ప్రతిపక్షాల కుంభకోణాలకేమీ తక్కువలేదు, మాకేం భయం? -ప్రధాని

అటు పాలక పక్షాలు, ఇటు ప్రతిపక్షాలూ… ఎవర్ని కదిలించినా తాము “సాధు పుంగవులమ”నే అంటారు. “కోరికలసలే లేక ప్రజాసేవలో తరించవచ్చిన సన్యాసులమే” అంటారు. మరే! రాజకీయ నాయకులు వారు చెప్పుకున్నట్లు కోరికలు లేని సన్యాసులే. అపుడు ‘సన్యాసీ సన్యాసీ రాసుకుంటే రాలేది బూడిదే’ అన్నది పాతకాలపు సామెత గా రద్దవుతుంది. ‘సన్యాసీ సన్యాసీ రాసుకుంటే రాలతాయి బోలెడు కుంభకోణాలు’ అన్నది ఆధునిక నియమంగా స్ధిరపడుతుంది. ప్రధాని మన్మోహన్ వెల్లడించిన ధైర్యంలో ఆ సంకేతాలే కనపడుతున్నాయి. సోమవారం వర్షాకాల…

బీహార్ పాఠశాల గ్రంధాలయాల్లొ అర్.ఎస్.ఎస్ పుస్తకాలు -జె.డి(యు) రెబెల్స్

తనను తాను అసలైన సెక్యులరిస్టుగా చెప్పుకునే నితీష్ కుమార్ బీహార్ పాఠశాలల కోసం ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతాలను బోధించే పుస్తకాలను కొనడానికి అనుమతించాడని జనతా దళ్ (యునైటెడ్) పార్టీ తిరుగుబాటు నాయకుడు ఒకరు ఆదివారం వెల్లడించాడు. మతన్మోదాన్ని, విద్వేషాలనూ రెచ్చగొట్టే ఈ పుస్తకాలను వెంటనే పాఠశాలల గ్రంధాలయాలనుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశాడు. ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి ఆర్.ఎస్.ఎస్ భావాల వ్యాప్తికి దోహదం చేసే పుస్తకాలను కొనుగోలు చేసి పాఠశాల పిల్లలకు అందుబాటులో ఉంచడం తగదని ఉపేంద్ర…

2జి కుంభకోణానికి ‘తెలంగాణ డిమాండ్’ అడ్డు చక్రం, కాంగ్రెస్ వ్యూహం

పాలక కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుభవం అపారం. ఏ బిల్లుని ఎలా ఆమోదింపజేసుకోవాలో, ఏ ఆందోళననను ఎలా తప్పించుకోవాలో, ఏ సంకటం నుండి ఎలా బైటపడాలో కాంగ్రెస్ పాలకులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. సోమవారం నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వానికి పెద్ద గండంగా మారాయి. ఓవైపు తాము నిండా మునిగి ఉన్న కుంభకోణాలకు సమాధానం చెప్పుకోవలసి ఉండగా, మరొక వైపు అంతర్జాతీయ పెట్టుబడుదారులనుండీ,…

పోస్టాఫీసులు రద్దు చేసి బ్యాంకులు నెలకొల్పుతాం -కపిల్ సిబాల్

దేశ వ్యాపితంగా ఉన్న 1.5 లక్షల పోస్టాఫిసులపై ప్రవేటీకరణ మంత్రుల కన్నుపడింది. ప్రభుత్వంలో ప్రవేటీకరణ కోసం, నూతన ఆర్ధిక విధానాలను వేగంగా అమలు చేయడం కోసం ప్రత్యేకంగా కొంతమంది మంత్రులను ప్రధాని మన్మోహన్ నియమించుకున్నాడు. వారిలో కపిల్ సిబాల్ ఒకరు. ఈయన పూర్వాశ్రమంలో సుప్రీం కోర్టులో పేరు మోసిన న్యాయవాది. అమెరికా పాలకులకు ఇష్టుడు. 2జి కుంభకోణం వలన ప్రభుత్వానికి రు.176,000 కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని భారత అత్యున్నత ఆడిటింగ్ సంస్ధ చెప్పగా, కపిల్ సిబాల్…

సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోని బళ్ళారి మైనింగ్ మాఫియా, ఖనిజం సీజ్

మాఫియాకి తీర్పులు, ఆదేశాలు ఒక అడ్డా? కోర్టుల తీర్పులు, ప్రభుత్వాల ఆదేశాలే దానికి అడ్డయితే అది మాఫియా కాదేమో! గత గురువారం బళ్ళారిలో ఇనుప ఖనిజం తవ్వకాలను, రవాణాను సస్పెండ్ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ బళ్ళారి నుండి 49 ట్రక్కులతో ఇనుప ఖనిజం రావాణా చేస్తూ బళ్ళారి వద్ద దొరికిపోయారు. బళ్ళారి శివార్లలో ఉన్న ఆలిఘర్ వద్ద ఇనుప ఖనిజాన్ని చట్ట విరుద్ధంగా రవాణా చేస్తుండగా జిల్లా…