బళ్లారి ఇనుప ఖనిజ తవ్వకాలతో పర్యావరణ హాని, తవ్వకాలను సస్పెండ్ చేసిన సుప్రీం కోర్టు

ఇనుప ఖనిజాన్ని విచక్షణా రహితంగా తవ్వి తీస్తుండడం వలన పర్యావరణానికి తీవ్ర హాని సంభవిస్తున్నదని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నివేదిక సపర్పించడంతో బళ్లారిలో ఇనుప ఖనిజ తవ్వకాలను సస్పెండ్ చేస్తున్నట్లుగా సుప్రీం కోర్టు ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. “తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకూ బళ్లారిలో ఇనుప ఖనిజం తవ్వకాలను నిలిపివేయాలని ఈ కోర్టు భావిస్తునది” అని ఛీఫ్ జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా నేతృత్వంలోని ప్రత్యేక కోర్టు ప్రకటించింది. దేశంలోని ఉక్కు పరిశ్రమ అవసరాలు తీర్చడానికి…

వరుసగా నాల్గవరోజు నష్టపోయిన భారత షేర్ మార్కెట్లు

భారత షేర్ మార్కెట్లు వరుసగా నాల్గవ రోజు కూడా నష్టపోయాయి. బి.ఎస్.ఇ సెన్సెక్స్ 12.32 పాయింట్లు (0.07 శాతం) నష్టపోయి 18197.20 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 5.75 పాయింట్లు (0.1 శాతం) నష్టపోయి 5482 వద్ద ముగిసింది. ఫండ్లు, మదుపుదారులు రియాల్టీ, మెటల్, ఆయిల్ & గ్యాస్, విద్యుత్ రంగాల షేర్లను అమ్మడంతో షేర్ మార్కెట్లు నష్టాలకు గురయ్యాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నుండి అందుతున్న బలహీన సంకేతాలు, భారత దేశంలో ద్రవ్యోల్బణ కట్టడికి మరిన్ని…

లోకాయుక్త హెగ్డె క్షమాపణ చెప్పాలి -రెడ్డి బ్రదర్ డిమాండ్

రెడ్డి బ్రదర్స్ లలో ఒకరైన కర్ణాటక రెవిన్యూ మంత్రి కరుణాకర రెడ్డి తనపైన అక్రమ మైనింగ్ ఆరోపణలు చేసినందుకు లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. తనపైన లోకాయుక్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేనందున క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు  ఓబులాపురం మైనింగ్ కంపెనీ డైకెక్టరుగా తాను 2004 లోనే రిటైర్ అయ్యాననీ, ఆ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రికార్డులు కూడా ఉన్నాయనీ కరుణాకర రెడ్డి తెలిపాడు.…