భారత పర్యటనలో పాక్ యువ విదేశాంగ మంత్రి హైనా రబ్బాని -ఫోటోలు

ముంబై టెర్రరిస్టు దాడుల వలన ఇండియా, పాకిస్ధాన్ ల మధ్య మూడేళ్ళ క్రితం నిలిచిపోయిన శాంతి చర్చలు గత కొద్ది నెలలుగా కొంత కదలికలోకి వచ్చాయి. కొద్ది వారాల క్రితం భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు పాకిస్ధాన్ పర్యటించి ఇరు దేశాల విదేశాంగ మంత్రుల చర్చలకు ప్రాతిపదిక తయారు చేసి వచ్చారు. ఆ తర్వాత నిరుపమా రావు నుండి పాక్ ప్రభుత్వం స్ఫూర్తి పొందిందో ఏమో తెలియదు గాని యువ రాజకీయ నాయకురాలు ‘హైనా రబ్బాని…

సొంత ‘లోక్‌పాల్ డ్రాఫ్టు’ ను ఆమోదించిన కేంద్ర కేబినెట్, తిరస్కరించిన అన్నా హజారే బృందం

కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు తయారు చేసిన లోక్ పాల్ డ్రాఫ్టును కేంద్ర ప్రభుత్వ కేబినెట్ గురువారం ఆమోదించింది. అన్నా హజారే నేతృత్వంలో పౌర సమాజ నాయకులు ఉద్యమం చేపట్టిన తర్వాత వారి డిమాండ్ మేరకు లోక్ పాల్ చట్టాని తెస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేసిన కేంద్ర ప్రభుత్వం మూడు నెలల అనంతరం లోక్ పాల్ చట్టం తెచ్చే వైపుగా మొదటి అడుగు వేసింది. అన్నా హజారే బృందం తయారు చేసిన జన్‌లోక్ పాల్ బిల్లులో సూచించిన…

వెంటనే రాజీనామా చేయండి -యెడ్యూరప్పకు బి.జె.పి ఆదేశం

అక్రమ మైనింగ్‌ను అనుమతించి ముడుపులు అంగీకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ఎట్టకేలకు రాజీనామా చేయనున్నాడు. అధికారం చేపట్టినప్పటినుండి నిరంతరం గండాలతో నెట్టుకుంటూ వచ్చిన బి.ఎస్.యెడ్యూరప్ప ముఖ్యమంత్రిత్వం ముగింపుకు వచ్చింది. సి.ఎం నేరుగా అక్రమ మైనింగ్ కుంభకోణంలో భాగం పంచుకున్నాడని లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె నివేదిక స్పష్టం చేయడంతో బి.జె.పి నాయకత్వం యెడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని గురువారం ఆదేశించింది. లోకాయుక్త నివేదిక దృష్ట్యా కర్ణాటకలో నాయకత్వాన్ని మార్చాలని నిర్ణయించి ఆ మేరకు ఆదేశాలు జారీ…

లగడపాటి తెలంగాణని వ్యతిరేకిస్తున్నది ఆస్తుల కోసం కాదట!

తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు, ‘సీమాంధ్రులు కూడా’ కూడా కాదు, దేశ ప్రజలంతా తెలుసుకోవలసిన విలువైన విషయం బెజవాడ ఎం.పి, లాంకో యజమాని, లగడపాటి రాజగోపాల్ గారు బుధవారం తెలియజేశారు. “ఆస్తులు కాపాడుకోవడానికే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. అది కరెక్టు కాదు. నేను తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ని వ్యతిరేకిస్తున్నది నా ఆస్తులను కాపాడుకోవడానికి కాదు. దేశ సమగ్రతను కాపాడడం కోసం” అని సగర్వంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పని చేస్తున్న జవాన్ స్ధాయిలో…

మరొకసారి వెల్లడైన కావూరి సాంబశివరావు దురహంకారం

కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 9, 2009 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు ఏలూరు ఎం.పి. కావూరు సాంబశివరావు గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసో లేదో కానీ ఆ తర్వాత ఆయన చేస్తూ వచ్చిన దురహంకార పూరిత వ్యాఖ్యలు ఆయన ప్రతిష్ట ఎంత నేలబారుదో వెల్లడి చేశాయి. కొద్ది నెలల క్రితం తెలంగాణ లాయర్లు ఆయనకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళినపుడు పోలీసులు సృష్టించిన హడావుడి ఉద్రిక్తతకు దారితీసింది. అప్పుడు కావూరివారు “రెండు కాకపోతే…

అప్పు పరిమితి పెంపుపై ఒప్పందం శూన్యం, టాప్ క్రెడిట్ రేటింగ్ కోల్పోనున్న అమెరికా?

అమెరికా అప్పు పరిమితిని 14.3 ట్రిలియన్ డాలర్లనుండి పెంచడానికి ఒబామాకి, రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి మధ్య ఒప్పందం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఆగస్టు 2 లోపు అప్పు పరిమితి పెంచడంపై నిర్ణయం తీసుకోనట్లయితే అమెరికా అప్పు చెల్లించలేని పరిస్ధితి వస్తుందని ట్రేజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ ఇప్పటికె పలుమార్లు హెచ్చరించాడు. దీనితో అమెరికా సావరిన్ అప్పు రేటింగ్ (క్రెడిట్ రేటింగ్) ను, మూడు క్రెడిట్ రేటింగ్ సంస్ధల్లో ఏదో ఒకటి…

లేదు లేదంటూనే ప్రధాని, చిదంబరంలను మళ్ళీ కోర్టులో ప్రస్తావించిన ఎ.రాజా

సోమవారం కోర్టులో తాను ప్రధాని మన్మోహన్, మాజీ అర్ధిక మంత్రి, ప్రస్తుత హోం మంత్రి చిదంబరం లకు వ్యతిరేకంగా ఆరోపణలను చేశాననడం మీడియా సృష్టి అవి చెబుతూ, మీడియాను చేస్తే సరిగా రిపోర్టు చేయమనండి లేదా బైటికి పంపించండి అని మంగళవారం జడ్జిని కోరిన మాజీ టెలికం మంత్రి ఎ.రాజా, మళ్ళీ మన్మోహన్, చిదంబరం ల పేర్లను తన వాదనలో ప్రస్తావించాడు. సోమవారం కంటే ఈ సారి కాసింత నేరుగానే వారిపై ఆరోపణలు సంధించే ప్రయత్నం చేశాడు.…

11వ సారి వడ్డీ రేట్లు పెంచిన ఆర్.బి.ఐ, షేర్ మార్కెట్లు బేజారు

ఆర్.బి.ఐ జులై ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా పదకొండవసారి తన వడ్డీ రేట్లు పెంచింది. ఊహించినదాని కంటె ఎక్కువగా పెంచడంతో షేర్ మార్కెట్లు బేజారెత్తాయి. అమ్మకాల ఒత్తిడికి గురై సెన్సెక్స్ సూచి 1.87 శాతం పతనమైంది. అమెరికా సమయానికి అప్పు చెల్లింపులు చేయలేకపోవచ్చన్న అనుమానాలు ఒకవైపు పెరుగుతుండగా ఆర్.బి.ఐ వడ్డీ రేట్ల పెంపుదలలో తీవ్రతను చూపడంతో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని అందరూ అంచనా వేస్తుండగా ఆర్.బి.ఐ గవర్నరు మరొకసారి మార్కెట్…

నార్వే ఊచకోత నిందితుడికి ఇంగ్లండ్‌ రైటిస్టు తీవ్రవాదులతో సంబంధాలు?!

నార్వే ఊచకోతతో యూరప్ ఉలిక్కిపడింది. తమ దేశాల్లొ రైటిస్టుల గురించి ఆరా తీయడం ప్రారంభిస్తున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో జంట దాడుల్లో 92 మందిని ఊచకోత కూసిన ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్, తనకు ఇంగ్లండులోని రైటిస్టు తీవ్రవాద సంస్ధలతో సంబంధాలున్నాయని చెప్పడంతో స్కాట్లండ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా “ఇంగ్లీష్ డిఫెన్సు లీగ్” (ఇ.డి.ఎల్) సంస్ధతొ తనకు గట్టి సంబంధాలున్నాయని బ్రీవిక్ తెలిపాడు. ఇ.డి.ఎల్ సంస్ధ కూడా ముస్లిం వ్యతిరేక సంస్ధ. వలసదారులను వ్యతిరేకిస్తుంది. బహుళ సంస్కృతి…

నార్వే హత్యాకాండ నిందితుడితో ఇండియా కనెక్షన్!

జులై 22 తేదీన నార్వేలో సమ్మర్ క్యాంప్ కోలాహలంలో మునిగి ఉన్న టీనేజి యువతీ యువకులు 85 మందిని ఊచకోత కోసిన ముస్లిం ద్వేషి, మితవాద క్రిస్టియన్ తీవ్రవాది ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ తో ఇండియాతో గల కనెక్షన్ ఒకటి బైటపడింది. ఆందోళన పడవలసిన కనెక్షన్ కాదు గాని, అనూహ్యమైన కనెక్షన్. బ్రీవిక్ వెబ్‌సైట్ లో ఉంచిన మానిఫెస్టోలో పేర్కొన్న తీవ్రవాద సంస్ధ సభ్యులు ధరించడానికి బ్యాడ్జిని తయారు చేయడానికి ఆయన భారత దేశానికి చెందిన ఒక…

కాంగ్రెస్ పార్టీ ఓ సర్కస్‌లా తయారయ్యింది -కాంగ్రెస్ నాయకుడు మణి శంకర్ అయ్యర్

కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపుల ఘర్షణ వీధికెక్కుతున్నట్లు కనిపిస్తోంది. రాహుల్, దిగ్విజయ్, సోనియాల పర్యవేక్షణలోని నెహ్రూ/ఇందిరా స్కూల్ ఆర్ధిక విధానాలకీ, మన్మోహన్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, పి.చిదంబరం, కపిల్ సిబాల్ తదితరుల అమెరికా/ఎల్.పి.జి (లిబరలైజేషన్, ప్రవేటైజేషన్, గ్లోబలైజేషన్) స్కూల్ ఆర్ధిక విధానాలకి ఘర్షణ, ఐక్యతలు కొనసాగుతున పరిస్ధితి అందరూ ఎరిగినదే. లోలోపలి సమావేశాల్లోనూ, మంత్రుల నియామకాలు, తొలగింపుల రూపంలోనూ వీరి ఘర్షణ వ్యక్తమవుతూ వస్తున్నది. ఐతే నెహ్రూ స్కూల్ సీనియర్ నాయకులను సుదీర్ఘకాలం పాటు పక్కనబెడుతుండడంతో వారు…

టెలికం (2జి) కుంభకోణంలో మన్మోహన్, చిదంబరంలు రాజీనామా చేయాలి -బి.జె.పి

మాజీ టెలికం మంత్రి ఎ.రాజా 2జి స్పెక్ట్రం లైసెన్సులను చౌకరేట్లకు జారీ చేసిన నిర్ణయంలో ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి ఆర్ధిక మంత్రి పి.చిదంబరం పాత్ర కూడా ఉందనీ, వారికి తెలియకుండా ఏ నిర్ణయమూ జరిగే అవకాశం లేదనీ ఢిల్లీలోని సి.బి.ఐ ప్రత్యేక కోర్టుకు విన్నవించుకున్న నేపధ్యంలో వారిద్దరూ వెంటనే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే ఫోన్‌ను ట్యాప్ చేయడం, అక్రమ మైనింగ్ కుంభకోణంలో కర్ణాటక సి.ఎం…

కోర్టులో మన్మోహన్, చిదంబరం పేర్లను ప్రస్తావించిన మాజీ టెలికం మంత్రి ఎ.రాజా

ఎ.రాజా. టెలికం కుంభకోణానికి కేంద్ర బిందువు. తానొక్కడే ఎందుకు బలికావాలనుకొన్నాడో ఏమో! నేరుగా ప్రధాని మన్మోహన్‌నే కోర్టుకి లాగినంతపని చేశాడు. సుప్రీం కోర్టుతో పాటు కోర్టులన్నీ ఇదే రీతిలో తన పని తాను చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మన్మోహన్ కూడా బోను ఎక్కవలసి రావచ్చు. కర్టాక టూరిజం శాఖ మంత్రి జనార్ధన రెడ్డి అక్రమ మైనింగ్ జరిపినందుకు చూస్తూ ఊరకున్న ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా బాధ్యుడే నని కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే తన నివేదికలో తేల్చాడు.…

కృష్ణ నాయకత్వంలో ఎంక్వైరీ కమిటీ వేసుకోండి -ఫోన్ ట్యాపింగ్‌పై ప్రధానికి యెడ్యూరప్ప సవాల్

ఇద్దరు వెధవలు కొట్లాడుకుంటూ తిట్టుకుంటున్నారట. “నువ్వు వెధవాయ్‌వి” అని ఒకడంటే, “నాకంటె నువు పెద్ద వెధవాయ్‌వి కదా” అని మరొకడు. చూసేవారికీ, వినేవారికీ ఇద్దరూ వెధవాయ్‌లేనని అర్ధమైపోతుంది. అలానే ఉంది కాంగ్రెస్, బి.జె.పి నాయకుల వ్యవహారం. కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డె అక్రమ మైనింగ్‌లో సి.ఎం యెడ్యూరప్పకి పరోక్షంగా బాధ్యత ఉందని తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అది కాకుండా లోకాయుక్త తన ఫోన్ ట్యాపింగ్ చేసారని ఆరోపించాడు. రెండింటికి బాధ్యత వహిస్తూ యెడ్యూరప్ప రాజీనామా…