నల్ల డబ్బుపై సిట్ నియామకం సుప్రీం కోర్టు అతి -రివ్యూ పిటిషన్‌లో కేంద్రం

సుప్రీం కోర్టు అతిగా వ్వవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. విదేశాల్లో దాచిన నల్లడబ్బును వెనక్కి తెప్పించడానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో “స్పెషల్ ఇన్‌వెస్టిగేషన్ టీం” ను నియమించడంలో సుప్రీం కోర్టు తన పరిధికి మించి వ్యవహరించిందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ నియామకంపై జారీ చేసిన ఉత్తర్వును సమీక్షించాలని తన పిటిషన్‌లో కోరింది. ఇది “న్యాయవ్యవస్ధ అతి” అని పిటిషన్ లో కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. రిటైర్డ్ సుప్రీం…

రికార్డు స్ధాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఇది చాలదంటున్న ప్రధాని

2010-11 సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్ధాయిలో ఆహార ధాన్యాలను ఇండియా ఉత్పత్తి చేసినట్లు భారత ప్రధాని శనివారం ప్రకటించాడు. ఎన్నడూ లేనంతగా 241 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను పండించినప్పటికీ, అధిక ధరలతో పాటు పెరుగుతున్న డిమాండ్ తట్టుకోవడానికీ ఇంకా అధిక ఉత్పత్తి సాధించవలసి ఉన్నదని ప్రధాని మన్మోహన్ తెలిపాడు. 2007 నుండి 2012 వరకూ ఉన్న11 వ పంచ వర్ష ప్రణాళికలో 4 శాతం వ్యవసాయ వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, వాస్తవంలో…

తమ రాజీనామాలను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్‌ను కలిసిన తెలంగాణ తెలుగు దేశం ఎం.ఎల్.ఎ లు

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత జులై 4 న చేసిన తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు దేశం ఎం.ఎల్.ఎ లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను శనివారం కలిసి విజ్ఞప్తి చేసారు. టి.డి.పి ఫోరం కన్వీనర్ ఇ.దయాకర రావు తెలుగుదేశం ఎం.ఎల్.ఎ ల బృందానికి నాయకత్వం వహించాడు. రాజీనామాలను ఆమోదించడానికి గానీ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ధిష్ట హామీని పొందడం గానీ…

కంప్యూటర్లకు అందుబాటులోకి వచ్చిన కొత్త రూపాయి సింబల్

ఇకనుండి రూపాయి సింబల్‌ను డాలర్, పౌండ్, యూరో లాగా కంప్యూటర్ లో టైప్ చెయ్యవచ్చు. దీనికోసం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ (టి.డి.ఐ.ఎల్) వెబ్ సైట్ (http://tdil-dc.in/) నుండి డౌన్ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయవలసి ఉంటుంది. ఈ వెబ్ సైట్ ఎందువల్లనో ప్రస్తుతం లోడ్ కావడం లేదు.  ఆ తర్వాత కీ బోర్డులో ‘Alt Gr’ ను 4 తో కలిపి టైప్ చేసినట్లయితే రూపాయి సింబల్ కంప్యూటర్ స్క్రీన్ పై ప్రత్యక్షం అవుతుంది.…

ఐ.ఎస్.ఐ అధిపతి అమెరికా పర్యటన విజయవంతం, బాగుపడిన ఐ.ఎస్.ఐ, సి.ఐ.ఎ ల సంబంధాలు

90 మందికి పైగా సి.ఐ.ఎ గూఢచారులను పాకిస్ధాన్ ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగొట్టడంతో పాక్, అమెరికాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టిన సంగతి విదితమే. సి.ఐ.ఎ గూఢచారులను వెనక్కి పంపడంతో అమెరికా కూడా పాకిస్ధాన్ కి ఇవ్వవలసిన 800 మిలియన్ డాలర్ల సహయాన్ని నిలిపివేసింది. తమ గూఢచారులు పాకిస్ధాన్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికే అక్కడ ఉన్నారనీ, వారే లేకపోతే ఇక శిక్షణకి ఇచ్చే సొమ్ము ఇవ్వవలసిన అవసరం లేదనీ సి.ఐ.ఏ అధికారులు, సహాయం నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటన…