిష్టానంలు చెరొక అభ్యర్ధిని నిలబెట్టినట్లుగా వార్తా ఛానెళ్ళు చెప్పాయి. రహస్య ఓటిం కూడా జరిగిందని అవి తెలిపాయి. చివరికి సదానంద గౌడను నూతన ముఖ్యమంత్రిగా బి.జె.పి శాసన సభా పక్షం ఎన్నుకుందని ప్రకటన వెలువడింది.…

యెడ్యూరప్ప అవినీతి విచారణకు కర్ణాటక గవర్నర్ అనుమతి మంజూరు

మరి కొద్ది గంటల్లో మాజీ ముఖ్యమంత్రిగా మారనున్న యెడ్యూరప్పపై మరొక దెబ్బ పడింది. ఆయనపై లోకాయుక్త కనుగొన్న అవినీతి ఆరోపణలను విచారించడానికి కర్ణాటక గవర్నర్ ‘హంసరాజ్ భరద్వాజ్’ లోకాయుక్త పోలీసులకు అనుమతి మంజూరు చేశాడు. అక్రమ మైనింగ్ జరిపిన కంపెనీలతో కుమ్మక్కయ్యాడని లోకాయుక్త చేసిన ఆరోపణలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి గవర్నర్ అనుమతి ఇచ్చేశాడు. దీనితో యెడ్యూరప్పకు కష్టాలు మరిన్ని పెరిగాయి. కాంగ్రెస్, బి.జె.పి పార్టీల మధ్య జరుగుతున్న ఈ నాటకటకం ఎంతవరకూ దారి తీస్తుందో చూడవలసి…

సైబర్ చరిత్రలోనే అతి పెద్ద హ్యాకింగ్ దాడులు, చైనాపై అనుమానాలు

ఇంటర్నెట్ సెక్యూరిటీ నిపుణులు, ఇంటర్నెట్ చరిత్రలో మున్నెన్నడూ ఎరగనంత పెద్ద స్ధాయిలో సైబర్ దాడులు జరిగినట్లు గుర్తించారు. ఈ హ్యాకింగ్ దాడులను గుర్తించిన మెకేఫీ (McAfee)సంస్ధ ఈ దాడుల వెనుక ఒక దేశ ప్రభుత్వం ఉందని చెబుతూ, ఆ దేశం పేరు చెప్పడానికి నిరాకరించింది. ఐక్యరాజ్యసమితి, ప్రభుత్వాలు, కంపెనీలతో సహా 72 సంస్ధల నెట్ వర్క్‌లు సైబర్ దాడులకు గురయినట్లు గుర్తించారు. హ్యాకింగ్‌కి పాల్పడింది ఎవరో చెప్పడానికి మేకేఫీ నిరాకరించినప్పటికీ, ఈ వార్తను పత్రికలకు తెలిపిన సెక్యూరిటీ…