సుప్రీం కోర్టు తలంటుతో కదిలిన ఢిల్లీ పోలీసులు, ‘నోటుకు ఓటు’ స్కామ్‌లో సంజీవ్ సక్సేనా అరెస్టు

ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు ఒకడుగు ముందుకేశారు. ‘నోటుకు ఓటు’ కుంభకోణం పరిశోధనలో రెండు సంవత్సరాలనుండి ఎటువంటి పురోగతి లేకపోవడంపై సుప్రీం కోర్టు రెండ్రోజుల క్రితం తీవ్ర స్ధాయిలో తలంటడంతో, తమ దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు. ముగ్గురు బి.జె.పి ఎం.పిలు యు.పి.ఎ ప్రభుత్వ విశ్వాస పరీక్షలో అనుకూలంగా ఓటు వేయడానికి అమర్ సింగ్ అనుచరుడు సంజీవ్ సక్సేనా కోటి రూపాయలు ఇచ్చిన ఆరోపణపై సంజీవ్ సక్సేనాను అరెస్టు చేశారు. అయితే అసలు పాత్రధారుడు సంజీవ్ సక్సేనా కాదు. ఆయన…

కొత్తశాఖలో జైరాం రమేష్ మార్కు విధానాలు ప్రారంభం, గ్రామీణాభివృద్ధికి 90,000 కోట్లు

పర్యావరణ శాఖ మంత్రిగా పర్యావరణ నిబంధనలను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నించి ఇతర మంత్రుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్న జైరాం రమేష్ తనకు అప్పజెప్పిన గ్రామిణాభివృద్ధి శాఖలో కూడ తన మార్కు విధానాలను ప్రారంభించాడు. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో (2012-17) గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించే పధకాలన్నింటికీ స్వస్తి చెప్పి, పూర్తిగా నిర్వహణ రాష్ట్రాలకే అప్పజెప్పాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా నిర్ణయించగా, దానికి జైరాం రమేష్ పక్కకు నెట్టి కేంద్ర…

ముంబై పేలుళ్ళ నిందితుల్లో ఒకరి ఊహా చిత్రం రెడీ -ఎ.టి.ఎస్

ముంబై వరుస పేలుళ్ళ నిందితుల్లో ఒకరి ఊహా చిత్రం సిద్ధం చేశామని “యాంటి టెర్రరిస్టు స్క్వాడ్” (ఎ.టి.ఎస్) తెలిపింది. ఊహాచిత్రాన్ని ప్రజలు చూడడానికి విడుదల చేయడం లేదని తెలిపింది. బహుశా నిందితులు అప్రమత్తం అవుతారన్న అనుమానంతో ఎ.టి.ఎస్ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. బాంబు పేలిన ఒక స్ధలంవద్ద ప్రత్యక్ష సాక్షి కధనంపై ఆధారపడి ఈ ఊహాచిత్రాన్ని గీయించినట్లుగా ఎ.టి.ఎస్ తెలిపింది. చిత్రాన్ని వివిధ దర్యాప్తు సంస్ధలకు అందజేశామని తెలిపింది. దర్యాప్తు సంస్ధలతో పాటు కొద్దిమంది ఎన్నుకున్న…