అమెరికా కంటే యాపిల్ కంపెనీ వద్దే డబ్బు ఎక్కువగా ఉంది!

ప్రస్తుతం అమెరికా కోశాగార విభాగం కంటే యాపిల్ కంపెనీ వద్దే డబ్బు ఎక్కువగా ఉన్న సంగతి వెల్లడయ్యింది. తాజా గణాంకాల ప్రకారం, అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వద్ద ఆపరేటింగ్ ఖర్చుల కోసం 73.7 బిలియన్ డాలర్ల సొమ్ము ఉంది. ఐఫోన్, ఐప్యాడ్ ల సృష్టికర్త యాపిల్ కంపెనీ అత్యంత తాజాగా వెల్లడించిన ఫైనాన్షియల్ ఫలితాల ప్రకారం కంపెనీ వద్ద 76.4 బిలియన్ డాలర్లు ఉంది. అంటే అమెరికా కోశాగారం కంటే 2.7 బిలియన్ డాలర్లు యాపిల్ కంపెనీ…

‘ఫ్యాషన్ ఐకాన్‌’ గా చిత్రించడంపై ఆగ్రహించిన పాక్ విదేశీ మంత్రి హైనా రబ్బాని

భారత పత్రికలు పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హైనా రబ్బానీ ఖర్, తనను భారత పత్రికలు ‘ఫ్యాషన్ ఐకాన్’ గా అభివర్ణించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి చోటా పేపరాజ్జీ ఎదురవుతూనే ఉంటుందనీ పత్రికలు అలా వ్యవహరించడం సరికాదని పాకిస్ధాన్ మీడియా వేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. ఆ ప్రశ్న అనంతరం మరో ప్రశ్న వేయడానికి మీడియాకి అనుమతి ఇవ్వకుండా వెళ్ళిపోయేంతగా హైనా రబ్బానీ తనపై వచ్చిన ముద్ర పట్ల ఆగ్రహం చెందింది. ఇటీవల భారత…

అమెరికా ఆర్ధిక వృద్ధి అనుకున్నదానికంటే ఘోరం

అమెరికా ఆర్ధిక వృద్ధిలో తగ్గుదల అనుకున్నదానికంటే ఎక్కువగా ఉందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెండవ క్వార్టర్‌లో (ఏప్రిల్ నుండి జూన్ 2011 వరకు) అమెరికా ఆర్ధిక వ్యవస్ధ 1.3 శాతం మాత్రమే వృద్ధి చెందింది. ఇది కూడా వార్షిక రేటు మాత్రమే. క్వార్టరులో చూస్తే 0.35 శాతమే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ రెండో క్వార్టర్ లో వృద్ధి చెందింది. ఇంకా ఘోరం ఏమిటంటే, మొదటి క్వార్టర్ లో (జనవరి నుండి మార్చి 2011 వరకు) అమెరికా…

మీడియా రారాజు రూపర్డ్ మర్డోక్, మీడియాతోనే ఇబ్బందిపడుతున్న వేళ -కార్టూన్

స్టార్ ఛానెళ్ల అధినేత, “న్యూస్ ఆఫ్ ది వరల్డ్”, “ది సన్” లాంటి టాబ్లాయిడ్ పత్రికలతో బ్రిటన్‌లో అత్యధిక సర్క్యులేషన్ సాధించిన మీడీయా రారాజు రూపర్డ్ మర్డోక్ ఇప్పుడు ఆ మీడియాతోనే ఇబ్బందిపడిపోతున్నాడు. పత్రికకు అగ్ర స్ధానం సంపాదించడానికీ, ఆ తర్వాత అగ్ర స్ధానన్ని నిలబెట్టుకోడానికి అనేక అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన రూపర్డ్ మర్డోక్ తాను కూడా అందుకు అతీతుడను కానని అర్ధమై, తన ముఖం ఎలాంటిదో అద్దంలో ప్రతిబింబుస్తుండడంతో అసహనానికి లోనవుతున్నాడు. హత్యకు గురైన బాలిక…

రాజీనామాకి యెడ్యూరప్ప షరతులు, కర్ణాటక బి.జె.పిలో ప్రతిష్టంభన

కర్ణాటక ముఖ్యమంత్రి తనపై లోకాయుక్త నివేదికలో అక్రమ మైనింగ్ కుంభకోణంలో భాగస్వామ్యం వహించిన ఆరోపణలు చేయడంతో హైకమాండ్ ఆదేశాల మేరకు రాజీనామా చేస్తానని యెడ్యూరప్ప అంగీకరించినా, తీరా కేంద్ర పరిశీలకులు వచ్చాక మొండికేశాడు. కొన్ని షరతులు విధించి అవి నెరవేరితేనే రాజీనామా చేస్తానని చెబుతున్నాడు. తన మద్దతుదారులను పెద్ద సంఖ్యంలో తన అధికారిక నివాసం వద్దకు పిలిపించుకుని వారి చేత ఆందోళన చేయిస్తునాడు. యెడ్యూరప్పను కొనసాగనివ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనితో కర్ణాటక వచ్చిన కేంద్ర బృందం…

లిబియా తిరుగుబాటు సైన్యాధ్యక్షుడి హత్య, బ్రిటన్‌లో అంతర్మధనం?!

లిబియాలో తిరుగుబాటు ఆరంభం ఐనప్పటి ప్రారంభ దశలోనే తిరుగుబాటుదారుల పక్షం చేరిపోయి వారితో కలిసి గడ్డాఫీ బలగాలపై పోరాటం చేస్తున్న అత్యున్నత మిలట్రీ అధికారి జనరల్ అబ్దుల్ ఫతా యూనెస్, దారుణంగా హత్యకు గురికావడం లిబియాతో పాటు లిబియా తిరుగుబాటుకి మద్దతు తెలిపిన బ్రిటన్, ఫ్రాన్సు దేశాలకు కూడా కలవరపాటుకి గురిచేసింది. ఆయిల్ పట్టణం బ్రెగా వద్ద ఫ్రంట్ లైన్ యుద్ధంలో పాల్గొంటున్న అబ్దుల్ ఫతాను గురువారం తిరుగుబాటుదారుల రాజధాని బెంఘాజికి వెనక్కి పిలిపించిన తర్వాత అక్కడ…

ఇండియా జి.డి.పి వృద్ధి రేటు Vs. ద్రవ్యోల్బణం -కార్టూన్

రెండంకెల జి.డి.పి వృద్ధి రేటు కోసం భారత ప్రభుత్వ ఆర్ధిక విధానాల రూపకర్తలు మన్మోహన్, ప్రణబ్, అహ్లూవాలియా, చిదంబరం తదితరులు కలలు కంటుండగా అధిక స్ధాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం వారి కలలను కల్లలుగా మారుస్తోంది. 9 శాతం జిడిపి వృద్ధి రేటుకి మురిసిపోయే మన పాలకులు ఆహార, ఎనర్జీ ద్రవ్యోల్బణాల వలన దేశ ప్రజానీకం జీవనం దుర్భరంగా మారిందన్న సంగతిని పట్టించుకోరు. ఆర్ధిక గణాంకాలతో ఓ ఊహా ప్రపంచం నిర్మించుకుని సంతుష్టి చెందడమే తప్ప నిజ జీవితంలో…